Political News

తొందరలోనే టీటీడీ ఎఫ్ఎం రేడియో

సుమారు ఆరు మాసాల్లోపు తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని భక్తుల ఎప్పటి నుండో కోరుతున్నారు. ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో కేంద్రం ఏర్పాటు చేసుకుంటే వెంకటేశ్వరస్వామి భక్తి పాటలు, అన్నమయ్య కీర్తనలు, శ్రీవారి పూజా కైంకర్యాలను, తిరుమల ఆలయంలో జరిగే కల్యాణోత్సవాలను ప్రతిరోజు వినే భాగ్యం దక్కుతుందని భక్తులు చాలా కాలంగా అడుగుతున్నారు.

భక్తుల నుండి పెరిగిపోతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని టీటీడీ పాలకవర్గం కూడా సానుకూలంగా స్పందించింది. ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాలు మొత్తానికి ఓ రూపుకొచ్చాయి. టీటీడీ తరపున ప్రత్యేకంగా ఓ ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవటానికి కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ అనుమతించింది.

ఎస్వీబీసీ ఛానల్ కార్యాలయం నుండి ఎఫ్ఎం రేడియో ప్రసారాలు కూడా మొదలవుతాయి. ఇక్కడే కార్యక్రమాలను రూపకల్పన కూడా జరగటానికి టీటీడీ బోర్డు సమావేశంలో ఆమోదం దక్కింది. ఏపీ, తమిళనాడు, కర్నాటకలోని దూరదర్శన్ ప్రసారాలకు ఉపయోగిస్తున్న టవర్లను ఉపయోగించుకునేట్లుగా అనుమతి తీసుకున్నది టీటీడీ యాజమాన్యం. కాబట్టి తిరుపతి నుండి పై టవర్ల ద్వారా 100 కిలోమీటర్ల పరిధిలో ప్రతిరోజు శ్రీవారి భక్తి కార్యక్రమాలు, అన్నమయ్య పాటలు, పూజా విధానాలతో పాటు తిరుమలలో జరిగే అనౌన్స్ మెంట్లు కూడా భక్తులు వినచ్చు.

This post was last modified on November 5, 2020 10:15 am

Share
Show comments
Published by
satya

Recent Posts

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

6 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

7 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

11 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

14 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

15 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

16 hours ago