Political News

జీవీఎంసీపై కూటమి జెండా!… ఆపడం అసాధ్యమే!

ఏపీలో స్థానిక సంస్థలు వరుసబెట్టి కూటమి ఖాతాలోకి చేరిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు మునిసిపల్ కార్పొరేషన్ లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గాలు వైసీపీ నుంచి టీడీపీకి మారాయి. తాజాగా రాష్ట్రంలోనే అతి పెద్దది అయిన గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)పై కూటమి జెండా ఎగిరేందుకు రంగం సిద్ధం అయిపోయింది. ఈ మేరకు ఇప్పటికే జీవీఎంసీ మేయర్ గా ఉన్న వైసీపీ నేత గొలగాని వెంకట కుమారిపై కూటమి పార్టీలకు చెందిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ఈ తీర్మానంపై ఈ నెల 19న ఓటింగ్ జరిగేందుకు జీవీఎంసీ అధికార యంత్రాంగం కరసత్తు మొదలుపెట్టింది.

వైసీపీ అధికారంలో ఉండగా…స్థానిక సంస్థల ఎన్నికలు జరగగా…రెండు మునిసిపాలిటీలు మినహా అన్న పురపాలికలు వైసీపీ ఖాతాలో పడిపోయాయి. ఈ క్రమంలో జీవీఎంసీని కూడా వైసీపీనే చేజిక్కించుకుంది. అయితే మొన్నటి సార్వత్రిక జరిగిన తర్వాత వరుసబెట్టి పురపాలిక కార్పొరేటర్లు, కౌన్సలిర్లు కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. జీవీఎంసీలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జీవీఎంసీలో కూటమి పార్టీల బలం 72కు చేరగా… వైసీపీ బలం 34కు పడిపోయింది. ఇంకా వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు గేట్లు దూకేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అయితే తమ పార్టీ కార్పొరేటర్లు కట్లు దాటకుండా ఉండేలా వైసీపీ అధిష్ఠానం బెంగళూరులో క్యాంపును ఏర్పాటు చేసింది.

మరోవైపు కూటమి కూడా తన కార్పొరేటర్లతో క్యాంపు రాజకీయాలకు తెర తీసింది. తమ కార్పొరేటర్లను మలేషియా తరలించి… అక్కడే కొన్నాళ్ల పాటు ఉంచాలని టీడీపీ తొలుత భావించినా… ఎందుకనో గానీ ఆ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకుంది. మలేషియాకు బదులుగా విశాఖ పరిధిలోని భీమిలిలోనే కార్పొరేటర్ల క్యాంపును ఏర్పాటు చేసింది. తన టికెట్లపై గెలిచిన కార్పొరేటర్లతో పాటుగా దశలవారీగా తమ గూటికి చేరిన వైసీపీ కార్పొరేటర్లందరినీ టీడీపీ ఈ క్యాంపునకు తరలించింది. మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగేదాకా ఈ క్యాంపును కొనసాగించనున్నట్లుగా సమాచారం. అదే మాదిరిగా చాలా రోజుల క్రితమే బెంగళూరు కేంద్రంగా మొదలైన వైసీపీ క్యాంపు కూడా అప్పటిదాకా కొనసాగనుంది.

ఇదిలా ఉంటే… మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని నెగ్టించాలంటే కూటమికి 74 ఓట్లు అవసరం కానుంది. ఇప్పటికే కూటమి క్యాంపులో 72 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరో ఇద్దరు సభ్యులు వైసీపీ నుంచి జంప్ కొడితే కూటమి ప్లాన్ వర్కవుట్ అయిపోయినట్టే. ఈ దిశగా ఇదివరకే వైసీపీలోని పలువురు కార్పొరేటర్లతో టీడీపీ నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా వైసీపీ శిబిరంలో పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధపడినట్లుగా సమాచారం. ప్రస్తుతం వారు బెంగళూరులోని వైసీపీ క్యాంపులో ఉన్నా… అవిశ్వాసంపై తీర్మానం సందర్బంగా టీడీపీలోకి దూకేస్తారని సమాచారం. ఫలితంగా జీవీఎంసీపై త్వరలోనే కూటమి జెండా ఎగరడం ఖాయమేనని చెప్పాలి.

This post was last modified on April 1, 2025 11:29 am

Share

Recent Posts

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

5 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

7 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

8 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

8 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

8 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

9 hours ago