Political News

ఏపీ-తెలంగాణ కొట్టుకుంటే.. ప్రైవేటుకు పండ‌గ‌

ఎట్ట‌కేల‌కు ప్ర‌తిష్ఠంభ‌న వీడింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ మ‌ధ్య ఏడు నెల‌ల‌కు పైగా విరామం త‌ర్వాత ఆర్టీసీ బస్సులు తిర‌గ‌బోతున్నాయి. ఈ మేర‌కు రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరింది. కాక‌పోతే కొన్ని ష‌ర‌తుల మ‌ధ్య బ‌స్సులు తిప్ప‌బోతున్నాయి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు. ఇంత‌కుముందు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బ‌స్సులు క‌లిపి 4 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల మేర బ‌స్సులు తిప్పేవి.

ఇందులో మెజారిటీ బ‌స్సులు ఏపీవే. దాదాపు రెండున్న‌ర ల‌క్ష‌ల కిలోమీట‌ర్లు ఏపీ బ‌స్సులే తిరిగేవి. తెలంగాణ వాటా ల‌క్ష‌న్న‌ర కిలోమీట‌ర్ల‌కు కొంచెం ఎక్కువ‌గా ఉండేది. ఐతే క‌రోనా-లాక్ డౌన్ వ‌ల్ల రెండు రాష్ట్రాల మ‌ధ్య మూణ్నాలుగు నెల‌లు బ‌స్సులు తిప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఐతే ప్ర‌జా ర‌వాణాకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చాక కూడా రెండు రాష్ట్రాల మ‌ధ్య బ‌స్సులు తిర‌గ‌లేదు. ఇందుకు రెండు రాష్ట్రాల ఆర్టీసీల మ‌ధ్య నెల‌కొన్న ప్ర‌తిష్ఠంభ‌నే కార‌ణం. ఇంత‌కుముందున్న‌ట్లు కాకుండా.. ఏపీ త‌మ రాష్ట్రానికి ఎన్ని బ‌స్సులు తిప్పుతుందో, అవి ఎంత దూరం తిరుగుతాయో తామూ అలాగే చేస్తామ‌ని తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్ర‌తిపాదించారు. ఇందుకు ఏపీ అంగీక‌రించ‌లేదు. దీనిపై నాలుగైదు ద‌ఫాలు చ‌ర్చ‌లు జ‌రిగినా ఫ‌లితం లేక‌పోయింది. చివ‌రికి ఇప్పుడు ఇద్ద‌రూ స‌మాన దూరం బ‌స్సులు న‌డిపేలా ఒప్పందం జ‌రిగింది.

ఆశ్చ‌ర్య‌క‌రంగా ఏ‌పీలో తెలంగాణ ఆర్టీసీ 826 బస్సులు తిప్పనుండ‌గా.. తెలంగాణలో ఏపీఎస్ ఆర్టీసీ 638 బస్సులే తిప్పేట్లు అవ‌గాహ‌న కుదిరింది. ఈ ఒప్పందం ఏపీకి న‌ష్టం చేకూర్చేదే. కానీ తెలంగాణ అధికారులు ప‌ట్టువీడ‌క‌పోవ‌డంతో దీనికి అంగీక‌రించ‌క త‌ప్ప‌లేదు. ఐతే ఇంత‌కుముందు రెండు ఆర్టీసీలో న‌డిపే దూరంలో దాదాపు ల‌క్ష కిలోమీటర్లు త‌గ్గిన నేప‌థ్యంలో అది ప్రైవేటు బ‌స్సు ఆప‌రేట‌ర్ల‌కు వ‌రంలా మార‌నుంది. వాళ్లు మ‌రిన్ని బ‌స్సులు న‌డుపుతూ మ‌రింత ఆదాయం పొందేందుకు అవ‌కాశ‌మిచ్చిన‌ట్లే.

This post was last modified on November 2, 2020 10:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

48 minutes ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

3 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

4 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

5 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

6 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

7 hours ago