సుమారు ఆరు మాసాల్లోపు తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని భక్తుల ఎప్పటి నుండో కోరుతున్నారు. ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో కేంద్రం ఏర్పాటు చేసుకుంటే వెంకటేశ్వరస్వామి భక్తి పాటలు, అన్నమయ్య కీర్తనలు, శ్రీవారి పూజా కైంకర్యాలను, తిరుమల ఆలయంలో జరిగే కల్యాణోత్సవాలను ప్రతిరోజు వినే భాగ్యం దక్కుతుందని భక్తులు చాలా కాలంగా అడుగుతున్నారు.
భక్తుల నుండి పెరిగిపోతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని టీటీడీ పాలకవర్గం కూడా సానుకూలంగా స్పందించింది. ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాలు మొత్తానికి ఓ రూపుకొచ్చాయి. టీటీడీ తరపున ప్రత్యేకంగా ఓ ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవటానికి కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ అనుమతించింది.
ఎస్వీబీసీ ఛానల్ కార్యాలయం నుండి ఎఫ్ఎం రేడియో ప్రసారాలు కూడా మొదలవుతాయి. ఇక్కడే కార్యక్రమాలను రూపకల్పన కూడా జరగటానికి టీటీడీ బోర్డు సమావేశంలో ఆమోదం దక్కింది. ఏపీ, తమిళనాడు, కర్నాటకలోని దూరదర్శన్ ప్రసారాలకు ఉపయోగిస్తున్న టవర్లను ఉపయోగించుకునేట్లుగా అనుమతి తీసుకున్నది టీటీడీ యాజమాన్యం. కాబట్టి తిరుపతి నుండి పై టవర్ల ద్వారా 100 కిలోమీటర్ల పరిధిలో ప్రతిరోజు శ్రీవారి భక్తి కార్యక్రమాలు, అన్నమయ్య పాటలు, పూజా విధానాలతో పాటు తిరుమలలో జరిగే అనౌన్స్ మెంట్లు కూడా భక్తులు వినచ్చు.
This post was last modified on November 5, 2020 10:15 am
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…