సినీ నటులు రాజకీయ నాయకుల కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లడం మామూలే. ఇక్కడ ప్రధానంగా పరిచయాలు, వ్యక్తిగత సంబంధాలే కీలక పాత్ర పోషిస్తుంటాయి. తమకు సన్నిహితులైన, లేదా బంధువులైన, ఇంకో రకమైన సంబంధం ఉన్న ఆ నాయకుల గురించి సినీ తారలు జనాల ముందు సానుకూలంగా మాట్లాడి వాళ్లకు ఓట్లేయమని కోరుతారు. లేదంటే ఆ నాయకుడి పార్టీ నుంచి వాళ్లేదైనా ప్రయోజనాలు ఆశించి ఎన్నికల ప్రచారాలకు వెళ్లొచ్చు.
ఐతే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ మాత్రం తనకసలు పరిచయం లేని నాయకుడి కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లింది. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీతోనూ ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం ప్రచారానికి వస్తే ఇంత అని డబ్బిస్తానంటే ఓకే అనేసి ప్రచారానికి వెళ్లిపోయి నానా తిప్పలు పడింది.
ఇప్పుడు మీడియా ముందుకొచ్చి ఆ నాయకుడు తనను చాలా ఇబ్బంది పెట్టాడంటూ మొర పెట్టుకుంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్లో ఎల్జేపీకి చెందిన డాక్టర్ ప్రకాష్ చంద్ర అనే అభ్యర్థికి ప్రచారం చేసేందుకు వెళ్లిన అమీషాకు అక్కడ చేదు అనుభవం ఎదురైందట. తనకు ఎంతమాత్రం తెలియని ప్రాంతంలో తనను నిర్బంధానికి గురి చేశారని.. ఫ్లైట్కు టైమ్ అవుతోందన్నా వినిపించుకోకుండా తనను ఆ అభ్యర్థి అనుచరులు చుట్టుముట్టి బలవంతంగా ఎన్నికల ప్రచారం చేయించారని.. కొంచెం ఉంటే అక్కడి వాళ్లు తనను రేప్ చేసేవారని ఆమె ఆవేదన చెందింది.
ప్రకాష్ చంద్రను అబద్ధాల కోరు అని, బ్లాక్మెయిలర్ అని, డర్టీ పర్సన్ అని.. ఇలా చాలా తిట్లే తిట్టింది అమీషా. కానీ డబ్బులు తీసుకుని తనకసలు పరిచయమే లేని వ్యక్తిని గెలిపించమంటూ ఎన్నికల ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం, తద్వారా ఆమె ఓట్లేసే జనాలకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నట్లు అన్నది ఇక్కడ ప్రశ్న.
This post was last modified on October 29, 2020 10:36 am
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…