Political News

వైఎస్సార్ పేరు పాయే.. ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం!

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలో కొన‌సాగుతున్న కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం సాయంత్రం భేటీ అయిన మంత్రి వ‌ర్గం.. ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. వీటిలో గ‌త వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న కీల‌క నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేసింది. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని తాడిగ‌డప మునిసిపాలిటీకి.. జ‌గ‌న్ స‌ర్కారు “వైఎస్సార్ తాడిగ‌డ‌ప మునిసిపాలిటీ”గా పేరు పెట్టింది. అయితే.. దీనిపై ప్ర‌జ‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశార‌ని.. స్థానికంగా ఆయ‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం లేద‌ని సీఎం చంద్ర‌బాబుపేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వైఎస్సార్ పేరును తొల‌గిస్తున్న‌ట్టు తెలిపారు.

దీంతో ఇక నుంచి వైఎస్సార్ తాడిగ‌డ‌ప మునిసిపాలిటీ.. కేవ‌లం తాడిగ‌డ‌ప మునిసిపాలిటీగానే కొన‌సాగుతుంద‌ని చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గానికి స్ప‌ష్టం చేశారు. దీనిపై త్వ‌ర‌లోనే జీవో జారీ చేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. ఇదేస‌మ‌యంలో వైసీపీ హ‌యాంలో చేప‌ట్టిన జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌లో క‌డ‌ప పేరును తీసేశార‌ని.. దీనికి కూడా ‘వైఎస్సార్‌’ అని పేరు పెట్టారని కొంద‌రు మంత్రులు తెలిపారు. ఈ పేరును కూడా తొల‌గించాల‌ని విన్న‌వించారు. అయితే.. అక్క‌డి ప్ర‌జ‌లు అలానే కోరుకుంటే.. త‌ప్ప‌కుండా మార్చేద్దామ‌ని.. కానీ, దీనిపై ఎవ‌రూ అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని.. కాబ‌ట్టి ఆ పేరును అలానే కొన‌సాగిద్దామ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

ఇక‌, చేనేత కార్మికుల‌కు 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌ను ఉచితంగా అందించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. వారికి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అన్ని విధాలా అండ‌గా ఉంటో్ంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఈ క్ర‌మంలో చేనేత కార్మికులు త‌మ‌కు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను 200 యూనిట్ల నుంచి 500 యూనిట్ల‌కు పెంచాల‌నికోరిన‌ట్టు చెప్పారు. దీంతో వారికి అనుకూలంగా ఉండేందుకు.. ఉచిత విద్యుత్‌ను 500 యూనిట్ల వ‌ర‌కు పెంచేందుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఉపాధ్యాయుల బ‌దిలీల‌ను చ‌ట్ట‌బద్ధం చేస్తూ..(అంటే ఎప్పుడు బ‌డితే అప్పుడు కాకుండా.. నిర్దేశిత స‌మ‌యంలోనే బ‌దిలీలు ఉండేలా) తీసుకున్న నిర్ణ‌యానికి కూడా మంత్రి వ‌ర్గం ఓకే చెప్పింది.

ఇక‌, అమ‌రావ‌తిలో వివిధ సంస్థ‌ల‌కు భూములు కేటాయిస్తూ.. మంత్రి పి. నారాయ‌ణ నేతృత్వంలోని ఉప సంఘం.. తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా చంద్ర‌బాబు నేతృత్వంలోని మంత్రివ‌ర్గం ఓకే చేసింది. మ‌రోవైపు కీల‌క‌మైన ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ క‌మిష‌న్‌(రాజీవ్ రంజ‌న్ మిశ్రా) ఇచ్చిన నివేదిక‌కు కూడా.. మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. దీనిని త్వ‌ర‌లోనే అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యించింది. అనంత‌రం జిల్లాలో అనంత‌పురం, స‌త్య‌సాయి జిల్లాలో పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసేందుకు కూడా మంత్రి వ‌ర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. త‌ద్వారా 40 వేల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని 10 నుంచి 20 వేల ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని సీఎం చెప్పారు.

Satya

Recent Posts

పెద్ద చేయి అందుకున్న నైజామ్ ప్యారడైజ్

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…

1 hour ago

అభిమానం స‌రే… ప‌వ‌న్‌ కు కాస్త రెస్ట్ ఇవ్వండి సార్‌!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌కు ప‌రామ‌ర్శ‌లు వెల్లువ‌లా త‌ర‌లి వ‌స్తున్నాయి. ఏపీ స‌హా తెలంగాణ…

1 hour ago

జానీ మాస్ట‌ర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ఇటీవ‌ల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేష‌న్లో పెద్ద గొడ‌వ జ‌రిగి అది మీడియా దృష్టిని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. ఈ…

3 hours ago

తమన్నా నుంచి బోల్డ్ ట్రీట్

బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…

4 hours ago

మా ఇంటి బంగారం… వివాదానికి తెర?

గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…

4 hours ago

20వ రోజుకు చేరిన దీక్ష… సోనమ్ పరిస్థితేంటి?

భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…

5 hours ago