Political News

సుప్రీం చేరిన ‘సెంట్రల్’ పంచాయితీ.. కీలక ఆదేశాలు జారీ

తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా… హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపైనే చర్చ నడుస్తోంది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూములు తమవేనని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు వాదిస్తోంది. అంతేకాకుండా ఆ భూములను పారిశ్రామిక అవసరాల కోసం వాడుకుంటామంటూ ఏకంగా ఆ భూముల చదునుకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ భూములు వర్సిటీకి చెందినవేనని విద్యార్థులు, కొన్ని ప్రజా సంఘాలతో పాటుగా విపక్షాలు వాదిస్తున్నాయి. చిక్కటి అడవితో అరుదైన జంతుజాలంతో పర్యావరణానికి నెలవుగా అలరారుతున్న ఈ భూములను వదిలేయాలని ఆ యా సంఘాలు కోరుతున్నాయి. అయితే ఈ వినతులను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం మొండిగానే ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం గురువారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది.

ఈ భూముల వ్యవహారంపై బుధవారం దాఖలైన పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు… తన విచారణ పూర్తి అయ్యేదాకా భూముల చదునును నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గురువారం హైకోర్టు విచారణ పూర్తి కానున్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో కొందరు న్యాయవాదులు నేరుగా గురువారం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. వర్పిటీ భూములను కాపాడాలంటూ వారు సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు… కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తన విచారణ పూర్తి అయ్యేదాకా చెట్లు నరికే కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే… న్యాయవాదుల పిటిషన్ పై గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆలోగా సెంట్రల్ వర్సిటీ భూముల వద్దకు వెళ్లి.. అక్కడి తాజా పరిస్థితులను వివరిస్తూ ఓ మధ్యంతర నివేదికను సమర్పించాలంటూ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక తాను విచారణ ప్రారంభించే సమయానికి తనకు చేరాలని కూడా రిజిస్ట్రార్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో తానేమీ హైకోర్టు చేపట్టిన విచారణపై తానేమీ స్టే ఇవ్వడం లేదని… ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణను మొదలుపెట్టిన హైకోర్టు తన విచారణను కొనసాగించవచ్చని కూడా సుప్రీం తెలిపింది. అంటే… ఓ వైపు హైకోర్టు విచారణ ముగిసి తుది తీర్పు వెలువడే సమయానికి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమవుతుందన్న మాట. ఈ నేపథ్యంలో ఈ భూముల వ్యవహారం మరింత జఠిలంగా మారే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

3 minutes ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

1 hour ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

1 hour ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

1 hour ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

2 hours ago

తెలంగాణ పాలిటిక్స్‌: ప‌వ‌న్ భ‌య‌మా… ఓట్ల భ‌య‌మా?

తెలంగాణ రాజ‌కీయాలు వ్యూహాత్మ‌క మ‌లుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌న‌సేన పార్టీపై…

2 hours ago