Political News

మొక్కుబ‌డి మ‌ద్ద‌తు.. వైసీపీకి మ‌రో దెబ్బ‌.. !

మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డ‌మేకాదు.. మ‌ద్ద‌తు ఇచ్చిన‌ప్పుడు.. దానికి త‌గ్గ‌ట్టుగా క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేయాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంది. కానీ, ఈ విష‌యంలో వైసీపీ చేసిన త‌ప్పు.. ఆ పార్టీ ప్ర‌తిష్ట‌ను మ‌రోసారి మంట‌గ‌లిపింది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత .. అంతో ఇంతో సానుభూతిని సొంతం చేసుకున్నామ‌ని.. ప్ర‌జ‌ల్లో కూట‌మి స‌ర్కారుపై తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగింద‌ని.. ఇది త‌మ‌కు లాభిస్తుంద‌ని చెప్పుకొన్న వైసీపీ నాయ‌కుల‌కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మె ల్సీ స్థానంలో వైసీపీ మ‌ద్ద‌తు ప‌లికిన‌.. కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు ఘోర ప‌రాజ‌యం చవిచూశారు.

వాస్త‌వానికి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్‌, నోటిఫికేష‌న్ వ‌చ్చే నాటికి వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేక పోయింది. త‌ర్వాత‌.. మారిన ప‌రిస్థితుల‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్‌..రెండు జిల్లాల నాయ‌కుల‌తో వేర్వేరుగా, ఉమ్మ‌డిగా రెండు నుంచి నాలుగు సార్లు భేటీ అయ్యారు. “ఆల‌పాటి రాజాను ఓడించ‌డ‌మే ధ్యేయంగా మ‌నం ప‌నిచేయాలి” అని ఆయ‌న తేల్చి చెప్పారు. అంతేకాదు.. కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు గతంలో వైసీపీకి అనుకూలంగా ప‌నిచేసిన విష‌యాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు అనుకూలంగా ప‌నిచేయాల‌ని నాయ‌కుల‌కు తేల్చి చెప్పారు.

అయితే.. చెప్ప‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మైన జ‌గ‌న్‌.. పార్టీ నాయ‌కుల‌ను ప‌ర్య‌వేక్షించ‌లేద‌న్న‌ది వాస్త‌వం. నాయ‌కులు ఏమేర‌కు ప్ర‌చారం చేస్తున్నారో కూడా చూడ‌లేదు. మ‌రోవైపు ఆల‌పాటి రాజాకు కూట‌మి బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఇవ్వ‌డం, ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు.. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వ‌రి కూడా ఆల‌పాటికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో ఆయ‌నకు అన్ని విధాలా క‌లిసి వ‌చ్చింది. అంతేకాదు.. ప‌ట్ట‌భ‌ద్రుల‌ను క‌దిలించ‌డంలోనూ కూట‌మి చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. అయితే.. ఈ వ్యూహాల‌కు దీటుగా వైసీపీ పుంజుకోలేక పోయింది.

కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం కేఎస్‌ను వైసీపీ ఓన్ చేసుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఆయ‌న గెలుపుతో వైసీపీ పుంజుకున్నద‌న్న భావ‌న వ్య‌క్త‌ప‌ర‌చాల‌ని కూడా వైసీపీ అధినేత చెప్పుకొచ్చారు. కానీ, వ్యూహాలు లేక‌పోవ‌డం.. ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉంద‌ని చెప్పినా..దానిని క్యాష్ చేసుకునే విధంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం వంటివి వైసీపీకి భారీ డ్యామేజీని తీసుకువ‌చ్చింది. నిజానికి కేఎస్ గెలిచి ఉంటే.. అది వైసీపీ ఖాతాలో ప‌డి ఉండేది. ఇలా చూసుకుంటే.. ఇప్పుడు ఆయ‌న ఓట‌మి కూడా ప‌క్కాగా వైసీపీనే భ‌రించాల్సి ఉంటుంది. దీనిని బ‌ట్టి గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. కూడా వైసీపీ పుంజుకోలేద‌నే చెప్పాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

8 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

8 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

9 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

9 hours ago