అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిన్న చీకటి రోజు అని, గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డుపడిన తీరును ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ అంటే ఒక గౌరవమని, ఒక పవిత్ర దేవాలయం అని..కానీ,వైసీపీ సభ్యులు దానిని అపవిత్రం చేశారని మండిపడ్డారు. సరిగ్గా 11 గంటలకు జగన్ శాసన సభకు 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చిన కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉండి 11.11 కు వెళ్లిపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వం గౌరవ శాసన సభను కౌరవ సభగా మార్చిందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. గౌరవ సభను గౌరవించలేని, సంస్కారం లేని పార్టీ వైసీపీ అని విమర్శించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ దిగజారి మాట్లాడుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. తన 41 ఏళ్ల రాజకీయ జీవితంలో అలా అడిగిన తొలి వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలని, తాము కాదని మరోసారి గుర్తు చేశారు.
సభా సంప్రదాయాలను మరచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ వస్తా అని చెప్పే వ్యక్తిని తొలిసారి చూస్తున్నానని అన్నారు.
దేశంలో ఎక్కడా జరగని విధంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ అడుతున్నారని చెప్పారు. 9వ సారి తాను ఎమ్మెల్యేగా సభకు వచ్చానని, బహుశా అది ఒక రికార్డు అని అన్నారు. కానీ, వైసీపీ సభ్యుల వంటి తీరు మరే సభ్యుల దగ్గర చూడలేదని గుర్తు చేసుకున్నారు.
This post was last modified on February 25, 2025 9:54 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…