Political News

సజ్జన్నార్ పై అవినీతి ఆరోపణలు… నిజమేంత?

తెలంగాణలో మంగళవారం ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిణామం కేవలం నిమిషాల వ్యవదిలో రాష్ట్రంలో ఓ పెను చర్చకే తెర తీసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జన్నార్.. సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కొందరు ఆర్టీసీ ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. అంతటితో ఆగని వారు.. సజ్జన్నార్ అవినీతికి ఇవిగో ఆధారాలు అంటూ ఏకంగా ఓ 9 పేజీలతో కూడిన లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా పంపారు.

సజ్జన్నార్ పేరు వింటేనే… ఇప్పటిదాకా అవినీతి మకిలీ అంటని నిఖార్సైన పోలీసు అధికారి మన కళ్ల ముందు కదలాడతారు. అంతేకాకుండా నేరస్తులకు ఆయన ఓ సింహస్వప్నమే. ప్రత్యేకించి మహిళలపై నేరాలకు పాల్పడే మృగాళ్లకు ఆయన యమకింకరుడిగానూ కనిపిస్తారు. వరంగల్ లో విద్యార్థినిపై యాసిడ్ దాడి కేసు, హైదరాబాద్ లో వెలుగు చూసిన దిశ హత్యాచారం కేసుల్లో అతి తక్కువ సమయంలోనే నిందితులను పట్టేసిన సజ్జన్నార్.. వారిని ఎన్ కౌంటర్ చేసిన తీరు తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోరనే చెప్పాలి. అలాంటి అదికారి అవినీతికి పాల్పడటం ఏమిటి? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.

అయితే సజ్జన్నార్ పై ఊహించని రీతిలో వచ్చి పడిన ఈ ఆరోపణలపై ఆర్టీసీ సంస్థ చాలా వేగంగా స్పందించింది. సంస్థలో డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారిలో కొందరు సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారట. వీరిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన సజ్జన్నార్… ఆరోపణలు నిజమేనని తేలిన ఓ 400 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నారట. ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారంతా మంగళవారం అనూహ్యంగా నిరసనకు దిగడంతో పాటుగా సజ్జన్నార్ పైనే అవినీతి ఆరోపణలు చేశారని తెలిపింది. సదరు ఉద్యోగులకు సంబంధించి సంస్థ వద్ద ఉన్న వీడియోలను కూడా విడుదల చేసింది. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

2 hours ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

3 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ?

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

6 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

9 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

10 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

12 hours ago