Political News

అమరావతి 2.0 ఇన్విటేషన్ ఇదిగో!… కండీషన్స్ ఇవే!

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడింది. మే నెల 2న స్వయంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన చేతులతో అమరావతి పనులను పున:ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకున్న రాష్ట్రంలోని కూటమి సర్కారు.. మోదీ టూర్ కు భారీ ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి పరిధిలోని సచివాలయ భవనాల వెనుక బాగాన్ని ఈ కార్యక్రమ నిర్వహణ కోస ఎంపిక చేయగా…ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇటీవలి పెహల్ గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో అమరావతిలో మోదీ టూర్ కు గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను కల్పిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి దాదాపుగా 5 లక్షల మందిని తరలించే దిశగా కూటమి సర్కారు చర్యలు చేపట్టింది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, వారి కుటుంబాలకు ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు ఆహ్వానాలు అందజేశారు. ఈ ఆహ్వానాలు ఉన్న వారిని మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఈ ఇన్విటేషన్ లేకుంటే… ఎట్టి పరిస్థితుల్లోనూ సభా ప్రాంగణంలో అడుగు పెట్టలేని దిశగా భద్రతా చర్యలు జరుగుతున్నాయి. ఈ ఇన్విటేషన్ కార్డును ఇతరులు వినియోగించడానికి కూడా వీల్లేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఇక సభకు వచ్చేవారు ఇన్విటేషన్ తో పాటు రావడంతో పాటు ఖాళీ చేతులతోనే సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టాలని కూడా సీఆర్డీఏ కండీషన్ పెట్టింది.

సభకు వచ్చే వారు మొబైల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, బ్రీఫ్ కేసులు, కెమెరాలు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటర్ బాటిళ్లతో పాటు కార్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కు చెందిన పరికరాలను కూడా తీసుకు రావద్దని సీఆర్డీఏ అధికారులు కోరారు. ఈ మేరకు ఇన్విటేషన్ లోనే ఈ విషయాలను సీఆర్డీఏ విస్పష్టంగా ప్రకటించింది. ఈ నిషేదాజ్ఞలు అమలు అయ్యేలా సీఆర్డీఏ అధికారులు ఏ తరహా చర్యలు తీసుకుంటారోనన్న వాదన ఆసక్తి రేకెత్తిస్తోంది. మొబైల్ ఫోన్లు లేనిదే ఇంటి నుంచి బయట కాలు పెట్టలేని ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిలో ప్రదాని సభకు మొబైళ్లు లేకుడా జనాన్ని ఎలా కట్టడి చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే అధికారుల వినతులు ప్రజల నుంచి కూడా సానుకూల స్పదనే వస్తోందని కూడా తెలుస్తోంది.

అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన దాదాపుగా గంటన్నర పాటు కొనసాగనుంది. పెహల్ గాం ఉగ్ర దాడి నేపథ్యంలో అమరావతిలో మోదీ కార్యక్రమ వేదికపైకి కూడా పరిమితంగానే నేతలను అనుమతించనున్నారు. మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ స్వాగత వాక్యాలతో ప్రారంభం కానున్నఈ కార్యక్రమం..చంద్రబాబు ప్రసంగం, ఆ తర్వాత మోదీ స్పీచ్ లతో ముగియనుంది. అంతకుముందే…అమరావతి పనుల పున:ప్రారంభానికి మోదీ శ్రీకారం చుట్టనున్నారు. మొత్తంగా పెహల్ గాం ఉగ్రదాడి నేపథ్యంలో అమరావతిలో మోదీ టూర్ పై పలు ఆంక్షలు అమలు  చేయక తప్పని పరిస్థితి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 30, 2025 6:22 pm

Share

Recent Posts

సూర్య ఛెప్పిన కార్తి ‘పొటాటో చిప్స్’ కథ

సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్‌లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…

21 minutes ago

హీరో దర్శకత్వపు కల… అదెప్పుడు నెరవేరునో

టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…

2 hours ago

సాక్షిలో రెండో పేజీకి చేరిన రాజన్న

ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…

3 hours ago

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

4 hours ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

5 hours ago

రెండో భాస్కర్ అంత వేగంగా రాగలడా

సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…

6 hours ago