Political News

‘ఆపరేషన్ సిందూర్’.. ఈ పేరే ఎందుకు పెట్టారంటే?

భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఈ దాడులు నిర్వహించబడ్డాయి. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది ప్రధాన స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. బహవల్పూర్, మురిడ్కే, సియాల్‌కోట్ వంటి ప్రాంతాలపై గగనతల, భూభాగం నుంచి సమన్విత దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్ లో 90మందికి పైగా ఉగ్ర వాదులు హతమయ్యారని తెలుస్తోంది.

ఈ ఆపరేషన్ పేరు వెనుక ప్రత్యేక అర్థం ఉంది. సాధారణంగా ‘సిందూర్’ అంటే భారతీయ సంప్రదాయంలో వివాహిత మహిళలు ధరించే గుర్తు. కానీ ఈ సందర్భంలో, పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన దారుణ దాడిని గుర్తు చేసేలా, అర్థభరితంగా ఈ ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని పేరు పెట్టారు. ఆ దాడిలో ఉగ్రవాదులు మతం ఆధారంగా పౌరులను హతమార్చిన విషయం తెలిసిందే.

భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ ద్వారా పహల్గామ్‌లో హతమైన అమాయకులకు ఒక విధమైన న్యాయం జరగిందని చూపించాలనుకుంది. ‘సిందూర్’ అనే పదం హిందు మహిళల రక్షణకు, గౌరవానికి ఒక చిహ్నంలా కూడా పనిచేస్తుంది. దానికి తగ్గట్టే, మరణించిన వారికి నివాళి అర్పించే విధంగా ఈ చర్య భారత గౌరవాన్ని నిలబెట్టే సంకేతంగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ దాడులను పర్యవేక్షించారని భద్రతా వర్గాలు వెల్లడించాయి. పాక్ సైనిక స్థావరాల్ని కాకుండా, కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలపైనే దాడులు జరపడం ద్వారా భారత్ తర్కబద్ధంగా వ్యవహరించిందని అధికారులు తెలిపారు. ఈ చర్య తర్వాత సరిహద్దుల వద్ద ఉద్రిక్తత మరింత పెరగడంతో, అంతర్జాతీయ దృష్టి ఈ పరిణామాలపై కేంద్రీకృతమవుతోంది.

This post was last modified on May 7, 2025 11:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

2 hours ago

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

4 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

7 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

7 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

8 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

10 hours ago