Political News

ఇక సకలం సజ్జల చేతుల్లోనే!

సజ్జల రామకృష్ణారెడ్డి… అటు సొంత పార్టీ వైైసీపీతో పాటు ఇటు ఆ పార్టీ వైరి వర్గాల్లోనూ నిత్యం నానుతూ ఉండే పేరిది. వైసీపీ అధికారంలో ఉండగా… సకల శాఖల మంత్రిగా పిలిపించుకున్న సజ్జల… వైసీపీ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు గా పని చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విపక్షానికి పరిమితం కాగా… ఆ పార్టీ వ్యవహారాలను నడుపుతూ బిజీబిజీగానే సాగుతున్నారు. పార్టీలో అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాతి స్థానం ఇప్పుడు సజ్జలదేనని చెప్పాలి. ఎందుకంటే… పార్టీకి అధ్యక్షుడిగా జగన్ కొనసాగుతుండగా.. రాష్ట్ర సమన్వయకర్తగానే కాకుండా ఇప్పుడు కొత్తగా పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్ పదవిని కూడా ఆయన దక్కించుకున్నారు.

వైసీపీలో పార్టీ అధ్యక్ష పదవి తర్వాత అత్యున్నత స్థాయిలో ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు ఇలా అధికారిక హోదాలు ఉన్నాయి. అయితే ప్రాంతీయ సమన్వయకర్తలు ఆయా ప్రాంతాల వ్యవహారాలకు మాత్రమే పరిమితం. ఇక ప్రధాన కార్యదర్శుల సంఖ్య చాలానే ఉంటుంది కాబట్టి… ఆ పదవులను అద్యక్ష పదవి తర్వాతి పోస్టులుగా కూడా పరిగణిచలేం. ఇక ఉన్నదల్లా రాష్ట్ర సమన్వయకర్త హోదానే అద్యక్ష పదవి తర్వాత స్థానంగా పరిగణిస్తున్నారు. అంటే పార్టీలోని అన్ని హోదాల్లో ఉన్న నేతలతో పాటుగా చివరాఖరుకు ప్రాంతీయ సమన్వయకర్తలపైనా అధ్యక్షుడితో పాటు రాష్ట్ర సమన్వయకర్తకే అజమాయిషీ ఉంటుందని చెప్పాలి.

తాజాగా పార్టీలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత నిర్ణాయక విభాగంగా పార్టీ రాజకీయ అడ్వైజరీ కమిటీ (పీఏసీ)ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రీజనల్ కో ఆర్డినేటర్లను శాశ్వత ఆహ్వానితులుగా పేర్కొన్న వైసీపీ అదిష్ఠానం.. అందులో సభ్యులు గా 33 మందిని ప్రకటించింది. వీరిలో పార్టీకి చెందిన కీలక నేతలంతా దాదాపుగా ఉన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, భూమన కరుణాకరరెడ్డి, పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి వారి పేర్లు మాత్రం కనిపించలేదు. అయితే పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్ నేతలందరినీ ఇందులో అకామిడేట్ చేసినట్టుగా చెప్పాలి. ఈ కమిటీకి కన్వీనర్ గా సజ్జల వ్యవహరిస్తారని ఆ ప్రకటనలో వైసీపీ తెలిపింది. వెరసి జగన్ తర్వాత వైసీపీలో ఇకపై మొత్తం వ్యవహారాలన్నింటినీ సజ్జలనే పర్యవేక్షిస్తారని చెప్పక తప్పదు. 

This post was last modified on April 13, 2025 11:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago