Political News

తొందరలోనే టీటీడీ ఎఫ్ఎం రేడియో

సుమారు ఆరు మాసాల్లోపు తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని భక్తుల ఎప్పటి నుండో కోరుతున్నారు. ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో కేంద్రం ఏర్పాటు చేసుకుంటే వెంకటేశ్వరస్వామి భక్తి పాటలు, అన్నమయ్య కీర్తనలు, శ్రీవారి పూజా కైంకర్యాలను, తిరుమల ఆలయంలో జరిగే కల్యాణోత్సవాలను ప్రతిరోజు వినే భాగ్యం దక్కుతుందని భక్తులు చాలా కాలంగా అడుగుతున్నారు.

భక్తుల నుండి పెరిగిపోతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని టీటీడీ పాలకవర్గం కూడా సానుకూలంగా స్పందించింది. ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాలు మొత్తానికి ఓ రూపుకొచ్చాయి. టీటీడీ తరపున ప్రత్యేకంగా ఓ ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవటానికి కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ అనుమతించింది.

ఎస్వీబీసీ ఛానల్ కార్యాలయం నుండి ఎఫ్ఎం రేడియో ప్రసారాలు కూడా మొదలవుతాయి. ఇక్కడే కార్యక్రమాలను రూపకల్పన కూడా జరగటానికి టీటీడీ బోర్డు సమావేశంలో ఆమోదం దక్కింది. ఏపీ, తమిళనాడు, కర్నాటకలోని దూరదర్శన్ ప్రసారాలకు ఉపయోగిస్తున్న టవర్లను ఉపయోగించుకునేట్లుగా అనుమతి తీసుకున్నది టీటీడీ యాజమాన్యం. కాబట్టి తిరుపతి నుండి పై టవర్ల ద్వారా 100 కిలోమీటర్ల పరిధిలో ప్రతిరోజు శ్రీవారి భక్తి కార్యక్రమాలు, అన్నమయ్య పాటలు, పూజా విధానాలతో పాటు తిరుమలలో జరిగే అనౌన్స్ మెంట్లు కూడా భక్తులు వినచ్చు.

This post was last modified on November 5, 2020 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

31 minutes ago

ప్యాన్ ఇండియా ‘డెవిల్’ టాక్ ఏంటి

మనకు డెవిల్ అంటే ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా గుర్తొస్తుంది కానీ ఇటీవలే కన్నడలో విడుదలైన భారీ…

1 hour ago

మెగా ఛాన్స్ వదిలేసిన విశ్వంభర

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…

2 hours ago

హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?

గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…

2 hours ago

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

3 hours ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

5 hours ago