Political News

టీడీపీ, వైసీపీ… వక్ఫ్ లో నిబద్ధత ఎవరిది?

దేశంలోని మైనారిటీ ముస్లిం సోదరులంతా వద్దంటున్న వక్ఫ్ సవరణ చట్టం బుధవారం పార్లమెంటు ముందుకు వస్తోంది. ఈ సవరణ చట్టానికి పార్లమెంటులో ఆమోదం లభించడం లాంఛనమే. అధికార ఎన్డీఏ ప్రతిపాదిస్తున్న ఈ సవరణ చట్టానికి బ్రేకులు వేసేంత బలం విపక్షాలకు లేదు కాబట్టి…ఎలాగూ ఈ చట్టానికి ఎలాంటి అడ్డంకులు ఉండవనే చెప్పక తప్పదు. మరి ఈ చట్టంపై ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు తమదైన శైలి భావాలను ఆపాదించుకుంటూ సాగుతున్నాయి ఏ పార్టీ వాదన ఆ పార్టీ వినిపిస్తోంది. మరి అలాంటప్పుడు ఎవరి వాదన సరైనది అనే మాట కూడా ప్రస్తావించుకోవాలి కదా. ఈ సవరణ చట్టం విషయంలో ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ ఎం చేసిందన్న విషయంలోకి వెళ్లిపోదాం పదండి.

కేంద్రంలో అధికార ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యదిక సంఖ్యలో ఎంపీ సీట్లున్న పార్టీగా టీడీపీ కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ఈ లెక్కన ఎన్డీఏ ప్రతిపాదించే ఏ బిల్లును అయినా ఆ పార్టీ వ్యతిరేకిస్తే… అసలు ఆ బిల్లు సభ ముందుకే వచ్చే పరిస్థితి లేదు. మరి వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎన్డీఏ సభ ముందుకు తీసుకువచ్చిందంటే… దానికి టీడీపీ అనుమతి ఇచ్చినట్టే కదా. మరి ముస్లిం మైనారిటీల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పే టీడీపీ… ముస్లింలు వద్దంటున్న ఈ బిల్లుకు ఎలా అనుమతించింది? అంటే… బిల్లును క్షుణ్ణంగా పరిశీలించిన టీడీపీ… దానిలో ఓ నాలుగు మార్పులను ప్రతిపాదించింది. ఈ నాలుగు ప్రతిపాదనల్లో మూడింటికి బీజేపీ ఓకే చెప్పింది. ఓ ప్రతిపాదనకు మాత్రం ఒప్పుకోలేదు. సరే… ఎలాగూ మూడు ప్రతిపాదనలకు ఓకే అన్నారు కదా అన్న భావనతో టీడీపీ అడుగు ముందుకేసింది.

టీడీపీ ప్రతిపాదించిన మూడు మార్పులేమిటన్న విషయానికి వస్తే… వక్ఫ్ బై యూజర్ గా నమోదు అయిన ఆస్తుల పున:పరిశీలనకు అవకాశమే లేదని టీడీపీ ప్రతిపాదించింది. అంటే… ఒకసారి ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేసిన తర్వాత దానికి సంబంధిత పత్రాలు లేకున్నా కూడా దానిని వక్ఫ్ ఆస్తిగానే పరిగణిస్తారు. ఇక రెండో ప్రతిపాదన ఏంటంటే.. వక్ఫ్ ఆస్తుల నిర్ధారణలో జిల్లా కలెక్టర్ కు తుది అధికారం ఉండరాదని టీడీపీ చెప్పగా…దానికి బీజేపీ ఆమోదం తెలిపింది. ఆ మార్పునూ చట్టంలో చేర్చింది. ఇక టీడీపీ మూడో ప్రతిపాదనగా… డిజిటల్ పత్రాలను సమర్పించేందుకు ఆరు నెలల గడువు పొడిగించాలని కోరగా… అందుకు బీజేపీ సమ్మతించింది. ఇక వక్ఫ్ ఆస్తుల ముస్లిమేతరుల జోక్యాన్ని అనుమతించరాదని టీడీపీ కోరగా… దానికి మాత్రం బీజేపీ అంగీకరించలేదు. 

ఇక ఈ సవరణ చట్టాన్ని ప్రతిపాదించినంతనే వైసీపీ తాను వ్యతిరేకమంటూ తన వైఖరిని చెప్పేసింది. వైసీపీ ఇప్పుడు ఏపీలోనే కాకుండా కేంద్రంలోనూ విపక్ష హోదాలో ఉన్నట్టే లెక్క. గతంలో అయితే బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు లేదు కాబట్టి నాడు కేంద్రంలో అదికారంలో ఉన్న ఎన్డీఏతో వైసీపీ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అయితే ఏపీలో తన రాజకీయ ప్రత్యర్థి టీడీపీ… ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. ఏపీలోనూ ఆ రెండ పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి. వెరసి వైసీపీ విపక్షమనే చెప్పాలి. విపక్షంగా ఉన్న ఏ పార్టీ అయినా అదికార పక్షం తీసుకువచ్చే బిల్లులను అద్యయనం చేయాలి? దానికి మార్పులు ప్రతిపాదించాలి. అయితే ఈ రెండూ చేయని వైసీపీ… ఏదో విపక్షంలో ఉన్నాం కాబట్టి ఈ బిల్లును వ్యతిరేకించాల్సిందేనన్నట్లుగా వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పేసి చేతులు దులుపుకుంది.

This post was last modified on April 2, 2025 10:57 am

Share

Recent Posts

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

1 hour ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

2 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

2 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

6 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

13 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

15 hours ago