Political News

ఢిల్లీలో బాబు… అమిత్ షాతో సుదీర్ఘ భేటీ

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే చంద్రబాబు… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపుగా గంటకు పైగా సాగి ఈ సుదీర్ఘ భేటీలో చంద్రబాబు చాలా విషయాలనే ప్రస్తావించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో భాగంగా ఇంకా పెండింగ్ లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అమిత్ షాను చంద్రబాబు కోరారు. ఈ సమస్యలు పరిష్కారం అయితే పొరుగు రాష్ట్రం తెలంగాణతో మరింత స్నేహపూర్వక వాతావరణం నెలకొనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

ఇక ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు, జారీ కావాల్సిన అనుమతుల విషయంపైనా చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఆయా శాఖలకు కేంద్రం నుంచి మంచి సహకారమే అందుతోందని చెప్పిన చంద్రబాబు…మరింత సహకారాన్ని కోరారు. ఆ మేరకు ఆయా కేంద్ర శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన అమిత్ షాను కోరారట. కేంద్రం నుంచి అందుతున్న నిధుల వినియోగాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా అమిత్ షా ముందు పెట్టినట్లు సమాచారం. ఏ పని కోసం ఇస్తున్న నిధులను ఆయా పనుల కోసమే వెచ్చిస్తున్న వైనాన్ని చంద్రబాబు కేంద్ర మంత్రికి తెలియజేశారట.

ఇక రాజకీయ అంశాల విషయానికి వస్తే… ఇటీవలే వైసీపీతో పాటుగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సీటు భర్తీ విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు…ఏపీలోని కూటమి నేతలతోనే భర్తీ చేయాల్సి ఉన్నందున… ఆ సీటును ఎవరికిద్దామన్న విషయంపై అమిత్ షాతో ఆరా తీసినట్లు సమాచారం. అమిత్ షాతో భేటీని ముగించుకున్న చంద్రబాబు…అక్కడి నుంచి నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కోసం వెళ్లారు. ఆ తర్వాత కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గద్కరీతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.

This post was last modified on March 5, 2025 7:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

32 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

8 hours ago