Political News

నాడు హైటెక్ సిటీ…ఇప్పుడు క్వాంటం వ్యాలీ: చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించారు. నగరంలోని ఐఐటీ మద్రాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వెళ్లిన ఆయన…ఐఐటీ మద్రాస్ లో 35 నుంచి 40 శాతం దాకా విద్యార్థులు తెలుగు వారే ఉండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా యువతే భవిత అన్న మాటను మరోమారు ప్రస్తావించిన చంద్రబాబు… అక్కడి తెలుగు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య తన ప్రసంగాన్ని కొంతసేపు తెలుగులోనే కొనసాగించారు.

1995లో తాను ఐటీ గురించి మాట్లాడానని చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు 2025లో ఏఐ గురించి మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు. నాడు ఐటీ కోసం హైటెక్ సిటీని కట్టానన్న చంద్రబాబు… ఇప్పుడు ఏఐ కోసం క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. సాంకేతికత అప్ డేట్ అవుతున్నకొద్దీ మనమూ అప్ డేట్ కావాల్సిందేనని, లేదంటే వెనుకబడిపోతామని చంద్రబాబు అన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వారే ఉన్నారని ఆయన అన్నారు. ఈ పరిణామం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఓ భారతీయుడిగా… ఓ తెలుగు వాడిగా విశ్వవ్యాప్తంగా తెలుగు వారు సత్తా చాటుతున్న వైనాన్ని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.

తమిళనాడు.. ప్రత్యేకించి చెన్నైలోని ఏ యూనివర్సిటీకి వెళ్లినా ఆయా వర్సిటీలో సగాన సగం మంది తెలుగు విద్యార్తులే ఉంటున్నారని చంద్రబాబు అన్నారు. మంచిగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసి… మాతృభూమి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఓ బలమైన రాజకీయ పార్టీ ఉన్నప్పుడు ఈ తరహా చర్యలు సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయన్న చంద్రబాబు… టీడీపీ నేతృత్వంలో ఇప్పుడు అదే పని చేస్తున్నామని తెలిపారు. విద్య, ఉద్యోగం తర్వాత పళ్లి చేసుకుని పిల్లలను కనాలని సూచించిన చంద్రబాబు కుటుంబ నియంత్రణను పక్కనపెట్టేయాలని సూచించారు. ఇక విద్యార్థుల నినాదాలను విన్న చంద్రబాబు…ఏపీలో పవన్ కల్యాణ్ బాగానే ఉన్నారు… బాలకృష్ణ కూడా బాగానే ఉన్నారు…ఎక్కడ చదువుతున్నా…మీ హీరోలను మరువరు కదా..మీ స్ఫూర్తిని అబినందిస్తన్నానని ఆయన అన్నారు.

This post was last modified on March 28, 2025 7:22 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

3 minutes ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

14 minutes ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

1 hour ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

1 hour ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

1 hour ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

1 hour ago