తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు అలిగారని సమాచారం. కారణమేంటా అంటే… ఈమధ్యనే చంద్రబాబునాయుడు జాతీయ కమిటి, పాలిట్ బ్యూరో నియమించిన విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ కేడర్ డీలా పడింది. పార్టీలో జోష్ నింపే వ్యూహాల్లో భాగంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలలో ఒకటి కమిటీల నియామకం. అయితే… అటు కమిటిలోను, ఇటు పాలిట్ బ్యూరోలోను చోటు దక్కని చాలామంది సీనియర్లు చంద్రబాబుపై అలిగారట. నేరుగా ఎక్కడా తాము అసంతృప్తిని బయటకు వ్యక్తం చేయకుండా తన మద్దతుదారుల ద్వారా బయటపెడుతున్నారట.
ఉన్న ముగ్గురు ఎంపిల్లో గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడుకు పదవులు ఇచ్చిన చంద్రబాబు విజయవాడ ఎంపి కేశినేని నానిని పక్కనపెట్టేశారు. అలాగే గుంటూరులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, నన్నపనేని రాజకుమారిలకు చోటు కల్పించలేదు. ఇక కృష్ణా జిల్లాలో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పంచుమర్తి అనూరాధ లాంటి సీనియర్లకు ఏ కమిటిలోను చోటు కనబడలేదు.
ఇదే సందర్భంగా విశాఖనగరంలో మాజీమంత్రి గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళకు కూడా స్ధానం కల్పించలేదు. ప్రకాశం జిల్లాలోని ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు లాంటి వాళ్ళకు కూడా కమిటిల్లో చోటు దక్కలేదు. గంటా పార్టీని వదిలేస్తాడనే ప్రచారం కారణంగా చోటు కల్పించలేదని అనుకోవచ్చు. కానీ పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న గౌతు శిరీష లాంటి వాళ్ళకు కూడా చోటు ఎందుకు దక్కలేదో తెలీదు.
ఇదే విషయమై అనేకమంది సీనియర్ నేతలు పార్టీ అధినేతపై అసంతృప్తితో మండిపోతున్నారట. అయితే ఈ విషయం గ్రహించిన చంద్రబాబు అసంతృప్తితో ఉన్న నేతలకు నేరుగా ఫోన్లు చేసి మరీ బుజ్జగిస్తున్నారు. జాతీయ కమిటిలో కానీ పాలిట్ బ్యూరో లో కానీ చోటు కల్పించలేకపోయిన కారణాలను వివరించి చెబుతున్నారట. రాష్ట్ర కమిటిలో తప్పక స్ధానం కల్పిస్తానని హామీ ఇస్తున్నారట. నిజంగా ఆలోచిస్తే పార్టీ నేతల్లో ఎంతమందికని చంద్రబాబు మాత్రం చోటు కల్పించగలుగుతారు ? సీనియర్లందరికీ కమిటిల్లో చోటు కల్పించాలంటే ప్రతి కమిటిలోను వందలమందిని నియమించాల్సుంటుంది. మరి చంద్రబాబు బుజ్జగింపులు ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి.
This post was last modified on October 26, 2020 10:51 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…