Political News

కూట‌మికి కొత్త ఉత్సాహం!

కూట‌మికి కొత్త ఉత్సాహం వ‌చ్చింది. మ‌రీ ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన‌ల్లో అయితే.. ఈ ఉత్సాహం మ‌రింత రెట్టింప‌యింది. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితం కూట‌మి పార్టీలకు సంతృప్తినివ్వ‌డంతోపాటు.. ప్ర‌భుత్వ ప‌నితీరుకు మేధావులు, విద్యావంతులు సైతం జై కొట్టిన‌ట్టుగా సర్కారు లెక్క‌లు వేసుకుంది. ఇది మున్ముందు కూడా త‌మ‌కు లాభిస్తుంద‌ని భావిస్తున్నారు. సాధార‌ణంగా.. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు స‌ర్కారు ప‌నితీరుకు అద్దంప‌ట్టాయ‌నే చెప్పాలి.

గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఆ పార్టీకి వ్య‌తిరేకంగా గ్రాడ్యుయేట్లు పోటెత్తారు. అప్ప‌ట్లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. కానీ.. ఇప్పుడు కూట‌మి పార్టీల‌కు గ్రాడ్యుయేట్లు జై కొట్టారు. అంటే.. ఒక‌ర‌కంగా.. ఇది ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టుగానే భావించాల్సి ఉంటుంది. నిజానికి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 9 మాసాలు అయిన నేప‌థ్యంలో వ్య‌తిరేక‌త ఉంటుంద‌న్న భావ‌న అయితే.. పైకి క‌నిపించింది. కానీ, ఆ త‌ర్వాత మాత్రం.. ఎక్క‌డా ఆ ప‌రిస్థితి క‌నిపించ‌లేదు.

సో.. ఇది తమ ప్ర‌భుత్వానికి ల‌భించిన మ‌ద్ద‌తుగానే చంద్ర‌బాబు స‌హా నాయ‌కులు భావిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నిక‌లు వ‌చ్చినా.. పార్టీలు ప‌రుగులు పెట్టాలన్న వ్యూహాన్ని కూడా అమ‌లు చేయనున్నారు. ఇది ప్ర‌త్య‌క్షంగాను, ప‌రోక్షంగాను వైసీపీకి న‌ష్టం చేకూర్చే అంశ‌మేన‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెర‌గ‌లేద‌న్న సంకేతాలు వ‌చ్చాయంటే.. ప‌రోక్షంగా వైసీపీని ప్ర‌జలు అంగీక‌రించ‌డం లేద‌న్న విష‌యం వాస్త‌వం.

కాబట్టి కూట‌మిలో కొత్త ఉత్సాహం పొంగిపొర్లిన‌ప్పుడ‌ల్లా.. వైసీపీ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. లేక‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇక,కూట‌మి ప‌రంగా చూసుకుంటే.. క‌లివిడి మ‌రింత పెరిగితేనే త‌ప్ప‌.. రాజ‌కీయంగా ఇప్పుడున్న సానుకూల‌త సార్వ‌త్రిక ఎన్నికల నాటికి బ‌లోపేతం కావ‌డం క‌ష్టం. కాబ‌ట్టి.. కూట‌మి పార్టీలు స‌ఖ్య‌త‌, ఐక్య‌త దిశ‌గా మ‌రింత దూకుడు పెంచాల్సిన అవ‌స‌రం ఉంది. సాధించిన దానికి సంతృప్తిని చెంద‌డం కంటే.. మ‌రింత మెరుగైన ఫ‌లితాలు సాధించే ప్ర‌య‌త్నం చేయాల్సి ఉంది.

This post was last modified on March 6, 2025 3:19 pm

Share

Recent Posts

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

1 hour ago

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

6 hours ago

దేశ‌వ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమ‌య్యారు?

దేశ‌వ్యాప్తంగా 288 మంది నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంత‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం 532 మంది ఆచూకీ క‌నిపించ‌కుండా…

8 hours ago

మృతదేహాల నుంచి నగల అపహరణ… నేపాల్‌లో అమానవీయం

నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…

8 hours ago

ఒకే రోజు 10 మంది… మూడు వారాల్లో 60 మంది శిశువుల మృతి

దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ…

8 hours ago

సినిమా పోయినా… దిల్ రాజు సేఫేనట

కన్నడ అనువాద చిత్రమైన ‘టాక్సిక్’ ఇక్కడి టాప్ స్టార్ల సినిమాల లెవెల్లో భారీగా రిలీజైందంటే అందుకు ప్రధాన కారణం.. దిల్…

8 hours ago