Political News

క‌ర్ణుడి చావు.. వైసీపీ ఓట‌మి.. రెండూ ఒక్క‌టే: బొత్స‌

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లుచేశారు. వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్ప‌టికి 11 మాసాలు పూర్త‌యినా.. ఇంకా త‌ప్పులు వెతుకుతూనే ఉన్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఇదేస‌మయంలో ఆయ‌న.. మ‌హాభార‌తంలోని క‌ర్ణుడి చావును వైసీపీ ఓట‌మికి లింకు పెట్టారు. “క‌ర్ణుడి చావుకు 100 కార‌ణాలు ఉన్న‌ట్టే.. వైసీపీ ఓడిపోవ‌డానికి కూడా వంద కార‌ణాలు ఉన్నాయి. ఏం చెప్పమంటారు?” అని మీడియాను ఎదురు ప్ర‌శ్నించారు. క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన ప్ర‌చారం చేసుకోలేకపోవ‌డం వ‌ల్ల తాము ఇచ్చిన ప‌థ‌కాలు ప్ర‌చారంలోకి రాలేక‌పోయాయ‌ని చెప్పారు.

అదేస‌మయంలో టీడీపీ అనుకూల మీడియా చేసిన వ్య‌తిరేక‌ ప్ర‌చారం కూడా వైసీపీ ఓట‌మికి కార‌ణంగా మారింద‌ని బొత్స తెలిపారు. అయితే.. ప‌ర్టిక్యుల‌ర్‌గా ఇదీ కార‌ణం అని చెప్ప‌డానికి త‌మ ద‌గ్గ‌ర ఏమీ కార‌ణాలు క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు. నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌న్న మాట కేవ‌లం క‌ల్పిత‌మేన‌న్నారు. “కూర్చున్న కొమ్మ‌నున‌రుక్కుంటామ‌ని ఎలా అంటారు? అలా కాదు.. మ‌రేవో కార‌ణాలు ఉన్నాయి. మాపై వ్య‌తిరేక ప్ర‌చారం ఎక్కువ‌గా జ‌రిగింది. ” అని బొత్స వ్యాఖ్యానించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కూట‌మి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌ర్షం బీభ‌త్సం సృష్టిస్తే.. రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం 24 గంట‌లు గ‌డిచిన త‌ర్వాత కూడా.. ఏమీ చేయ‌లేద‌న్నారు.

రాజ‌ధాని అమ‌రావ‌తికి మోడీ ఎందుకు వ‌చ్చారో.. ఆయ‌న‌కైనా తెలుసా? అని బొత్స అన్నారు. ఏడాది కాలంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేక పోయింద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ప‌థ‌కాలూ అంద‌డం లేద‌న్నారు. ఈ విష‌యం త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు కూడా చెప్పార‌ని.. ఇప్పుడు ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు. మ‌రోవైపు ల‌క్షా 50 వేల కోట్ల రూపాయ‌ల అప్పులు చేశార‌ని, ఆ సొమ్ములు ఏం చేశారో కూడా తెలియ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రానున్నార‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటార‌ని బొత్స తెలిపారు. త‌మ పార్టీలో ఎవ‌రు ఉన్నా.. జ‌గ‌న్ కోస‌మే ప‌నిచేస్తారని వ్యాఖ్యానించారు.

This post was last modified on May 6, 2025 9:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

1 hour ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

1 hour ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

3 hours ago

అన్వేషణ హద్దు దాటేస్తుందా?

నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది...! యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితమే.…

3 hours ago

హ‌రీష్‌రావు కంచుకోట‌ను క‌విత బ‌ద్ద‌లు కొట్ట‌గ‌లదా?

బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి.. అంత‌కుమించి మాట‌ల మాంత్రీకుడు.. త‌న్నీరు హ‌రీష్ రావు గురించి చెప్ప‌డానికి ఇవి చాలు.…

3 hours ago

మాఫియా రాజ్యంలో ‘టాక్సిక్’ రక్తపాతం

కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యష్ వచ్చే నెల టాక్సిక్ తో రాబోతున్న…

4 hours ago