Political News

ముంబై ఐఐటీ స్టూడెంట్స్ కి చంద్రబాబు ఏం చెప్పారు?

భవిష్యత్తు మీద ఆశలతో 2050 టార్గెట్ గా మెగా మైండ్ సెట్ మార్చుకోవాలంటూ చంద్రబాబునాయుడు గట్టిగా చెప్పారు. ముంబయ్ ఐఐటి విద్యార్ధుల కోసం నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్’ లో ఐఐటి స్టూడెంట్స్ తో వెబినార్ ద్వారా జూమ్ యాప్ లో మాట్లాడారు. రోడ్లు, కరెంటు కూడా లేని 20 ఇళ్ళున్న చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన తాను ముఖ్యమంత్రి అవ్వగా లేనిది ఇప్పటి విద్యార్ధులు భవిష్యత్తులో ఎందుకు ఎదగలేరంటూ చురకలంటించారు. శ్రమ చేయటం, పట్టుదలతో పనిచేయటమే అన్నింటికన్నా ముఖ్యమన్నారు.

సమస్యలు, సంక్షోభాలను చూసి ఎవ్వరు భయపడవద్దని క్లాసు పీకారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా ఎలా మలచుకోవాలో ఓపిగ్గా ఆలోచించాలన్నారు. నేటి విద్యార్ధులే సమాజానికి దిక్సూచిగా పనిచేయాల్సిన అవసరం ఉందంటూ చంద్రబాబు గట్టిగా చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తాను ఏపి అభివృద్ధికి చేసిన కృషిని విద్యార్ధులకు వివరించారు.

మనం ఏది సాధించాలన్నా ఓ విజన్ అవసరమని, ఆ విజన్ను సాధించేందుకు అవసరమైన కార్యాచరణ చాలా అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కార్యాచరణ పెట్టుకున్నంత మాత్రాన కుదరదని దాన్ని అచీవ్ చేయటానికి తీవ్రంగా కష్టపడాలన్నారు. మనం కష్టపడటంతో పాటు ఇతులను ఓ టీం లాగ తయారు చేసుకుని అందరినీ ముందుకు తీసుకెళ్ళాలన్నారు. అందరు కలిసి ఓ బృందంగా పనిచేసినపుడే ఏదైనా సాధించగలమనే విషయంపై అందరు నమ్మకం ఉంచుకోవాలన్నారు.

ప్రపంచంలో విస్తరిస్తున్న సాంకేతిక విప్లవాన్ని ప్రతి ఒక్కళ్ళు అందిపుచ్చుకోవాలని గట్టిగా చెప్పారు. సాంకేతిక విప్లవం ద్వారా అద్భుతాలు సృష్టంచవచ్చని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కోబోయే అతి ప్రధానమైన సమస్య వాతావరణ కాలుష్యంగా చంద్రబాబు గుర్తుచేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని కోరారు. కాలుష్య రహిత సాంకేతికతకు పెద్ద పాట వేసిన వారిదే భవిష్యత్తని చంద్రబాబు జోస్యం కూడా చెప్పారు. మొత్తానికి తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని చంద్రబాబు ఐఐటి విద్యార్ధులతో పంచుకున్నారు.

This post was last modified on November 1, 2020 6:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ్లాక్ బస్టర్ సీక్వెల్ మీద అనుమానాలు

1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…

1 hour ago

ప్రభాస్ కోసం బాస్ వస్తారా

జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…

2 hours ago

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

6 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

7 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

9 hours ago