Political News

వారికిచ్చారు స‌రే.. మాప‌రిస్థితేంటి? టీడీపీలో ర‌గులుకున్న పోరు!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని ఒక స‌మ‌స్య వ‌దిలితే.. మ‌రో స‌మ‌స్య వెంటాడుతోంది. నిన్న‌మొన్న‌టి వ‌రకు నాయ‌క‌త్వ స‌మ‌స్య‌లు వెంటాడాయి. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జుల అంశాలు కూడా పార్టీని ఇబ్బంది పెట్టాయి. వీటిని స‌రిచేసే క్ర‌మంలోనే పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. అదే స‌మయంలో పార్టీలో స్టేట్ క‌మిటీని ఏర్పాటు చేశారు.. ప‌ద‌వులు ఇచ్చారు. బీసీల‌కు ప్రాధాన్యం పెంచారు. ఇంత‌వ‌ర‌కు బాగుంది. అయితే.. ఇప్పుడు సామాజిక వ‌ర్గాల వారీగా చూస్తే.. త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. త‌మ‌కు అస‌లు గుర్తింపే లేకుండా పోయింద‌ని పేర్కొంటూ.. కొంద‌రు నేత‌లు చంద్ర‌బాబుకు లేఖ‌లు రాయ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా టీడీపీ సీనియ‌ర్ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన ఈ అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీల్లోని మాల‌, మాదిగ సామాజిక వ‌ర్గాల‌కు స‌మాన ప్రాధాన్యం ఇచ్చారు. మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన కేఎస్ జ‌వ‌హ‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే.. అదే జిల్లాలోని మాల సామాజిక వ‌ర్గానికి చెందిన పీత‌ల సుజాత‌కు కూడా మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అదేస‌మ‌యంలో పార్టీ అధికార ప్ర‌తినిధిగా మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన వ‌ర్ల రామ‌య్య‌ను నియ‌మిస్తే.. ఎస్సీ కొర్ప‌రేస‌న్ చైర్మ‌న్‌, ఫైనాన్స్ కొర్ప‌రేస‌న్ చైర్మ‌న్‌ప‌దవుల‌ను మాల వ‌ర్గానికి చెందిన కారెం శివాజీ, జూపూడి ప్ర‌భాక‌ర్‌ల‌కు అప్ప‌గించారు.

అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఈ రెండు వ‌ర్గాల‌ను స‌మానంగా ఆద‌రించిన చంద్ర‌బాబు.. ఎక్క‌డా విమ‌ర్శ‌లు ఎదుర్కొన‌లేదు. అయితే.. ఇప్పుడు పార్టీ ప‌ద‌వుల్లో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. మాల సామాజిక వ‌ర్గం గ‌గ్గోలు పెడుతోంది. ఇటీవ‌ల ఇచ్చిన పార్టీ ప‌ద‌వుల్లో త‌మ‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని.. ఈ వ‌ర్గానికి చెందిన నాయ‌కులు.. చంద్ర‌బాబుకు లేఖాస్త్రాలు సంధించారు. జ‌వ‌హ‌ర్‌కు రాజ‌మండ్రి పార్ల‌మెంట‌రీ జిల్లా ప‌గ్గాలు ఇచ్చారు. వ‌ర్ల‌కు.. పార్టీ పొలిట్ బ్యూరోలో చోటు క‌ల్పించారు. అదేవిధంగా మాదిగ వ‌ర్గానికి చెందిన ఎం.ఎస్‌రాజుకు టీడీపీ ఎస్సీసెల్ అధ్య‌క్ష ప‌గ్గాలు అప్ప‌గించారు.

ఇక‌, మాజీ ఎమ్మెల్యే మాదిగ వ‌ర్గానికి చెందిన వంగ‌ల‌పూడి అనిత‌కు ఏకంగా రెండు ప‌ద‌వులు ఇచ్చారు.తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు స‌హా పార్టీలో కీల‌క ప‌ద‌వి ఇచ్చారు. కానీ, మాల వ‌ర్గానికి మాత్రం ప‌దవులు ఇవ్వ‌లేద‌ని వారు ఆరోపిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా మాజీ మంత్రి పీత‌ల సుజాత‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, మాజీ స్పీక‌ర్‌.. ప్ర‌తిభా భార‌తికి పొలిట్ బ్యూరో స‌భ్య‌త్వం తొల‌గించ‌డం.. వంటివి పార్టీలో త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారనేందుకు నిద‌ర్శ‌నాల‌నిఆ వ‌ర్గం వారు చంద్ర‌బాబు లేఖలు సంధించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ అసంతృప్తిని బాబు ఎలా చ‌ల్లార్చుతారో చూడాలి.

Satya

Recent Posts

మోపిదేవికి మోక్షం ఎప్పుడు… ?

వైసిపి నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిన మాజీమంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పరిస్థితి అగమ్య గోచరంగా…

31 minutes ago

నా కుప్పం.. నేనే చూసుకుంటా: చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో…

2 hours ago

టికెట్ రేట్లు కాస్త ఆలోచించండి సారూ

పెద్ది వీకెండ్ ఘనంగా పూర్తి చేసుకుంది. టాక్స్, రివ్యూస్, కాంట్రావర్సీ సంగతి ఎలా ఉన్నా జనం థియేటర్లకు పోటెత్తిన మాట…

3 hours ago

రామ‌చంద్రా.. ఈ కామెంట్లు ఎవ‌రికోసం?

అంద‌రూ స‌వాళ్లు రువ్వుతున్నారు.. తాను మాత్రం త‌క్కువ తిన్నానా.. అని అనుకున్నారో ఏమో.. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు.. ఆస‌క్తిక‌ర…

4 hours ago

బాలయ్య పుట్టినరోజుకి ఇన్నేసి కానుకలా

ఇంకో మూడు రోజుల్లో జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు రానుంది. ఈసారి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు రెడీ…

4 hours ago

బాలీవుడ్ ఏడుపు… టాలీవుడ్ గ‌ప్‌చుప్‌

బాహుబ‌లి సినిమాను అప్ప‌ట్లో టాలీవుడ్‌ను మించి బాలీవుడ్‌యే ఎక్కువ‌గా మోసింది. అందుక్కార‌ణం అగ్ర నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఆ చిత్రాన్ని…

6 hours ago