కుల వృత్తులకు మన సమాజంలో ఎనలేని గుర్తింపు ఉంది. ఒక్కో వృత్తిలో ఒక్కో రకమైన కళ దాగి ఉంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆ కళలు అలా వినుతికెక్కుతూ ఉంటాయి. ఇలాంటి ఎప్పటికప్పుడు సరికొత్త కళాకృతులతో ఆకట్టుకుంటున్న వృత్తి చేనేత వృత్తి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి చేనేత కళకు కాణాచి. ఎన్నెన్నో కొత్త కళాకృతులు ఇక్కడి నేతన్న చేతుల్లో రూపుదిద్దుకుంటున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన… బుధవారం అలాంటి ఓ కళాకృతి ఒకటి వెలుగులోకి వచ్చింది.
మంగళగిరికి చెందిన చేనేత కార్మికుడు జంజనం మల్లేశ్వరరావు, ఆయన కుమారుడు కార్తికేయలు టీడీపీ వీరాభిమానులు. తమ అభిమాన నాయకుడు తమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైనం వారిని మరింతగా ఆకట్టుకున్నట్టు ఉంది. తమ అభిమాన నాయకుడి మొత్తం కుటుంబాన్ని చేనేత వస్త్రంపై చిత్రీకరిస్తే ఎలా ఉంటుందని భావించారు. అనుకున్నదే తడవుగా తండ్రీకొడుకులు… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ల చిత్రాలను ఓ ఫొటో మాదిరిగా వస్త్రంపై అచ్చేసినట్టుగా రూపొందించేశారు.
ఈ వస్త్రాన్ని తీసుకుని ఆ తండ్రీకొడుకులు బుధవారం లోకేశ్ ను కలిశారు. అభిమానం కొద్దీ తాము రూపొందించిన వస్త్రాన్ని వారు లోకేశ్ కు బహూకరించారు. ఆ వస్త్రాన్ని… దానిపై తన మొత్తం కుటుంబ సభ్యులను ఓ ఫొటో మాదిరిగా అచ్చేసినట్టుగా చేనేత వస్త్రాన్ని తీర్చిదిద్దిన వారిద్దరి పనితనాన్ని లోకేశ్ వేనోళ్ల కొనియాడారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో తమకు చేతనైన మేర సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామంటూ వారు లోకేశ్ కు తెలిపారట. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా…తన పార్టీ శ్రేణులు ఇలా సేవా కార్యక్రమాలు చేపడతానంటే ఎవరు మాత్రం కాదంటారు? అందుకే లోకేశ్ కూడా ఆ తండ్రీకొడుకులకు గో అహెడ్ అంటూ అభయం ఇచ్చారట.
This post was last modified on February 27, 2025 7:37 am
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…