2019 ఎన్నికల ముంగిట వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, వైఎస్ జగన్ చిన్నాన్న అయిన వివేకానందరెడ్డి మరణం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ముందేమో ఆయన గుండెపోటుతో చనిపోయాడన్నారు. తర్వాత ఆయనది దారుణమైన హత్య అనే విషయం బయటికి వచ్చింది. ఆపై అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద నింద మోపడానికి ప్రయత్నించారు. చివరికేమో ఈ హత్య కేసు వైఎస్ అవినాష్ మెడకే చుట్టుకుంది. జగన్కు సైతం ఈ కేసు వల్ల తీవ్ర ఇబ్బందులు తప్పట్లేదు.
ఈ నేపథ్యంలో వివేకా కేసు గురించి ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసును వైసీపీ ఎలా తప్పుదోవ పట్టించిందనే విషయమై మాట్లాడారు. తనే వివేకాను హత్య చేయించినట్లు ఆరోపిస్తూ సాక్షి పత్రికలో ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ కథనం వేయడం గురించి ఆయన ప్రస్తావించారు.
“ఆ రోజు పొద్దునే వాట్సాప్లో నాకు ఒక సమాచారం వచ్చింది. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని చూశా. మామూలుగా ఇలాంటి న్యూస్ వచ్చినపుడు నేను ఒకటికి రెండుసార్లు సరి చూసుకుంటాను. కానీ అప్పుడు ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్నా. వివేకాది గుండెపోటే అని నమ్మాను. కానీ మధ్యాహ్నానికి సునీత గారికి అనుమానం వచ్చి పోస్టుమార్టం చేయమంటే ఆయనది హత్య అని బయటపడింది. ఆమె పోస్టుమార్టం అడక్కపోయి ఉంటే అంత్యక్రియలు పూర్తి చేసేసేవారు. వివేకాది గుండెపోటుగానే అందరూ నమ్మేవారు.
నేరాలు ఘోరాలు చేసేవాళ్లు ఎలా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తారు అనడానికి ఇది ఉదాహరణ. హత్య అని బయటికి తెలియగానే నామీద తోసేయడానికి చూశారు. సాక్షి పత్రికలో, టీవీలో నారాసుర రక్తచరిత్ర అని వేసి రాజకీయ ప్రయోజనం పొందాలని చూశారు. 45 ఏళ్ల నా రాజకీయ చరిత్రలో కక్షపూరిత, హత్యా రాజకీయాల జోలికి వెళ్లలేదు. అలా చేసేవాళ్లను రాజకీయాల్లో లేకుండా చేయడానికి ప్రయత్నించాను. వివేకా హత్య కేసులో తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని చంద్రబాబు పేర్కొన్నారు.
This post was last modified on March 12, 2025 6:39 am
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…