టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించారు. నగరంలోని ఐఐటీ మద్రాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వెళ్లిన ఆయన…ఐఐటీ మద్రాస్ లో 35 నుంచి 40 శాతం దాకా విద్యార్థులు తెలుగు వారే ఉండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా యువతే భవిత అన్న మాటను మరోమారు ప్రస్తావించిన చంద్రబాబు… అక్కడి తెలుగు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య తన ప్రసంగాన్ని కొంతసేపు తెలుగులోనే కొనసాగించారు.
1995లో తాను ఐటీ గురించి మాట్లాడానని చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు 2025లో ఏఐ గురించి మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు. నాడు ఐటీ కోసం హైటెక్ సిటీని కట్టానన్న చంద్రబాబు… ఇప్పుడు ఏఐ కోసం క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. సాంకేతికత అప్ డేట్ అవుతున్నకొద్దీ మనమూ అప్ డేట్ కావాల్సిందేనని, లేదంటే వెనుకబడిపోతామని చంద్రబాబు అన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వారే ఉన్నారని ఆయన అన్నారు. ఈ పరిణామం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఓ భారతీయుడిగా… ఓ తెలుగు వాడిగా విశ్వవ్యాప్తంగా తెలుగు వారు సత్తా చాటుతున్న వైనాన్ని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.
తమిళనాడు.. ప్రత్యేకించి చెన్నైలోని ఏ యూనివర్సిటీకి వెళ్లినా ఆయా వర్సిటీలో సగాన సగం మంది తెలుగు విద్యార్తులే ఉంటున్నారని చంద్రబాబు అన్నారు. మంచిగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసి… మాతృభూమి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఓ బలమైన రాజకీయ పార్టీ ఉన్నప్పుడు ఈ తరహా చర్యలు సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయన్న చంద్రబాబు… టీడీపీ నేతృత్వంలో ఇప్పుడు అదే పని చేస్తున్నామని తెలిపారు. విద్య, ఉద్యోగం తర్వాత పళ్లి చేసుకుని పిల్లలను కనాలని సూచించిన చంద్రబాబు కుటుంబ నియంత్రణను పక్కనపెట్టేయాలని సూచించారు. ఇక విద్యార్థుల నినాదాలను విన్న చంద్రబాబు…ఏపీలో పవన్ కల్యాణ్ బాగానే ఉన్నారు… బాలకృష్ణ కూడా బాగానే ఉన్నారు…ఎక్కడ చదువుతున్నా…మీ హీరోలను మరువరు కదా..మీ స్ఫూర్తిని అబినందిస్తన్నానని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…