నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడింది. మే నెల 2న స్వయంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన చేతులతో అమరావతి పనులను పున:ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకున్న రాష్ట్రంలోని కూటమి సర్కారు.. మోదీ టూర్ కు భారీ ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి పరిధిలోని సచివాలయ భవనాల వెనుక బాగాన్ని ఈ కార్యక్రమ నిర్వహణ కోస ఎంపిక చేయగా…ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇటీవలి పెహల్ గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో అమరావతిలో మోదీ టూర్ కు గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను కల్పిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి దాదాపుగా 5 లక్షల మందిని తరలించే దిశగా కూటమి సర్కారు చర్యలు చేపట్టింది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, వారి కుటుంబాలకు ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు ఆహ్వానాలు అందజేశారు. ఈ ఆహ్వానాలు ఉన్న వారిని మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఈ ఇన్విటేషన్ లేకుంటే… ఎట్టి పరిస్థితుల్లోనూ సభా ప్రాంగణంలో అడుగు పెట్టలేని దిశగా భద్రతా చర్యలు జరుగుతున్నాయి. ఈ ఇన్విటేషన్ కార్డును ఇతరులు వినియోగించడానికి కూడా వీల్లేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఇక సభకు వచ్చేవారు ఇన్విటేషన్ తో పాటు రావడంతో పాటు ఖాళీ చేతులతోనే సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టాలని కూడా సీఆర్డీఏ కండీషన్ పెట్టింది.
సభకు వచ్చే వారు మొబైల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, బ్రీఫ్ కేసులు, కెమెరాలు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటర్ బాటిళ్లతో పాటు కార్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కు చెందిన పరికరాలను కూడా తీసుకు రావద్దని సీఆర్డీఏ అధికారులు కోరారు. ఈ మేరకు ఇన్విటేషన్ లోనే ఈ విషయాలను సీఆర్డీఏ విస్పష్టంగా ప్రకటించింది. ఈ నిషేదాజ్ఞలు అమలు అయ్యేలా సీఆర్డీఏ అధికారులు ఏ తరహా చర్యలు తీసుకుంటారోనన్న వాదన ఆసక్తి రేకెత్తిస్తోంది. మొబైల్ ఫోన్లు లేనిదే ఇంటి నుంచి బయట కాలు పెట్టలేని ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిలో ప్రదాని సభకు మొబైళ్లు లేకుడా జనాన్ని ఎలా కట్టడి చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే అధికారుల వినతులు ప్రజల నుంచి కూడా సానుకూల స్పదనే వస్తోందని కూడా తెలుస్తోంది.
అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన దాదాపుగా గంటన్నర పాటు కొనసాగనుంది. పెహల్ గాం ఉగ్ర దాడి నేపథ్యంలో అమరావతిలో మోదీ కార్యక్రమ వేదికపైకి కూడా పరిమితంగానే నేతలను అనుమతించనున్నారు. మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ స్వాగత వాక్యాలతో ప్రారంభం కానున్నఈ కార్యక్రమం..చంద్రబాబు ప్రసంగం, ఆ తర్వాత మోదీ స్పీచ్ లతో ముగియనుంది. అంతకుముందే…అమరావతి పనుల పున:ప్రారంభానికి మోదీ శ్రీకారం చుట్టనున్నారు. మొత్తంగా పెహల్ గాం ఉగ్రదాడి నేపథ్యంలో అమరావతిలో మోదీ టూర్ పై పలు ఆంక్షలు అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on April 30, 2025 6:22 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…