ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు ఈ రోజు. అయితే.. భవిష్యత్తును స్వప్నించే చంద్రబాబు.. మరో పాతికేళ్ల తర్వాత.. ఎలా ఉంటారు? అంటే.. ఊహించలేం కానీ.. ఆయన వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు మాత్రంమరో పాతికేళ్ల తర్వాత ఏపీని సమూలంగా మార్చివేస్తాయని అంటున్నారు మేధావులు. చంద్రబాబు పేరు ఇప్పుడు కాదు.. అప్పుడు మార్మోగుతుందని చెబుతున్నారు.
రాజధాని అమరావతి నగరాన్ని ప్రపంచానికే తలమానికంగా తీర్చిదిద్దడంలో ఆయన చేస్తున్న కృషి… 25 ఏళ్ల తర్వాత.. చంద్రబాబు పేరును మరింత ద్విగుణీకృతం చేస్తుందని అంటున్నారు. ఐకానిక్ టవర్ల ని ర్మాణం ద్వారా.. దేశంలోనే ఇలాంటి టవర్లు ఉన్న తొలి రాష్ట్ర రాజధానిగా అమరావతి రూపు దిద్దుకోనుంది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న జనాభా రెట్టింపు అవుతుందని.. తద్వారా.. ఆదాయం కూడా పెరుగుతుందని అంటున్నారు.
ఇప్పుడు జనాభా పెంపుదలకు సంబంధించి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఫలిస్తే.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం వృద్ధి కూడా పెరగనున్నాయి. పాతికేళ్ల ప్రణాళికతో రూపొందిస్తున్న ప్రాజెక్టులు సఫలీ కృతం అయితే.. చంద్రబాబుపేరు సువర్ణాక్షరాలతో రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సదుపాయాలు వంటివి కూడా..చంద్రబాబును హైలెట్ చేయడం ఖాయమని అంటున్నారు.
నగరాల విషయానికి వస్తే.. విజయవాడ-తాడేపల్లి-గుంటూరు-మంగళగిరి ప్రాంతాలనుకలుపుతూ.. మహా నగరంగా తీర్చిదిద్దే క్రతువు పూర్తయితే.. ఇక, ఈ నగరాల ఔన్నత్యం పెరగడంతోపాటు.. ఏపీలోనే అతి పెద్ద నగరం ఏర్పాటు సాకారం అవుతుందని చెబుతున్నారు. విశాఖను ఐటీ నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు దీనిని సాకారం చేస్తే.. వచ్చే పాతికేళ్లలో సైబరాబాద్ ను మించి పోతుందన్న చర్చ కూడా ఉంది. సో.. చంద్రబాబు వేసిన బీజాలు.. మరో పాతికేళ్ల తర్వాత.. ఫలాలు అందించడం ఖాయమని మేధావులు చెబుతున్నారు.
This post was last modified on April 20, 2025 2:36 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…