ఏపీ రాజధాని అమరావతికి స్టార్ ఇమేజ్ రానుందా? ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన స్టార్ హోటళ్ల దిగ్గజ సంస్థలు.. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సుగమంఅయిందా? అంటే.. ఔననే అంటు న్నారు స్టార్ హోటళ్ల నిర్వాహకులు. తాజాగా విజయవాడలోని ఓ హోటల్లో త్రి స్టార్ , ఫైవ్ స్టార్ హోటళ్ల యజమానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. అమరావతిలో ఏర్పాటు చేయబోయే స్టార్ హోటళ్ల వ్యవహారంపై చర్చించారు.
సుమారు 17 స్టార్ హోటళ్లు.. వచ్చే ఏడాదిలోపు నిర్మాణాలు ప్రారంభించే అవకాశం ఉందని యజమానులు చెప్పారు. వీటిలో ఒబెరాయ్, తాజ్ వంటి ప్రముఖ హోటళ్లు కూడా ఉండే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో చూపిస్తున్న ఉత్సాహం.. పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అయితే.. దేశానికే మరింత వన్నె తీసుకురాగల అమరావతిలో నిర్మాణం కొంత వరకు పూర్తయితే.. మరిన్ని స్టార్ హోటళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం రాజధాని నిర్మాణ దశలో ఉన్నందున.. దీనిపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయని హోటళ్ల యజమానులు పేర్కొన్నారు. నవ నగరాలు(నైన్ సిటీస్) నిర్మాణం వడివడిగా సాగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తద్వారా.. మరిన్ని సంస్థలు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్న అంచనాకు వచ్చారు. ప్రధానంగా ఐఐటీ, విదేశీ సంస్థలు వస్తే.. హోటళ్లకు గిరాకీ ఉంటుందని.. తద్వారా.. అమరావతిలో వ్యాపార లావాదేవీలు కూడా పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం 17 ప్రధాన హోటళ్లు అమరావతిలో భూముల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నట్టు వివరించారు. ఎన్నారైలు.. విదేశీ పర్యాటకల రాక పెరుగుతున్న నేపథ్యంలో రాజధానికి స్టార్ ఇమేజ్ వస్తుందని.. తద్వారా అతిథి గృహాల డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని వారు పేర్కొనడం గమనార్హం.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…