Political News

అధికారం కూటమి వద్ద.. జనం జగన్ వద్ద: పేర్ని నాని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని శుక్రవారం ఎంట్రీ ఇచ్చారు. రాప్తాడు పర్యటన సందర్భంగా జగన్ డ్రామాలు చేశారని, స్థానిక నేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ హెలికాప్టర్ మరమ్మతుకు గురయ్యేందుకు కూడా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డే కారణమని టీడీపీ ఆరోపించింది. ఈ మాట నిజమేనని తేల్చిన పోలీసులు ఇప్పటికే తోపుదుర్తిపై కేసు కూడా నమోదు చేశారు. ఈ అన్ని అంశాలపై స్పందించేందుకు శుక్రవారం పేర్ని నాని తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పవర్ ఫుల్ పంచ్ లను అలా సంధిస్తూ సాగారు.

రాప్తాడు పర్యటనలో జగనేమీ డ్రామాలు చేయలేదని పేర్ని నాని అన్నారు. జగన్ కు సినిమా స్టార్లకు మించిన ఫాలోయింగ్ ఉందన్న నాని.. జగన్ కు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూటమి సర్కారుదేనని తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు కూడా జగన్ విపక్ష నేతగానే ఉన్నారని , నాడు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన జగన్ కు పటిష్టమైన భద్రత లభించిందన్నారు. అందుకు కారణం రాష్ట్ర పాలనా యంత్రాంగం కేంద్ర ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటమేనన్నారు. రాప్తాడు పర్యటనలో జగన్ కు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూటమి సర్కారుదేనన్నారు. అయితే ఆ బాధ్యతల నుంచి కూటమి సర్కారు తప్పుకుని.. జగన్ కు ఏం జరిగినా తమ బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే జగన్ హెలికాప్టర్ దిగకుండానే హెలిప్యాడ్ మొత్తం జనంతో నిండిపోయిందన్నారు.

అయినా జగన్ విపక్ష నేతగా ఉండటం కూటమి దురదృష్ణమని పేర్ని సెటైర్లు సంధించారు. ఎందుకంటే అని తనను తాను ప్రశ్నించుకున్న నాని… అధికారం కూటమి వద్దే ఉన్నా జనం మాత్రం జగన్ వద్ద ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్ ఎక్కడికెళ్లినా తండోపతండాలుగా జనం వస్తుండటమే ఇందుకు కారణమని కూడా ఆయన అన్నారు. ఇంతటి ప్రజాదరణ కలిగిన నేతను కాపాడే బాధ్యత తమదేనన్న విషయాన్ని ఇప్పటికైనా కూటమి సర్కారు గ్రహించాలన్నారు. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష నేతలకు భద్రత కల్పించకపోవడమన్న చెడు సంప్రదాయానికి వీడ్కోలు పలకాలని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా నాని తనదైన పంచ్ డైలాగులను సంధించారు.

జగన్ అభిమన్యుడు కాదని చెప్పిన నాని… పద్మవ్యూహాన్ని చేధించిన అర్జునుడే జగన్ అని వ్యాఖ్యానించారు. సింహం సింగిల్ గా వస్తుందంటే… దానర్థం అటు వైపు ఒకరిని, ఇటు వైపు ఇంకొకరిని వెంటేసుకుని ఎన్నికలకు రావడం కాదని, ఒక్క పార్టీగానే ఎన్నికలకు రావడమని అన్నారు. ఎవరినో చూసి ఓటు వేయమని తాము అడగబోమన్న నాని… తమను, తమ పార్టీని చూసే ఓటు వేయాలని కోరే ఏకైక పార్టీ వైసీపీ అని వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

20 minutes ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

1 hour ago

OG 2… ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…

3 hours ago

హీరోల్లో గుబులు రేపుతున్న సమంత

హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్‌ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…

3 hours ago

బండ్ల గణేష్… త్రివిక్రమ్… కలిసిపోయారు!

టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…

7 hours ago

మహిష్మతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుందా

బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…

7 hours ago