Political News

విశాఖ టార్గెట్‌గా నారా లోకేష్ పావులు…!

ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క‌మైన విశాఖ జిల్లాపై మంత్రి నారా లోకేష్ పట్టు పెంచుతున్నారు. త‌ర‌చుగా విశాఖ ప‌ట్నంలో ప‌ర్య‌టించ‌డంతోపాటు.. జిల్లా రాజ‌కీయాల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నారు. అదేస‌మ‌యం లో ప్ర‌జ‌ల‌కు కూడా చేరువ‌గా ఉంటున్నారు. అధికారంలోకి వ‌చ్చిన 9 మాసాల్లో 11 సార్లు నారా లోకేష్ విశాఖ‌లో ప‌ర్య‌టించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తిసారీ ఆయ‌న ప్ర‌జ‌లకు చేరువ అవుతున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.

తాజాగా నారా లోకేష్ ఆదివారం నుంచే విశాఖ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. సోమ‌వారం ఉద‌యం ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకం నుంచి అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా రెగ్యులరైజేషన్ కాకుండా ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలను కేవలం డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో మాత్రమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సమాఖ్య ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

విశాఖ పెందుర్తి నియోజకవర్గం వేపగుంట జెడ్ పీహెచ్ స్కూల్ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వ అండతో కబ్జా చేసి భవనాలు నిర్మించారని, సదరు స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని విశాఖకు చెందిన రేపర్తి రాజు విజ్ఞప్తి చేశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, రెవెన్యూ డీటీగా పనిచేసి రిటైర్డ్ అయినప్పటికీ ఏఎస్ఆర్ జిల్లా సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏలో పనిచేస్తూ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న టి.అప్పారావు, ఈశ్వర్ రావులను తొలగించి అర్హులను నియమించాలని పాడేరుకు చెందిన ఎన్.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

ఒక‌వైపు ప్ర‌జ‌ల నుంచి అర్జీలు తీసుకుని వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తూనే మ‌రోవైపు.. రాజ‌కీయం గా టీడీపీని బ‌లోపేతం చేసే దిశ‌గా కూడా నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ బ‌లం త‌గ్గ‌డంతో ఆపార్టీ నుంచి చేరిక‌ల‌ను ప్రోత్స‌హించే దిశ‌గా స్థానిక నాయ‌కులు మంత్రాంగాలు చేస్తున్నారు. అయితే.. బ‌ల‌మైన వ్య‌క్తుల‌ను మాత్ర‌మే చేర్చుకునేందుకు పార్టీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో ప‌లువురు నాయ‌కులు నారా లోకేష్‌ను క‌లిసి.. త‌మ అభిమ‌తాన్ని విన్న‌వించారు. మొత్తంగా అటు మంగ‌ళ‌గిరిలోనూ.. ఇటు విశాఖ‌లోనూ నారా లోకేష్ ప‌ట్టు పెంచుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 3, 2025 12:51 pm

Share

Recent Posts

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

22 minutes ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

30 minutes ago

పోలీసు యూనిఫాంలో ఉగ్ర‌వాదులు… ఢిల్లీ నిర‌స‌న‌ల్లో కుట్ర‌?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా విద్యార్థులు చేప‌ట్టిన ఢిల్లీ నిర‌స‌న‌లో ఉగ్ర‌వాదుల కుట్ర కోణం బ‌య‌ట ప‌డింద‌ని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్…

1 hour ago

సీనియర్ హీరోని ట్రోల్ చేస్తే ఏమొస్తుంది

ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…

1 hour ago

ర‌జినీ కోసం ఒట్టు తీసి గ‌ట్టున పెట్టాడు

కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్ట‌ర్ రోల్స్ చేసిన విజ‌య్ సేతుప‌తి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…

2 hours ago

కొబ్బరికాయ కొట్టెందుకు ముఖ్యమంత్రి అవసరమా

భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…

4 hours ago