ఎట్టకేలకు ప్రతిష్ఠంభన వీడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఏడు నెలలకు పైగా విరామం తర్వాత ఆర్టీసీ బస్సులు తిరగబోతున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య అవగాహన కుదిరింది. కాకపోతే కొన్ని షరతుల మధ్య బస్సులు తిప్పబోతున్నాయి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు. ఇంతకుముందు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బస్సులు కలిపి 4 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పేవి.
ఇందులో మెజారిటీ బస్సులు ఏపీవే. దాదాపు రెండున్నర లక్షల కిలోమీటర్లు ఏపీ బస్సులే తిరిగేవి. తెలంగాణ వాటా లక్షన్నర కిలోమీటర్లకు కొంచెం ఎక్కువగా ఉండేది. ఐతే కరోనా-లాక్ డౌన్ వల్ల రెండు రాష్ట్రాల మధ్య మూణ్నాలుగు నెలలు బస్సులు తిప్పలేని పరిస్థితి నెలకొంది.
ఐతే ప్రజా రవాణాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చాక కూడా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగలేదు. ఇందుకు రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనే కారణం. ఇంతకుముందున్నట్లు కాకుండా.. ఏపీ తమ రాష్ట్రానికి ఎన్ని బస్సులు తిప్పుతుందో, అవి ఎంత దూరం తిరుగుతాయో తామూ అలాగే చేస్తామని తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు ఏపీ అంగీకరించలేదు. దీనిపై నాలుగైదు దఫాలు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. చివరికి ఇప్పుడు ఇద్దరూ సమాన దూరం బస్సులు నడిపేలా ఒప్పందం జరిగింది.
ఆశ్చర్యకరంగా ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 826 బస్సులు తిప్పనుండగా.. తెలంగాణలో ఏపీఎస్ ఆర్టీసీ 638 బస్సులే తిప్పేట్లు అవగాహన కుదిరింది. ఈ ఒప్పందం ఏపీకి నష్టం చేకూర్చేదే. కానీ తెలంగాణ అధికారులు పట్టువీడకపోవడంతో దీనికి అంగీకరించక తప్పలేదు. ఐతే ఇంతకుముందు రెండు ఆర్టీసీలో నడిపే దూరంలో దాదాపు లక్ష కిలోమీటర్లు తగ్గిన నేపథ్యంలో అది ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు వరంలా మారనుంది. వాళ్లు మరిన్ని బస్సులు నడుపుతూ మరింత ఆదాయం పొందేందుకు అవకాశమిచ్చినట్లే.
This post was last modified on November 2, 2020 10:31 pm
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…