అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిన్న చీకటి రోజు అని, గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డుపడిన తీరును ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ అంటే ఒక గౌరవమని, ఒక పవిత్ర దేవాలయం అని..కానీ,వైసీపీ సభ్యులు దానిని అపవిత్రం చేశారని మండిపడ్డారు. సరిగ్గా 11 గంటలకు జగన్ శాసన సభకు 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చిన కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉండి 11.11 కు వెళ్లిపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వం గౌరవ శాసన సభను కౌరవ సభగా మార్చిందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. గౌరవ సభను గౌరవించలేని, సంస్కారం లేని పార్టీ వైసీపీ అని విమర్శించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ దిగజారి మాట్లాడుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. తన 41 ఏళ్ల రాజకీయ జీవితంలో అలా అడిగిన తొలి వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలని, తాము కాదని మరోసారి గుర్తు చేశారు.
సభా సంప్రదాయాలను మరచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ వస్తా అని చెప్పే వ్యక్తిని తొలిసారి చూస్తున్నానని అన్నారు.
దేశంలో ఎక్కడా జరగని విధంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ అడుతున్నారని చెప్పారు. 9వ సారి తాను ఎమ్మెల్యేగా సభకు వచ్చానని, బహుశా అది ఒక రికార్డు అని అన్నారు. కానీ, వైసీపీ సభ్యుల వంటి తీరు మరే సభ్యుల దగ్గర చూడలేదని గుర్తు చేసుకున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…