Political News

నాడు హైటెక్ సిటీ…ఇప్పుడు క్వాంటం వ్యాలీ: చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించారు. నగరంలోని ఐఐటీ మద్రాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వెళ్లిన ఆయన…ఐఐటీ మద్రాస్ లో 35 నుంచి 40 శాతం దాకా విద్యార్థులు తెలుగు వారే ఉండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా యువతే భవిత అన్న మాటను మరోమారు ప్రస్తావించిన చంద్రబాబు… అక్కడి తెలుగు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య తన ప్రసంగాన్ని కొంతసేపు తెలుగులోనే కొనసాగించారు.

1995లో తాను ఐటీ గురించి మాట్లాడానని చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు 2025లో ఏఐ గురించి మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు. నాడు ఐటీ కోసం హైటెక్ సిటీని కట్టానన్న చంద్రబాబు… ఇప్పుడు ఏఐ కోసం క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. సాంకేతికత అప్ డేట్ అవుతున్నకొద్దీ మనమూ అప్ డేట్ కావాల్సిందేనని, లేదంటే వెనుకబడిపోతామని చంద్రబాబు అన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వారే ఉన్నారని ఆయన అన్నారు. ఈ పరిణామం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఓ భారతీయుడిగా… ఓ తెలుగు వాడిగా విశ్వవ్యాప్తంగా తెలుగు వారు సత్తా చాటుతున్న వైనాన్ని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.

తమిళనాడు.. ప్రత్యేకించి చెన్నైలోని ఏ యూనివర్సిటీకి వెళ్లినా ఆయా వర్సిటీలో సగాన సగం మంది తెలుగు విద్యార్తులే ఉంటున్నారని చంద్రబాబు అన్నారు. మంచిగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసి… మాతృభూమి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఓ బలమైన రాజకీయ పార్టీ ఉన్నప్పుడు ఈ తరహా చర్యలు సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయన్న చంద్రబాబు… టీడీపీ నేతృత్వంలో ఇప్పుడు అదే పని చేస్తున్నామని తెలిపారు. విద్య, ఉద్యోగం తర్వాత పళ్లి చేసుకుని పిల్లలను కనాలని సూచించిన చంద్రబాబు కుటుంబ నియంత్రణను పక్కనపెట్టేయాలని సూచించారు. ఇక విద్యార్థుల నినాదాలను విన్న చంద్రబాబు…ఏపీలో పవన్ కల్యాణ్ బాగానే ఉన్నారు… బాలకృష్ణ కూడా బాగానే ఉన్నారు…ఎక్కడ చదువుతున్నా…మీ హీరోలను మరువరు కదా..మీ స్ఫూర్తిని అబినందిస్తన్నానని ఆయన అన్నారు.

This post was last modified on March 28, 2025 7:22 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

4 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

6 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

6 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

7 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

8 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

9 hours ago