Political News

బాబు అడుగుజాడల్లో… ప్రజా సేవలోకి భువనేశ్వరి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణిగానే నిన్నటిదాకా కొనసాగిన నారా భువనేశ్వరి ఇప్పుడు సరికొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారని చెప్పాలి. అనివార్యంగానే ఆమె ప్రజా సేవలోకి అడుగిడాల్సి వచ్చినప్పటికీ… తన భర్త చంద్రబాబుకు చేదోడువాదోడుగా నిలుస్తున్న వైనం ఆకట్టుకుంటోంది. ఓ వైపు భర్త సీఎంగా…మరోవైపు కుమారుడు మంత్రిగా క్షణం తీరిక లేకుండా ప్రజా సేవలో తలమునకలై ఉండగా… వారికి ఓ మోస్తరు దన్నుగా నిలిచేందుకే ప్రజల్లోకి వచ్చిన భువనేశ్వరి తన దూకుడును పెంచేశారు. గడచిన 3 రోజుల పాటు ఆమె చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో విరామం లేని పర్యటన సాగించారు. తాజాగా సోమవారం ఉదయానికే సాగర నగరం విశాఖపట్నంలో ప్రత్యక్షమయ్యారు.

విశాఖలో సోమవారం ఉదయం తాజ్ వరుణ్ గ్రూప్ హోటల్ కు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి హాజరయ్యారు. సీఎం సతీమణిగా ఉన్నప్పటికీ..భువనేశ్వరి వేదికను ఎక్కకుండా సామాన్యం జనంతో కలిసి కూర్చుని వేడకను తిలకించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైన ఓ పారిశ్రామికవేత్త… తన ప్రసంగంలో భువనేశ్వరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి గురించి 30 ఏళ్ల నుంచి తెలుసన్న ఆ పారిశ్రామివేత్త.. చంద్రబాబు సీఎం అయిన తర్వాత అనివార్యంగానే భువనేశ్వరి హెరిటేజ్ బాద్యతలను భుజాన వేసుకున్నారని తెలిపారు. ఇక 2023లో చోటుచేసుకున్న రాజకియ పరిణామాలతో అనివార్యంగానే భువనేశ్వరి ఏకంగా ప్రజా జీవితంలోకి కూడా రావాల్సి వచ్చిందని తెలిపారు.

అటు వ్యాపారమైనా… ఇటు రాజకీయాల్లోకి అయినా భువనేశ్వరి ఎంట్రీ అనివార్యంగానే జరిగిందని ఆ పారిశ్రామికవేత్త గుర్తు చేశారు. తనకు తెలియని రెండు రంగాల్లోకి అనివార్యంగానే ప్రవేశించిన భువనేశ్వరి… తనకు తెలియని రంగాలంటూ వాటి నుంచి దూరం జరగలేదని… ఓ గృహిణిగా ఇంటికి ఎలా చక్కదిద్దుకున్నారో… వ్యాపారం, రాజకీయాల్లో ఆమె సత్తా చాటుతున్నారని తెలిపారు. నిజమే మరి… 1995లో చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… అప్పుడప్పుడే చంద్రబాబు ప్రారంభించిన హెరిటేజ్ వ్యాపారాన్ని తన భుజస్కందాలపై వేసుకున్న భువనేశ్వరి… దానిని ఓ విజయవంతమైన కంపెనీగా తీర్చిదిద్దారు. భువనేశ్వరి చేతుల్లో హెరిటేజ్ సంస్థ దినదిన ప్రవర్ధమానంగా ఎదిగిందే తప్పించి ఏనాడూ నేల చూపులు చూసిందే లేదు.

తాజాగా ప్రజా జీవితంలోకి వచ్చేసిన భువనేశ్వరి…చంద్రబాబుతో పాటు లోకేశ్ కు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు సీఎం అయ్యారో… తనను గెలిపిస్తూ వస్తున్న కుప్పం ప్రజలను ఆయన పెద్దగా కలిసిందే లేదు. తన మనిషిగా ఓ నేతను అక్కడ పెట్టి చంద్రబాబు వ్యవహారాన్ని నడిపిస్తూ వచ్చారు. అయినా కూడా కుప్పం ప్రజలకు ఆయన ఏ లోటూ రానివ్వలేదు.

తాజాగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో భువనేశ్వరి నేరుగా రంగంలోకి దూకేశారు. గత వారంలో ఏకంగా 3 రోజుల పాటు ఆమె కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపారు. కుప్పానికి ఇక చంద్రబాబు రావాల్సిన అవసరం లేదని.. అంతా తానే చూసుకుంటానని కూడా ఆమె అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. భువనేశ్వరి దూకుడు చూస్తుంటే… చంద్రబాబుకు ఇకపై అంతగా పనిలేకుండానే ఆమె చాలా కార్యక్రమాలను చక్కపెట్టేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

పెద్ద చేయి అందుకున్న నైజామ్ ప్యారడైజ్

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…

2 hours ago

అభిమానం స‌రే… ప‌వ‌న్‌ కు కాస్త రెస్ట్ ఇవ్వండి సార్‌!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌కు ప‌రామ‌ర్శ‌లు వెల్లువ‌లా త‌ర‌లి వ‌స్తున్నాయి. ఏపీ స‌హా తెలంగాణ…

3 hours ago

జానీ మాస్ట‌ర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఇటీవ‌ల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేష‌న్లో పెద్ద గొడ‌వ జ‌రిగి అది మీడియా దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. ఈ…

4 hours ago

తమన్నా నుంచి బోల్డ్ ట్రీట్

బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…

5 hours ago

మా ఇంటి బంగారం… వివాదానికి తెర?

గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…

5 hours ago

20వ రోజుకు చేరిన దీక్ష… సోనమ్ పరిస్థితేంటి?

భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…

6 hours ago