మద్యం కుంభకోణం…దేశ రాజదాని డిల్లీలో ఆప్ సర్కాను కుప్పకూల్చేసింది. ఇటు తమిళనాడులో అదికార డీఎంకేను ఆత్మ రక్షణలో పడేసింది. ఈ రెంటికి మధ్య అదికారం నుంచి దిగిపోయిన ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీని నేరుగా బోను ఎక్కించేలానే ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా… సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన ప్రసంగం వింటే వైసీపీ త్వరలోనే పెను చిక్కులను ఎదుర్కోక తప్పదని చెప్పాలి. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ స్కాంను మించిన అవినీతి ఏపీ లిక్కర్ దందాలో చోటుచేసుకుందన్న వాదనలకూ బలం చేకూరుతోంది.
నరసరావుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లావు… గతంలో 2019 ఎన్నికల్లో అదే స్థానం నుంచి వైసీపీ ఎంపీగా కొనసాగారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా ఆయన వైసీపీ చేసిన లిక్కర్ స్కాం గురించిన వివరాలు వింటూ ఉంటే… ఇంత భారీ అవినీతి జరిగిందా? అని జనం ముక్కున వేలేసుకున్నారు. లావు చెప్పిన దాని ప్రకారం..ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి వైసీపీ 2019లో అదికారం లోకి వచ్చింది. అదికారంలోకి వచ్చినంతనే ఆ హామీని పక్కనపెట్టి… రాష్ట్రంలో విచ్చలవిడి మద్యం అమ్మకాలకు తెర తీసింది. అప్పటికే ఉన్న లిక్కర్ తయారీ సంస్థలకు అదనంగా మరో 26 కంపెనీల లిక్కర్ ఉత్పత్తికి అనుమతి ఇచ్చేసింది.
పాత కంపెనీలతో పాటుగా కొత్త కంపెనీలతో సంప్రదింపులు జరిపిన నాటి వైసీపీ సర్కారు పెద్దలు… ఆయా సంస్థలు లిక్కర్ ఉత్పత్తి చేయకుండానే ముడుపులు ఇచ్చేలా వ్యూహం రచించింది. కొత్త బ్రాండ్ల పేరిట మద్యం ఉత్పత్తికి అనుమతులు ఇచ్చేసిన వెంటనే వాటి నుంచి రూ.2 వేల కోట్ల ముడుపులను సేకరించి… వాటిని జగన్ బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయికి పంపింది. ఇందుకోసం ఓ ఇన్ ఫ్రా కంపెనీనే ఏర్పాటు చేశారట. ఆ తర్వాత ఆయా కంపెనీలు నాసి రకం మద్యం ఉత్పత్తి చేసినా పట్టించుకోలేదట. ఈ స్కాంపై ఇఫ్పటికే సీఐడీ దర్యాప్తు జరుగుతోందన్న లావు.. ముడుపులు విదేశాలకు తరలిపోయిన నేపథ్యంలో ఈడీ కూడా ఈ కేసును దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
This post was last modified on March 24, 2025 11:08 pm
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…