Political News

ఇలాంటి క‌న్నీళ్లు… లోకేష్ ఎప్పుడూ చూసి ఉండ‌రు!

క‌న్నీళ్లు క‌ష్టాల్లోనే కాదు.. ఇష్టాల్లోనూ వ‌స్తాయి. ఏక‌న్నీరెన‌కాల ఏముందో తెలుసుకోవ‌డం.. ఈజీనే!  ఇప్పుడు ఇలాంటి క‌న్నీళ్లే.. మంత్రి నారా లోకేష్‌ను చుట్టుముట్టాయి. “తాత వెలుగులు నింపితే…మనవడు గూడు
ఇచ్చాడయ్యా“ అంటూ మంగ‌ళ‌గిరి ప్ర‌జలు మంత్రి లోకేష్ ను చుట్టుముట్టి.. త‌మ ప‌ట్ట‌లేని ఆనందాన్ని క‌న్నీటి రూపంలో ఆయ‌న ముందు కార్చేసి.. సంతోషం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. కొంద‌రైతే.. ఆయ‌న‌ను కావ‌లించుకుని త‌మ అభిమానాన్ని చాటుకున్నారు.

విష‌యం ఏంటి?

ప్ర‌స్తుత త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్‌.. `మ‌న ఇల్లు-మ‌న లోకేష్‌` కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌ధిలో.. ప్ర‌భుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేద‌లకు అక్క‌డే వారి ఇళ్ల‌నే క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ చేస్తూ. వారికి ప‌ట్టాలు ఇస్తున్నారు. దీంతో ఇక్క‌డి ప‌లు గ్రామాలు.. న‌దితీర ప్రాంతంలో ఉన్న వారు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా గుడెసలు వేసుకుని నివ‌సిస్తున్న త‌మ‌కు .. ఇన్నాళ్ల‌కు ఇప్పుడు హ‌క్కులు క‌ల్పించారంటూ… వారు ఆనందంతో ఉబ్బిత‌బ్బి బ్బ‌వుతూ.. త‌మ ఆనందాన్ని మాట‌ల్లో వ్య‌క్తీక‌రించ‌లేక‌.. క‌న్నీటి రూపంలో ప్ర‌క‌టిస్తూ.. నారా లోకేష్‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

ముఖ్యంగా కృష్ణాన‌ది తీరానికి కుడివైపు తాడేప‌ల్లిలో ఉన్న ప్రాంతాన్ని `మ‌హానాడు`గా పేర్కొంటారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు.. ఎన్టీఆర్.. సుమారు 40 ఏళ్ల కింద‌ట ఇక్క‌డే పార్టీ కీల‌క కార్య‌క్ర‌మం మ‌హానాడును నిర్వ‌హిం చారు. ఆ త‌ర్వాత‌ ఈ ప్రాంతానికి మ‌హానాడు అనే పేరు స్థిర‌ప‌డింది. ఇక్క‌డ వేలాది మంది ఇళ్లు క‌ట్టుకుని నివ‌సిస్తున్నారు. అయితే.. వారికి ఎలాంటి హ‌క్కులు లేవు.అనేక సార్లు ప్ర‌భుత్వాల‌కు త‌మ బాధ‌ను విన్న‌వించినా.. వారు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

మహానాడు ప్రాంతంలో లోకేష్ తన పాదయాత్ర సమయంలో స్థానికులతో మమేకమై రోడ్డు ప్రక్కన బజ్జీలు తింటూ తాము అధికారంలోకి వచ్చాక ఇళ్ళపట్టాలు ఇస్తామని హామీఇచ్చారు. ఈ క్ర‌మంలోనే నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా ముడిప‌డ‌కుండా ఉన్న త‌మ స‌మ‌స్య‌ను ఇప్పుడు ప‌రిష్క‌రించ‌డంపై వారు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ కు ఆజన్మాంతం ఋణపడి ఉంటామంటూ ల‌బ్ధిదారులు ఆనంద భాష్పాల‌తో ఆయ‌న‌ను చుట్టుముట్టి.. సంతోషం వ్య‌క్తీక‌రిస్తున్నారు.

Kumar

Recent Posts

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…

28 minutes ago

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స…

3 hours ago

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

7 hours ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

8 hours ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

9 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

10 hours ago