Political News

త్రిశంకు స్వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు?

వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో న‌లుగురి ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మిగిలిన ఏడుగురు మాత్రం త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్ర‌జా ప్ర‌తినిధులుగా వారు స‌భ‌కు రావాల‌ని.. ప్ర‌జ‌ల ప‌క్షాన స‌భ‌లో గ‌ళం వినిపించాల‌ని భావిస్తున్న మాట వాస్త‌వం. అయితే.. దీనికి పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తీసుకు న్న నిర్ణ‌యం.. గీసిన ల‌క్ష్మణ రేఖ వంటివి వారికి ప్ర‌తిబంధ‌కంగా మారాయి. దీంతో వారు అటు స‌భ‌కు వెళ్లాలో.. ఇటు అధినాయ‌కుడి మాట వినాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతున్నారు.

గత ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ల‌తో పాటు జూనియ‌ర్లు, తొలిత‌రం వైసీపీనాయ‌కులు కూడా ఎమ్మెల్యే లుగా విజ‌యం ద‌క్కించుకున్నారు. స‌హ‌జంగా వీరిలో కొత్త‌వారికి స‌భ‌కు రావాల‌నే ఉంది. త‌ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పట్టు పెంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తు న్నారు. లేక‌పోతే.. రెంటికీ చెడ్డ రేవడిగా మారుతామ‌ని వారు భావిస్తున్నారు. కొత్త త‌రం ఎమ్మెల్యేలైతే.. అస‌లు అసెంబ్లీ తీరుపైనా వారు ఆస‌క్తి వ్య‌క్తం చేస్తున్నారు.

కానీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోసం ప‌ట్టుబ‌డుతున్న వైసీపీ అధినేత‌.. అది ఇస్తే త‌ప్ప‌.. తాము స‌భ‌కు వచ్చేది లేద‌ని చెబుతున్నారు. ఇది రాజ‌కీయంగా ఆయ‌న‌కు మేలు చేస్తుందా? చేయ‌దా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఎమ్మెల్యేలుగా ఉన్న ఆరేగుడురు నాయ‌కులు మాత్రం అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. త‌మకు ఓట్లు వేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెప్పాల‌న్న విష‌యంపైనా వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌ది నెల‌లు గ‌డిచిపోయిందని అంటున్నారు.

మ‌రోవైపు.. స‌భ‌కు స‌రిగా హాజ‌రు కాక‌పోతే.. వేటు త‌ప్ప‌ద‌న్న స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడి హెచ్చ‌రిక‌లు కూడా .. వైసీపీ ఎమ్మెల్యేల‌పై పెను ప్ర‌భావం చూపిస్తున్నాయి. అటు అధినేత జ‌గ‌న్, ఇటు స్పీక‌ర్ అయ్య‌న్నల హెచ్చ‌రిక‌లు, ఆదేశాల‌తో వైసీపీ నూత‌న త‌రం ఎమ్మెల్యేలు త‌ల్ల‌డిల్లుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే దొంగ చాటుగా వ‌చ్చి సంత‌కాలు పెట్టి వెళ్లిపోతున్నార‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌రోవైపు.. పార్టీ మారాల‌ని ఎదురు చూస్తున్న ఇద్ద‌రు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల‌కు కూట‌మి నుంచి స‌రైన సంకేతాలు రావ‌డం లేద‌ని స‌మాచారం. దీంతో వారు త్రిశంకు స్వ‌ర్గంలో అల్లాడిపోతున్నార‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.

This post was last modified on March 21, 2025 11:19 am

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

3 hours ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

4 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

4 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

6 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

7 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

7 hours ago