Political News

సుప్రీం చేరిన ‘సెంట్రల్’ పంచాయితీ.. కీలక ఆదేశాలు జారీ

తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా… హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపైనే చర్చ నడుస్తోంది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూములు తమవేనని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు వాదిస్తోంది. అంతేకాకుండా ఆ భూములను పారిశ్రామిక అవసరాల కోసం వాడుకుంటామంటూ ఏకంగా ఆ భూముల చదునుకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ భూములు వర్సిటీకి చెందినవేనని విద్యార్థులు, కొన్ని ప్రజా సంఘాలతో పాటుగా విపక్షాలు వాదిస్తున్నాయి. చిక్కటి అడవితో అరుదైన జంతుజాలంతో పర్యావరణానికి నెలవుగా అలరారుతున్న ఈ భూములను వదిలేయాలని ఆ యా సంఘాలు కోరుతున్నాయి. అయితే ఈ వినతులను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం మొండిగానే ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం గురువారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది.

ఈ భూముల వ్యవహారంపై బుధవారం దాఖలైన పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు… తన విచారణ పూర్తి అయ్యేదాకా భూముల చదునును నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గురువారం హైకోర్టు విచారణ పూర్తి కానున్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో కొందరు న్యాయవాదులు నేరుగా గురువారం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. వర్పిటీ భూములను కాపాడాలంటూ వారు సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు… కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తన విచారణ పూర్తి అయ్యేదాకా చెట్లు నరికే కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే… న్యాయవాదుల పిటిషన్ పై గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆలోగా సెంట్రల్ వర్సిటీ భూముల వద్దకు వెళ్లి.. అక్కడి తాజా పరిస్థితులను వివరిస్తూ ఓ మధ్యంతర నివేదికను సమర్పించాలంటూ తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక తాను విచారణ ప్రారంభించే సమయానికి తనకు చేరాలని కూడా రిజిస్ట్రార్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో తానేమీ హైకోర్టు చేపట్టిన విచారణపై తానేమీ స్టే ఇవ్వడం లేదని… ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణను మొదలుపెట్టిన హైకోర్టు తన విచారణను కొనసాగించవచ్చని కూడా సుప్రీం తెలిపింది. అంటే… ఓ వైపు హైకోర్టు విచారణ ముగిసి తుది తీర్పు వెలువడే సమయానికి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమవుతుందన్న మాట. ఈ నేపథ్యంలో ఈ భూముల వ్యవహారం మరింత జఠిలంగా మారే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 3, 2025 12:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 minute ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago