మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడమేకాదు.. మద్దతు ఇచ్చినప్పుడు.. దానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ, ఈ విషయంలో వైసీపీ చేసిన తప్పు.. ఆ పార్టీ ప్రతిష్టను మరోసారి మంటగలిపింది. గత ఎన్నికల తర్వాత .. అంతో ఇంతో సానుభూతిని సొంతం చేసుకున్నామని.. ప్రజల్లో కూటమి సర్కారుపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని.. ఇది తమకు లాభిస్తుందని చెప్పుకొన్న వైసీపీ నాయకులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్ర ఎమ్మె ల్సీ స్థానంలో వైసీపీ మద్దతు పలికిన.. కేఎస్ లక్ష్మణరావు ఘోర పరాజయం చవిచూశారు.
వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వచ్చే నాటికి వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేక పోయింది. తర్వాత.. మారిన పరిస్థితులతో వైసీపీ అధినేత జగన్..రెండు జిల్లాల నాయకులతో వేర్వేరుగా, ఉమ్మడిగా రెండు నుంచి నాలుగు సార్లు భేటీ అయ్యారు. “ఆలపాటి రాజాను ఓడించడమే ధ్యేయంగా మనం పనిచేయాలి” అని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు.. కేఎస్ లక్ష్మణరావు గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా పనిచేయాలని నాయకులకు తేల్చి చెప్పారు.
అయితే.. చెప్పడం వరకే పరిమితమైన జగన్.. పార్టీ నాయకులను పర్యవేక్షించలేదన్నది వాస్తవం. నాయకులు ఏమేరకు ప్రచారం చేస్తున్నారో కూడా చూడలేదు. మరోవైపు ఆలపాటి రాజాకు కూటమి బలమైన మద్దతు ఇవ్వడం, ఎన్నికలకు రెండు రోజుల ముందు.. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి కూడా ఆలపాటికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడంతో ఆయనకు అన్ని విధాలా కలిసి వచ్చింది. అంతేకాదు.. పట్టభద్రులను కదిలించడంలోనూ కూటమి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే.. ఈ వ్యూహాలకు దీటుగా వైసీపీ పుంజుకోలేక పోయింది.
కానీ, ఎన్నికల సమయంలో మాత్రం కేఎస్ను వైసీపీ ఓన్ చేసుకున్నట్టు ప్రకటించింది. ఆయన గెలుపుతో వైసీపీ పుంజుకున్నదన్న భావన వ్యక్తపరచాలని కూడా వైసీపీ అధినేత చెప్పుకొచ్చారు. కానీ, వ్యూహాలు లేకపోవడం.. ప్రజల్లో సానుభూతి ఉందని చెప్పినా..దానిని క్యాష్ చేసుకునే విధంగా వ్యవహరించకపోవడం వంటివి వైసీపీకి భారీ డ్యామేజీని తీసుకువచ్చింది. నిజానికి కేఎస్ గెలిచి ఉంటే.. అది వైసీపీ ఖాతాలో పడి ఉండేది. ఇలా చూసుకుంటే.. ఇప్పుడు ఆయన ఓటమి కూడా పక్కాగా వైసీపీనే భరించాల్సి ఉంటుంది. దీనిని బట్టి గత ఎన్నికల తర్వాత.. కూడా వైసీపీ పుంజుకోలేదనే చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on March 4, 2025 10:16 am
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…
చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…
ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…