Political News

త్రిశంకు స్వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు?

వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో న‌లుగురి ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మిగిలిన ఏడుగురు మాత్రం త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్ర‌జా ప్ర‌తినిధులుగా వారు స‌భ‌కు రావాల‌ని.. ప్ర‌జ‌ల ప‌క్షాన స‌భ‌లో గ‌ళం వినిపించాల‌ని భావిస్తున్న మాట వాస్త‌వం. అయితే.. దీనికి పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తీసుకు న్న నిర్ణ‌యం.. గీసిన ల‌క్ష్మణ రేఖ వంటివి వారికి ప్ర‌తిబంధ‌కంగా మారాయి. దీంతో వారు అటు స‌భ‌కు వెళ్లాలో.. ఇటు అధినాయ‌కుడి మాట వినాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతున్నారు.

గత ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ల‌తో పాటు జూనియ‌ర్లు, తొలిత‌రం వైసీపీనాయ‌కులు కూడా ఎమ్మెల్యే లుగా విజ‌యం ద‌క్కించుకున్నారు. స‌హ‌జంగా వీరిలో కొత్త‌వారికి స‌భ‌కు రావాల‌నే ఉంది. త‌ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పట్టు పెంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తు న్నారు. లేక‌పోతే.. రెంటికీ చెడ్డ రేవడిగా మారుతామ‌ని వారు భావిస్తున్నారు. కొత్త త‌రం ఎమ్మెల్యేలైతే.. అస‌లు అసెంబ్లీ తీరుపైనా వారు ఆస‌క్తి వ్య‌క్తం చేస్తున్నారు.

కానీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోసం ప‌ట్టుబ‌డుతున్న వైసీపీ అధినేత‌.. అది ఇస్తే త‌ప్ప‌.. తాము స‌భ‌కు వచ్చేది లేద‌ని చెబుతున్నారు. ఇది రాజ‌కీయంగా ఆయ‌న‌కు మేలు చేస్తుందా? చేయ‌దా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఎమ్మెల్యేలుగా ఉన్న ఆరేగుడురు నాయ‌కులు మాత్రం అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. త‌మకు ఓట్లు వేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెప్పాల‌న్న విష‌యంపైనా వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌ది నెల‌లు గ‌డిచిపోయిందని అంటున్నారు.

మ‌రోవైపు.. స‌భ‌కు స‌రిగా హాజ‌రు కాక‌పోతే.. వేటు త‌ప్ప‌ద‌న్న స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడి హెచ్చ‌రిక‌లు కూడా .. వైసీపీ ఎమ్మెల్యేల‌పై పెను ప్ర‌భావం చూపిస్తున్నాయి. అటు అధినేత జ‌గ‌న్, ఇటు స్పీక‌ర్ అయ్య‌న్నల హెచ్చ‌రిక‌లు, ఆదేశాల‌తో వైసీపీ నూత‌న త‌రం ఎమ్మెల్యేలు త‌ల్ల‌డిల్లుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే దొంగ చాటుగా వ‌చ్చి సంత‌కాలు పెట్టి వెళ్లిపోతున్నార‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌రోవైపు.. పార్టీ మారాల‌ని ఎదురు చూస్తున్న ఇద్ద‌రు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల‌కు కూట‌మి నుంచి స‌రైన సంకేతాలు రావ‌డం లేద‌ని స‌మాచారం. దీంతో వారు త్రిశంకు స్వ‌ర్గంలో అల్లాడిపోతున్నార‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.

This post was last modified on March 21, 2025 11:19 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

26 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

32 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

4 hours ago