2019 ఎన్నికల ముంగిట వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, వైఎస్ జగన్ చిన్నాన్న అయిన వివేకానందరెడ్డి మరణం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ముందేమో ఆయన గుండెపోటుతో చనిపోయాడన్నారు. తర్వాత ఆయనది దారుణమైన హత్య అనే విషయం బయటికి వచ్చింది. ఆపై అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద నింద మోపడానికి ప్రయత్నించారు. చివరికేమో ఈ హత్య కేసు వైఎస్ అవినాష్ మెడకే చుట్టుకుంది. జగన్కు సైతం ఈ కేసు వల్ల తీవ్ర ఇబ్బందులు తప్పట్లేదు.
ఈ నేపథ్యంలో వివేకా కేసు గురించి ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసును వైసీపీ ఎలా తప్పుదోవ పట్టించిందనే విషయమై మాట్లాడారు. తనే వివేకాను హత్య చేయించినట్లు ఆరోపిస్తూ సాక్షి పత్రికలో ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ కథనం వేయడం గురించి ఆయన ప్రస్తావించారు.
“ఆ రోజు పొద్దునే వాట్సాప్లో నాకు ఒక సమాచారం వచ్చింది. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని చూశా. మామూలుగా ఇలాంటి న్యూస్ వచ్చినపుడు నేను ఒకటికి రెండుసార్లు సరి చూసుకుంటాను. కానీ అప్పుడు ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్నా. వివేకాది గుండెపోటే అని నమ్మాను. కానీ మధ్యాహ్నానికి సునీత గారికి అనుమానం వచ్చి పోస్టుమార్టం చేయమంటే ఆయనది హత్య అని బయటపడింది. ఆమె పోస్టుమార్టం అడక్కపోయి ఉంటే అంత్యక్రియలు పూర్తి చేసేసేవారు. వివేకాది గుండెపోటుగానే అందరూ నమ్మేవారు.
నేరాలు ఘోరాలు చేసేవాళ్లు ఎలా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తారు అనడానికి ఇది ఉదాహరణ. హత్య అని బయటికి తెలియగానే నామీద తోసేయడానికి చూశారు. సాక్షి పత్రికలో, టీవీలో నారాసుర రక్తచరిత్ర అని వేసి రాజకీయ ప్రయోజనం పొందాలని చూశారు. 45 ఏళ్ల నా రాజకీయ చరిత్రలో కక్షపూరిత, హత్యా రాజకీయాల జోలికి వెళ్లలేదు. అలా చేసేవాళ్లను రాజకీయాల్లో లేకుండా చేయడానికి ప్రయత్నించాను. వివేకా హత్య కేసులో తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని చంద్రబాబు పేర్కొన్నారు.
This post was last modified on March 12, 2025 6:39 am
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…