తెలుగు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. అన్వేష్. ‘నా అన్వేషణ’ పేరుతో అతను ఎన్నో దేశాలు తిరుగుతూ ట్రావెల్ వీడియోలు చేస్తుంటాడు. యూట్యూబ్లో 24 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారతడికి. క్రేజీగా వీడియోలు చేస్తూ, బూతులు జోడించి దూకుడుగా కామెంట్రీ చెబుతూ ఫాలోవర్లను బాగానే పెంచుకున్నాడు అన్వేష్. ఈ మధ్య అతను బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వారి మీద యుద్ధం ప్రకటించి గట్టిగానే పోరాడుతున్నాడు. హర్ష సాయి సహా చాలామందిని ఎక్స్పోజ్ చేసి మంచి పేరే సంపాదించాడు. కానీ కొన్నిసార్లు అతడి మాటలు, ఆరోపణలు హద్దులు దాటిపోతుంటాయి.
ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి అతను యథాలాపంగా తీవ్ర ఆరోపణలే చేసేశాడు. హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ డీల్స్లో భాగంగా ఏకంగా రూ.300 కోట్ల స్కామ్ జరిగిందంటూ అన్వేష్ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. తెలంగాణ డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి, మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి.. ఇలా చాలామంది మీద అతను ఆరోపణలు చేసేశాడు.
వీళ్లందరూ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలతో రూ.300 కోట్లు సంపాదించారని ఆరోపించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వ్యవహారం సీరియస్ అయిపోయింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ ఆరోపణల మీద ఫిర్యాదు చేశారు. దీంతో అన్వేష్ మీద కేసు నమోదైంది. అన్వేష్కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఈ ఆరోపణల వీడియోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లే కనిపిస్తోంది. దీంతో అన్వేష్ను ఇండియాకు రప్పించడమో.. లేక వచ్చినపుడు అరెస్ట్ చేయడమో తథ్యంగా కనిపిస్తోంది. తనపై కేసు నమోదైన నేపథ్యంలో అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
This post was last modified on May 4, 2025 7:59 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…