Political News

జగన్ మాటలే వంశీ నోట వస్తున్నాయా..?

దళిత యువకుడు ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం పోలీసుల కస్డడీలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించగా… తొలి రోజు కస్టడీ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కేంద్రంగా విచారణ జరగగా… వంశీ తాను ముందుగా నిర్దేశించుకున్న సమాధానాలనే పోలీసుల ఎదుట చెప్పినట్లుగా తెలుస్తోంది. విచారణలో పోలీసులు తనను ఏమేం ప్రశ్నలు అడుగుతారన్న దానిపై ఓ అంచనా వేసిన వంశీ.. ఆ ప్రశ్నలకు ముందుగానే సమాధానాలు సిద్ధం చేసుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఎలా జరిగిందన్న దానిపై ఇటీవలే వంశీని జైలులో కలిసి వచ్చిన సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారని…ఒకానొక సమయంలో గన్నవరం వైసీపీ కార్యాలయంపై దాడికి ఆయన యత్నించారని.. ఈ క్రమంలోనే కోపోద్రిక్తులైన వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయంపై దాడికి యత్నించారని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. సేమ్ టూ సేమ్ వంశీ నోట కూడా మంగళవారం ఇదే వాదన బయటకు వచ్చిందట. గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎందుకు దాడి చేయించారని పోలీసులు అడిగితే… జగన్ చెప్పిన వాదననే వంశీ పూసగుచ్చినట్లుగా వివరించారట.

ఇక పోలీసులు అడిగిన మరిన్ని ప్రశ్నలకు కూడా వంశీ దాటవేత సమాధానాలనే ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను మొత్తం మూడు ఫోన్లను వాడుతున్నానని చెప్పిన వంశీ.. ఆ మూడింటిని ఎక్కడ పెట్టానో తెలియడం లేదని చెప్పారట. ఇక సత్యవర్ధన్ హైదరాబాద్ లోని తన ఇంటికి వచ్చిన మాట నిజమేనని ఒప్పుకున్న వంశీ… అసలు అతను సత్యవర్ధన్ అని తనకు తెలియదని చెప్పారట. ఎవరితోనో కలిసి తన ఇంటికి వచ్చిన సత్యవర్ధన్ ఓ రాత్రి తన ఇంటిలో విశ్రాంతి తీసుకుని ఆ మరునాడు వెళ్లిపోయాడని.. అయితే అతడు ఎక్కడికి వెళ్లిపోయాడో మాత్రం తనకు తెలియదని తెలిపారట. సత్యవర్ధన్ ను తానేమీ బెదిరించలేదన్న వంశీ… కోర్టుకు సత్యవర్ధనే వెళ్లి వాంగ్మూలం ఇచ్చారని… ఈ విషయంలో తన ప్రమేయం ఎంతమాత్రం లేదని తెలిపారట.

ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ తర్వాత వంశీ..హైదరాబాద్ నుంచి తాడేపల్లి వెళ్లారని, ఈ సందర్భంగా తన లొోకేషన్ పోలీసులకు తెలియకుండా ఉండేలా సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని అంశంపైనా వంశీ తనదైన శైలి సమాధానాలు చెప్పారట. హైదరాబాద్ నుంచి తాను తాడేపల్లి వెళ్లిన మాట వాస్తవమేనని ఒప్పుకున్న వంశీ… అందరూ అనుకుంటున్నట్లుగా తాడేపల్లిలో తాను ఎవరితోనూ కలవలేదని తెలపారట. ఎవరినీ కలవనప్పుడు హైదరాబాద్ నుంచి తాడేపల్లి ఎందుకు వెళ్లినట్లు అంటే…వంశీ నుంచి మౌనమే సమాధానమైందని సమాచారం. ఈ ప్రశ్నలన్నింటినీ పోలీసులు పలు ఆధారాలు వంశీ ముందు పెట్టి మరీ సంధించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సత్యవర్థన్ తన ఇంటికి వచ్చిన విషయాన్ని… తాను తాడేపల్లి వెళ్లిన విషయాన్ని వంశీ దాటవేయలేకపోయారని తెలుస్తోంది..

This post was last modified on February 26, 2025 10:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

59 minutes ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

1 hour ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

2 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago

పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?

సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…

3 hours ago

అమరావతిపై 48 గంటల్లో టోన్ మార్చిన వైసీపీ!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…

3 hours ago