టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా గత అనుభవాలను పదే పదే గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు…తన మనసులోని భవాలను ఎలాంటి మొహమాటం లేకుండానే బయటపెట్టేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఆయన నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు వినిపించాయి. 2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి వేరేవ్వరో కారణం కాదన్న చంద్రబాబు … తన కారణంగానే ఆ రెండు ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు అయ్యిందని వ్యాఖ్యానించారు.
2004, 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్లింది. 1999లో కూడా టీడీపీ అధికారంలో ఉండి ఎన్నికలకు వెళ్లగా… ఆ ఎన్నికల్లో తిరిగి టీడీపీని విజయపథాన నడిపిన చంద్రబాబు… తన సీఎం ప్రస్థానాన్ని కొనసాగించారు. 2004 ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచి ఉంటే.. హ్యట్రిక్ సీఎంగా ఆయన రికార్డు కొట్టేవారు. అయితే నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ టీడీపీ నుంచి అదికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇక 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ అదికారంలో ఉండే ఎన్నికలకు వెళ్లి… వైసీపీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
అదికారంలో ఉండి కూడా.. ప్రజా సేవలో ముందుండి కూడా 2004, 209 ఎన్నికల్లో ఎందుకు గెలవలేకపోయామని చంద్రబాబు చాలా సార్లు తనను తాను ప్రశ్నించుకుని ఉంటారు. ఇప్పుడు ఆ విషయాన్నే ఆయన బయటపెట్టేశారు. ఆ రెండు ఎన్నికల్లో తాను పనిలో పడిపోయి… పార్టీని, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానని చంద్రబాబు అన్నారు. ఆ సమయంలో తాను కొన్ని పనులు చేయలేకపోయానని ఆయన ఒప్పేసుకున్నారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినప్పుడు ఇక అపజయమన్నదే ఉండదని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తంగా ఆ రెండు కీలకమైన ఎన్నికల్లో టీడీపీ తన కారణంగానే ఓడిపోయిందని చెప్పి చంద్రబాబు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…