తెలుగు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. అన్వేష్. ‘నా అన్వేషణ’ పేరుతో అతను ఎన్నో దేశాలు తిరుగుతూ ట్రావెల్ వీడియోలు చేస్తుంటాడు. యూట్యూబ్లో 24 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారతడికి. క్రేజీగా వీడియోలు చేస్తూ, బూతులు జోడించి దూకుడుగా కామెంట్రీ చెబుతూ ఫాలోవర్లను బాగానే పెంచుకున్నాడు అన్వేష్. ఈ మధ్య అతను బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వారి మీద యుద్ధం ప్రకటించి గట్టిగానే పోరాడుతున్నాడు. హర్ష సాయి సహా చాలామందిని ఎక్స్పోజ్ చేసి మంచి పేరే సంపాదించాడు. కానీ కొన్నిసార్లు అతడి మాటలు, ఆరోపణలు హద్దులు దాటిపోతుంటాయి.
ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి అతను యథాలాపంగా తీవ్ర ఆరోపణలే చేసేశాడు. హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ డీల్స్లో భాగంగా ఏకంగా రూ.300 కోట్ల స్కామ్ జరిగిందంటూ అన్వేష్ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. తెలంగాణ డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి, మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి.. ఇలా చాలామంది మీద అతను ఆరోపణలు చేసేశాడు.
వీళ్లందరూ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలతో రూ.300 కోట్లు సంపాదించారని ఆరోపించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వ్యవహారం సీరియస్ అయిపోయింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ ఆరోపణల మీద ఫిర్యాదు చేశారు. దీంతో అన్వేష్ మీద కేసు నమోదైంది. అన్వేష్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఈ ఆరోపణల వీడియోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లే కనిపిస్తోంది. దీంతో అన్వేష్ను ఇండియాకు రప్పించడమో.. లేక వచ్చినపుడు అరెస్ట్ చేయడమో తథ్యంగా కనిపిస్తోంది. తనపై కేసు నమోదైన నేపథ్యంలో అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
This post was last modified on May 4, 2025 7:59 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…