Political News

పోలవరం బకాయిలు రూ. 2234 కోట్ల విడుదలకు ఓకే చెప్పిన కేంద్రం

వివాదాలతో హోరెత్తిపోతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం బకాయిలు రూ. 2234 కోట్ల విడుదలకు ఎటువంటి అభ్యంతరాలు లేవని కేంద్రం ఆర్ధికశాఖ స్పష్టంగా చెప్పింది. ఈ మేరకు బకాయిల మొత్తాన్ని విడుదల చేయలంటూ కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులకు ఆర్ధికశాఖ మెమో పంపింది. దీంతో మరో రెండు మూడు రోజుల్లో బకాయిలు విడుదలయ్యే అవకాశాలున్నట్లు రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. బకాయిల విడుదల చేయాలంటూ ఈమధ్యనే రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే.

నిజానికి పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3805 కోట్లను ఖర్చు చేసింది. ఖర్చు చేసిన మొత్తాన్ని వెంటనే రీ ఎంబర్స్ చేయాలంటు రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇదే సమయంలో రూ. 3805 కోట్లు ప్రాజెక్టు పనులకు ఖర్చు చేసినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) కూడా కేంద్ర ఆర్ధికశాఖకు ఓ నివేదిక పంపింది. దాంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అయితే రూ. 3805 కోట్లను కాకుండా రూ. 2234 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్ధికశాఖ డిసైడ్ చేసింది.

పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల విషయంలో కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల మధ్య వివాదం మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 47,615 కోట్లకు సవరించిన అంచనాలను కేంద్ర జలశక్తి శాఖకు పంపగా శాఖ ఉన్నతాధికారులు ఓకే చెప్పారు. అయితే నాలుగు రోజుల క్రితం కేంద్రం ఆర్ధికశాఖ నుండి ఓ సమాచారం వచ్చింది. అదేమిటంటే 2014 అంచనాల ప్రకారమే కేంద్ర ఆర్ధికశాఖ నిధులు విడుదల చేస్తుందట. 2014 అంచనాలంటే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే రూ. 20 వేల కోట్లను మాత్రమే ఇస్తామని స్పష్టంగా చెప్పింది.

నిజానికి ప్రాజెక్టు కాస్టంటే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు+భూసేకరణ ఖర్చు+నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం+పునరావాస ఖర్చులు కలిపి లెక్కేస్తారు. కానీ కేంద్రమేమో తాజాగా విచిత్రంగా కేవలం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును మాత్రమే ఇస్తానంటోంది. మరి భూసేకరణ, నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం, పునరావాస ఖర్చులు ఎవరు భరించాలి ? ఇక్కడే రాష్ట్ర-కేంద్రం మధ్య వివాదం మొదలైంది. మరి ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో తెలీదు. ఈ నేపధ్యంలోనే ఇప్పటివరకు అయిన ప్రాజెక్టు ఖర్చులు రూ. 2234 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ అవ్వటం శుభపరిణామమనే చెప్పాలి.

This post was last modified on November 3, 2020 3:27 pm

Share

Recent Posts

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

5 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

6 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

7 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

8 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

8 hours ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

9 hours ago