Political News

క‌ర్ణుడి చావు.. వైసీపీ ఓట‌మి.. రెండూ ఒక్క‌టే: బొత్స‌

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లుచేశారు. వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్ప‌టికి 11 మాసాలు పూర్త‌యినా.. ఇంకా త‌ప్పులు వెతుకుతూనే ఉన్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఇదేస‌మయంలో ఆయ‌న.. మ‌హాభార‌తంలోని క‌ర్ణుడి చావును వైసీపీ ఓట‌మికి లింకు పెట్టారు. “క‌ర్ణుడి చావుకు 100 కార‌ణాలు ఉన్న‌ట్టే.. వైసీపీ ఓడిపోవ‌డానికి కూడా వంద కార‌ణాలు ఉన్నాయి. ఏం చెప్పమంటారు?” అని మీడియాను ఎదురు ప్ర‌శ్నించారు. క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన ప్ర‌చారం చేసుకోలేకపోవ‌డం వ‌ల్ల తాము ఇచ్చిన ప‌థ‌కాలు ప్ర‌చారంలోకి రాలేక‌పోయాయ‌ని చెప్పారు.

అదేస‌మయంలో టీడీపీ అనుకూల మీడియా చేసిన వ్య‌తిరేక‌ ప్ర‌చారం కూడా వైసీపీ ఓట‌మికి కార‌ణంగా మారింద‌ని బొత్స తెలిపారు. అయితే.. ప‌ర్టిక్యుల‌ర్‌గా ఇదీ కార‌ణం అని చెప్ప‌డానికి త‌మ ద‌గ్గ‌ర ఏమీ కార‌ణాలు క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు. నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌న్న మాట కేవ‌లం క‌ల్పిత‌మేన‌న్నారు. “కూర్చున్న కొమ్మ‌నున‌రుక్కుంటామ‌ని ఎలా అంటారు? అలా కాదు.. మ‌రేవో కార‌ణాలు ఉన్నాయి. మాపై వ్య‌తిరేక ప్ర‌చారం ఎక్కువ‌గా జ‌రిగింది. ” అని బొత్స వ్యాఖ్యానించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కూట‌మి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌ర్షం బీభ‌త్సం సృష్టిస్తే.. రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం 24 గంట‌లు గ‌డిచిన త‌ర్వాత కూడా.. ఏమీ చేయ‌లేద‌న్నారు.

రాజ‌ధాని అమ‌రావ‌తికి మోడీ ఎందుకు వ‌చ్చారో.. ఆయ‌న‌కైనా తెలుసా? అని బొత్స అన్నారు. ఏడాది కాలంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేక పోయింద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ప‌థ‌కాలూ అంద‌డం లేద‌న్నారు. ఈ విష‌యం త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు కూడా చెప్పార‌ని.. ఇప్పుడు ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు. మ‌రోవైపు ల‌క్షా 50 వేల కోట్ల రూపాయ‌ల అప్పులు చేశార‌ని, ఆ సొమ్ములు ఏం చేశారో కూడా తెలియ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రానున్నార‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటార‌ని బొత్స తెలిపారు. త‌మ పార్టీలో ఎవ‌రు ఉన్నా.. జ‌గ‌న్ కోస‌మే ప‌నిచేస్తారని వ్యాఖ్యానించారు.

This post was last modified on May 6, 2025 9:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

47 minutes ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

2 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

2 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

4 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

4 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

5 hours ago