కన్నీళ్లు కష్టాల్లోనే కాదు.. ఇష్టాల్లోనూ వస్తాయి. ఏకన్నీరెనకాల ఏముందో తెలుసుకోవడం.. ఈజీనే! ఇప్పుడు ఇలాంటి కన్నీళ్లే.. మంత్రి నారా లోకేష్ను చుట్టుముట్టాయి. “తాత వెలుగులు నింపితే…మనవడు గూడు
ఇచ్చాడయ్యా“ అంటూ మంగళగిరి ప్రజలు మంత్రి లోకేష్ ను చుట్టుముట్టి.. తమ పట్టలేని ఆనందాన్ని కన్నీటి రూపంలో ఆయన ముందు కార్చేసి.. సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు.. కొందరైతే.. ఆయనను కావలించుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
విషయం ఏంటి?
ప్రస్తుత తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో నారా లోకేష్.. `మన ఇల్లు-మన లోకేష్` కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తన నియోజకవర్గం పరధిలో.. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు అక్కడే వారి ఇళ్లనే క్రమబద్ధీకరణ చేస్తూ. వారికి పట్టాలు ఇస్తున్నారు. దీంతో ఇక్కడి పలు గ్రామాలు.. నదితీర ప్రాంతంలో ఉన్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా గుడెసలు వేసుకుని నివసిస్తున్న తమకు .. ఇన్నాళ్లకు ఇప్పుడు హక్కులు కల్పించారంటూ… వారు ఆనందంతో ఉబ్బితబ్బి బ్బవుతూ.. తమ ఆనందాన్ని మాటల్లో వ్యక్తీకరించలేక.. కన్నీటి రూపంలో ప్రకటిస్తూ.. నారా లోకేష్కు అభినందనలు తెలుపుతున్నారు.
ముఖ్యంగా కృష్ణానది తీరానికి కుడివైపు తాడేపల్లిలో ఉన్న ప్రాంతాన్ని `మహానాడు`గా పేర్కొంటారు. టీడీపీ వ్యవస్థాపకుడు.. ఎన్టీఆర్.. సుమారు 40 ఏళ్ల కిందట ఇక్కడే పార్టీ కీలక కార్యక్రమం మహానాడును నిర్వహిం చారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి మహానాడు అనే పేరు స్థిరపడింది. ఇక్కడ వేలాది మంది ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. అయితే.. వారికి ఎలాంటి హక్కులు లేవు.అనేక సార్లు ప్రభుత్వాలకు తమ బాధను విన్నవించినా.. వారు ఎవరూ పట్టించుకోలేదు.
మహానాడు ప్రాంతంలో లోకేష్ తన పాదయాత్ర సమయంలో స్థానికులతో మమేకమై రోడ్డు ప్రక్కన బజ్జీలు తింటూ తాము అధికారంలోకి వచ్చాక ఇళ్ళపట్టాలు ఇస్తామని హామీఇచ్చారు. ఈ క్రమంలోనే నాలుగు దశాబ్దాలకు పైగా ముడిపడకుండా ఉన్న తమ సమస్యను ఇప్పుడు పరిష్కరించడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ కు ఆజన్మాంతం ఋణపడి ఉంటామంటూ లబ్ధిదారులు ఆనంద భాష్పాలతో ఆయనను చుట్టుముట్టి.. సంతోషం వ్యక్తీకరిస్తున్నారు.
This post was last modified on April 14, 2025 3:23 pm
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…