Political News

ఎన్నికల నిర్వహణపై క్లారిటి ఇచ్చేసిన సీఎస్

స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించే పరిస్ధితి లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టంగా చెప్పేశారు. స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించే విషయమై స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం సాయంత్రం సీఎస్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా నీలం మాట్లాడుతు ఎన్నికలను నిర్వహించ పరిస్ధితి రాష్ట్రంలో లేవని తేల్చి చెప్పేశారు. బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిమ్మగడ్డ వివిధ రాజకీయపార్టీలతో ఇదే విషయమై సమావేశం అయిన విషయం అందరికీ తెలిసిందే.

పార్టీల ప్రతినిధులు చెప్పిన అభిప్రాయాలు తీసుకుని నిమ్మగడ్డ సాయంత్రం నీలంను కలిశారు. కరోనా వైరస్ వ్యాప్తి రాష్ట్రంలో ఇంకా నియంత్రణలోకి రాలేదని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కరోనా వైరస్ కేసుల వివరాలను, నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకిందనే లెక్కలను కూడా నిమ్మగడ్డ ముందుంచారు. పనిలోపనిగా పోలీసుశాఖలో కరోనా వైరస్ సోకిన వారి వివరాలు, పోలీసులు నిర్వహిస్తున్న విధులను కూడా వివరించారు.

రాష్ట్రంలో ఇఫ్పటి వరకు నమోదైన కేసులు, అందిస్తున్న చికిత్సలు తదితర వివరాలను కూడా నిమ్మగడ్డకు నీలం వివరించినట్లు సమాచారం. రోజుకు సుమారు 4 వేల కేసులు నమోదవుతున్న ప్రస్తుత సమయంలో ఎన్నికలను నిర్వహించే పరిస్ధితుల్లో ప్రభుత్వం లేదన్నారు. కరోనా వైరస్ సమస్య అదుపులోకి రాగానే తామే కబురు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అంటే కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణ విషయమై మాట్లాడుకోవచ్చన్న విషయాన్ని సూటిగానే నీం చెప్పినట్లయ్యింది.

నీలంతో భేటి తర్వాత నిమ్మగడ్డ ఏమీ మాట్లాడకుండానే తన ఆఫీసుకు వెళ్ళిపోయారు. బహుశా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన వస్తుందనే విషయంలో ముందే ఓ అవగాహన నిమ్మగడ్డకు ఉండే ఉంటుంది. అందుకనే నీలం చెప్పిందంతా ఓపిగ్గా విని వెళ్ళిపోయారు. మరి ఇపుడు నిమ్మగడ్డ ఏమి చేస్తారు ? అన్నదే సస్పెన్సుగా మారింది. బహుశా రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ప్రధాన కార్యదర్శి చెప్పిన విషయాన్ని కోర్టుకు అఫిడవిట్ రూపంలో అందించే అవకాశాలున్నాయి. పనిలో పనిగా ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమీషన్ అభిప్రాయాన్ని కూడా చెబుతారు. మరి కోర్టు ఎలా స్పందిస్తుందనే విషయాన్ని చూడాలి.

This post was last modified on October 29, 2020 11:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

58 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago