Political News

జ‌గ‌న్‌.. 2 వేల కోట్లు దుబాయ్‌లో దాచారు: లావు

మద్యం కుంభకోణం…దేశ రాజదాని డిల్లీలో ఆప్ సర్కాను కుప్పకూల్చేసింది. ఇటు తమిళనాడులో అదికార డీఎంకేను ఆత్మ రక్షణలో పడేసింది. ఈ రెంటికి మధ్య అదికారం నుంచి దిగిపోయిన ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీని నేరుగా బోను ఎక్కించేలానే ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా… సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన ప్రసంగం వింటే వైసీపీ త్వరలోనే పెను చిక్కులను ఎదుర్కోక తప్పదని చెప్పాలి. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ స్కాంను మించిన అవినీతి ఏపీ లిక్కర్ దందాలో చోటుచేసుకుందన్న వాదనలకూ బలం చేకూరుతోంది.

నరసరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లావు… గతంలో 2019 ఎన్నికల్లో అదే స్థానం నుంచి వైసీపీ ఎంపీగా కొనసాగారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా ఆయన వైసీపీ చేసిన లిక్కర్ స్కాం గురించిన వివరాలు వింటూ ఉంటే… ఇంత భారీ అవినీతి జరిగిందా? అని జనం ముక్కున వేలేసుకున్నారు. లావు చెప్పిన దాని ప్రకారం..ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి వైసీపీ 2019లో అదికారం లోకి వచ్చింది. అదికారంలోకి వచ్చినంతనే ఆ హామీని పక్కనపెట్టి… రాష్ట్రంలో విచ్చలవిడి మద్యం అమ్మకాలకు తెర తీసింది. అప్పటికే ఉన్న లిక్కర్ తయారీ సంస్థలకు అదనంగా మరో 26 కంపెనీల లిక్కర్ ఉత్పత్తికి అనుమతి ఇచ్చేసింది.

పాత కంపెనీలతో పాటుగా కొత్త కంపెనీలతో సంప్రదింపులు జరిపిన నాటి వైసీపీ సర్కారు పెద్దలు… ఆయా సంస్థలు లిక్కర్ ఉత్పత్తి చేయకుండానే ముడుపులు ఇచ్చేలా వ్యూహం రచించింది. కొత్త బ్రాండ్ల పేరిట మద్యం ఉత్పత్తికి అనుమతులు ఇచ్చేసిన వెంటనే వాటి నుంచి రూ.2 వేల కోట్ల ముడుపులను సేకరించి… వాటిని జగన్ బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయికి పంపింది. ఇందుకోసం ఓ ఇన్ ఫ్రా కంపెనీనే ఏర్పాటు చేశారట. ఆ తర్వాత ఆయా కంపెనీలు నాసి రకం మద్యం ఉత్పత్తి చేసినా పట్టించుకోలేదట. ఈ స్కాంపై ఇఫ్పటికే సీఐడీ దర్యాప్తు జరుగుతోందన్న లావు.. ముడుపులు విదేశాలకు తరలిపోయిన నేపథ్యంలో ఈడీ కూడా ఈ కేసును దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

This post was last modified on March 24, 2025 11:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

60 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago