ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు ఈ రోజు. అయితే.. భవిష్యత్తును స్వప్నించే చంద్రబాబు.. మరో పాతికేళ్ల తర్వాత.. ఎలా ఉంటారు? అంటే.. ఊహించలేం కానీ.. ఆయన వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు మాత్రంమరో పాతికేళ్ల తర్వాత ఏపీని సమూలంగా మార్చివేస్తాయని అంటున్నారు మేధావులు. చంద్రబాబు పేరు ఇప్పుడు కాదు.. అప్పుడు మార్మోగుతుందని చెబుతున్నారు.
రాజధాని అమరావతి నగరాన్ని ప్రపంచానికే తలమానికంగా తీర్చిదిద్దడంలో ఆయన చేస్తున్న కృషి… 25 ఏళ్ల తర్వాత.. చంద్రబాబు పేరును మరింత ద్విగుణీకృతం చేస్తుందని అంటున్నారు. ఐకానిక్ టవర్ల ని ర్మాణం ద్వారా.. దేశంలోనే ఇలాంటి టవర్లు ఉన్న తొలి రాష్ట్ర రాజధానిగా అమరావతి రూపు దిద్దుకోనుంది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న జనాభా రెట్టింపు అవుతుందని.. తద్వారా.. ఆదాయం కూడా పెరుగుతుందని అంటున్నారు.
ఇప్పుడు జనాభా పెంపుదలకు సంబంధించి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఫలిస్తే.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం వృద్ధి కూడా పెరగనున్నాయి. పాతికేళ్ల ప్రణాళికతో రూపొందిస్తున్న ప్రాజెక్టులు సఫలీ కృతం అయితే.. చంద్రబాబుపేరు సువర్ణాక్షరాలతో రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సదుపాయాలు వంటివి కూడా..చంద్రబాబును హైలెట్ చేయడం ఖాయమని అంటున్నారు.
నగరాల విషయానికి వస్తే.. విజయవాడ-తాడేపల్లి-గుంటూరు-మంగళగిరి ప్రాంతాలనుకలుపుతూ.. మహా నగరంగా తీర్చిదిద్దే క్రతువు పూర్తయితే.. ఇక, ఈ నగరాల ఔన్నత్యం పెరగడంతోపాటు.. ఏపీలోనే అతి పెద్ద నగరం ఏర్పాటు సాకారం అవుతుందని చెబుతున్నారు. విశాఖను ఐటీ నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు దీనిని సాకారం చేస్తే.. వచ్చే పాతికేళ్లలో సైబరాబాద్ ను మించి పోతుందన్న చర్చ కూడా ఉంది. సో.. చంద్రబాబు వేసిన బీజాలు.. మరో పాతికేళ్ల తర్వాత.. ఫలాలు అందించడం ఖాయమని మేధావులు చెబుతున్నారు.
This post was last modified on April 20, 2025 2:36 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…