ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలానే.. ఇక నుంచి మార్చి 19వ తేదీని ఏపీ ప్రజలు, ప్రభు త్వాలు కూడా మరిచిపోలేని విధంగా సీఎం చంద్రబాబు మార్చనున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో చేయలేని పనిని ఆయన బుధవారం సాధించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో చంద్రబాబు ఏపీకి సంబంధించిన పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇవి సాదా సీదా ఒప్పందాలు అయితే కాదు.
ప్రధానంగా భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత టెక్నాల జీని రాష్ట్రంలో విస్తృత పరిచే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర బృందం ఒప్పందం చేసుకోనుంది. ఇది రాష్ట్ర చరిత్ర గతిని భవిష్యత్తులో మార్చేయడం ఖాయమని ఐటీ నిపుణులు చెబుతు న్నారు. అంతేకాదు.. ప్రపంచ దేశాలు సైతం ఏపీవైపు చూసే విధంగాఈ మార్పు ఉంటుందని అంటున్నా రు. దీనితోపాటు.. డేటా కేంద్రాల ఏర్పాటు, ఐటీ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులపై కూడా.. గేట్స్తో ఒప్పందాలు చేసుకుంటారు.
అలానే.. నైపుణ్య శిక్షణలో కీలకమైన ఏఐ, ఐటీ రంగాల్లోనూ బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, అనంతపురం, విశాఖల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుపైనా ఒప్పందాలు జరగనున్నాయి. కృత్రిమ మేథ కు సంబంధించిన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం తలపోస్తున్న నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీ ట వేస్తుండడం గమనార్హం.
తద్వారా రాష్ట్ర ఆదాయం పెరగడంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత రెట్టింపు కానున్నాయి. సాధారణంగా ఒక పెట్టుబడి రావడం, ఒక పరిశ్రమ రావడం వేరు. కానీ, ఐటీకి సంబంధించి , ముఖ్యంగా ఏఐకి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడులు సాధిస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందు వరుసలో నిలవ నుంది. సో.. బిల్గేట్స్తో ఒప్పందాలు.. రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనున్నాయి. బుధవారం మధ్యాహ్నం.. సీఎం చంద్రబాబు ఢిల్లీలో గేట్స్తో జరిగే సమావేశంలో కీలకమైన ఒప్పందాలకు శ్రీకారం చుట్టనున్నారు.
This post was last modified on March 20, 2025 7:22 am
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…