Political News

చేరిన వాళ్ళ కన్నా సస్పెండ్ అయిన నేతలే ఎక్కువా ?

రాష్ట్ర బీజేపీలో విచిత్రమైన పరిస్దితులు కనబడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా రాష్ట్ర బిజేపీలో చాలామంది ఇతర పార్టీల నుండి వచ్చి చేరిపోతారని మొదట్లో కమలనాధులు అనుకున్నారు. అయితే కేంద్రంలో అధికారం విషయాన్ని పక్కనపెట్టేస్తే రాష్ట్రంలో మాత్రం పార్టీ ఏమాత్రం బలపడలేదన్న విషయం తెలిసిపోతోంది. ఎందుకంటే కేంద్రంలో ఇంకా ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో మాత్రం కనీసం గట్టి ప్రతిపక్షంగా కూడా ఎదగలేదనే అనుమానాలుండటమే ప్రధాన కారణం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గడచిన మూడు మాసాల్లో ఆరుగురు నేతలను పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ లైన్ దాటి స్వతంత్రంగా మాట్లాడుతున్నారనే కారణంగా వీరందరిపై సస్పెన్షన్ వేటు వేసింది పార్టీ. సస్పెండ్ అయిన నేతల్లో టీడీపీ నుండి కమలం పార్టీలో చేరిన వాళ్ళే ఎక్కువున్నారు. అదే సమయంలో బీజేపీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు.

పార్టీ లైనంటే ప్రధానంగా అమరావతి ఇష్యూనే వస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షునిగా ఉన్నంత కాలం నేతలను ఓ కారణంతో సస్పెండ్ చేస్తే సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాత మరో కారణంగా సస్పెండ్ అవుతున్నారు. పార్టీతో దాదాపు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్న కుమారరాజను కన్నా సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారంటే అనుమతి లేకుండానే టీవీ చర్చల్లో పాల్గొన్నారని.

ఇక సోము అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెలగపూడి గోపాలకృష్ణ, రామకోటయ్యలను సస్పెండ్ చేశారు. ఎందుకంటే అమరావతిపై పార్టీలైనుకు భిన్నంగా మాట్లాడినందుకట. అలాగే తాజాగా లంకా దినకర్ ను కూడా పార్టీ నుండి వీర్రాజు సస్పెండ్ చేసేశారు. ఎందుకంటే పార్టీ వద్దన్నా టీవీ చర్చల్లో పాల్గొన్నారనే కారణం చెబుతున్నారు. ఒక్క కుమారరాజా తప్ప మిగిలిన వాళ్ళపైన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇదే సమయంలో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి, అన్నం సతీష్ లాంటి వాళ్ళ గొంతులే ఎక్కడా వినబడటం లేదు. టీడీపీ నుండి బిజేపీలో చేరిన నేతల్లో చందు సాంబశివరావు మాత్రమే టీవీ చర్చల్లో తరచూ కనబడుతున్నారు. మొత్తం మీద బీజేపీలో చేరిన నేతలకన్నా సస్పెండ్ అయి బయటకు వెళ్ళిపోయిన నేతల సంఖ్యే ఎక్కువగా ఉందని పార్టీలో జోకులేసుకుంటున్నారు.

This post was last modified on October 25, 2020 4:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

1 hour ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

2 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

2 hours ago

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…

3 hours ago

చిరుపై విమర్శకులకు లావణ్య కౌంటర్

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…

3 hours ago

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

3 hours ago