Political News

సైకో పోయినా… ఆ చేష్టలు మాత్రం పోలేదు

2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో పోవాలి…సైకిల్ రావాలి అంటూ వినిపించిన ఈ నినాదం కూటమి విజయానికి ఓ బ్రహ్మాస్త్రం మాదిరిగానే పని చేసింది. రాజధాని అమరావతి పట్ల జగన్ వ్యవహరించిన తీరు సైకో మాదిరిగానే ఉందని టీడీపీ శ్రేణులు, రాజదాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు భావించారు తమలోని భావనను వారు రాష్ట్రవ్యాప్తం చేయడంలో సఫలీకృతం అయ్యారు. ఎన్నికల్లో సైకోగా ముద్రపడిపోయిన జగన్ అధికారం నుంచి దిగిపోయారు. అయితే నాటి సైకో పాలనలో చోటుచేసుకున్న సైకో చేష్టలు మాత్రం ఇప్పటికీ పోలేదనే చెప్పాలి.

నిజమే… ఏపీలో సైకో పాలన ముగిసినా… సైకో చేష్టలు ముగిసిపోలేదన్న మాటను నిజం చేస్తూ శనివారం రాజధాని అమరావతి పరిధిలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. అమరావతి పరిధిలోని సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల బ్లాక్ ల నిర్మాణం కోసం 2018లో నాటి సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని ప్రారంభించారు. శనివారం దాకా ఆ శిలాఫలకం చెక్కు చెదరకుండానే కనిపించగా… శనివారం తెల్లారేసరికే శిలాఫలకం ధ్వంసమైపోయింది. శిలాఫలకం ముందు భాగంలో దానిని ప్రారంభించిన నాటి సీఎం చంద్రబాబు, ఇతర ప్రజా ప్రతినిధుల పేర్లు ఉన్న ఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు.

ఈ ఘటన వెలుగులోకి రాగానే కూటమి సర్కారు షాక్ కు గురైంది. ఎందుకంటే… రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను శుక్రవారమే కూటమి సర్కారు ఘనంగా నిర్వహించింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలాంటి సమయంలో అమరావతిలో ఓ కీలక భవన సముదాయ శిలాఫలకాన్ని ఇలా దుండగులు ధ్వంసం చేయడం కూటమి సర్కారును షాక్ కు గురి చేసింది. ఈ చర్య ద్వారా రాజధాని అమరావతిపై ఆ సైకోలు ఇంకా తమ వైఖరిని మార్చుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఓ వైపు పున:నిర్మాణం ఘనంగా జరిగిన రోజు రాత్రే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని చెబుతున్నారు.

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కారు పోలీసులను రంగంలోకి దించింది. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఎవరో తేల్చాలంటూ సర్కారు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సర్కారు ఆదేశాలతో ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు… ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన వెనుక ఉన్నదెవరు? అన్న విషయంపై ప్రధానంగా దృష్టి సారించిన పోలీసులు… పాత్రధారుల వేట మొదలుపెట్టారు. అయితే ఈ కేసులో పాత్రధారుల కంటే కూడా సూత్రధారులను తేల్చే దిశగానే దర్యాప్తు సాగుతోంది. వెరసి భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూసే దిశగా కూటమి సర్కారు కదులుతోంది.

This post was last modified on May 4, 2025 12:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 minute ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago