Political News

తండ్రి వ్యూహం కొడుకు దగ్గర మిస్సింగ్

క్షేత్రస్ధాయి నుండి అందుతున్న సమాచారాన్ని చూసిన తర్వాత అందరు ఇదే అనుకుంటున్నారు. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ అన్నీ సీట్లలోను ఒంటిరిగా పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేంత వరకు ఎన్డీఏ కూటమిలోనే ఎల్జేపీ కూడా ఉండేది. అయితే కూటమి అధినేత, ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ తో ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కు గొడవలు మొదలయ్యాయి.

కారణాలు ఏవైనా ఎన్డీఏ కూటమిలో ఉండలేకపోవటంతో చిరాగ్ బయటకు వచ్చేశాడు. చిరాగన్ ను కూటమిలోనే ఉంచేందుకు బీజేపీ తరపున జరిగిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో వేరు కుంపటి పెట్టుకున్న ఎల్జేపీ మొత్తం అన్నీ సీట్లోను పోటి చేయాలని డిసైడ్ చేసింది.

అందుబాటులోని సమాచారం ప్రకారం బహుశా ప్రస్తుత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తనే ప్రొజెక్టు కావాలని చిరాగ్ అనుకున్నట్లున్నారు. తన తండ్రి, కేంద్రమంత్రిగా పనిచేసిన రామ్ విలాస్ పాశ్వాన్ మద్దతుతో ఎన్నికల్లో ఈజీగా గెలిచిపోవచ్చని అంచనాలు వేసినట్లు సమాచారం. అయితే అనూహ్యంగా ఎన్నికల వేడి బాగా అంటుకున్న తర్వాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రామ్ విలాస్ ఈమధ్యే చనిపోయారు. తండ్రి అకాస్మత్తుగా చనిపోవటం చిరాగ్ పెద్ద దెబ్బనే చెప్పాలి. అయితే తండ్రి మృతి తాలూకు సానుభూతి తనకు ఓట్ల రూపంలో వచ్చిపడతాయని వేసిన అంచనా కూడా ఫెయిల్ అయ్యేట్లే ఉంది.

ఎలాగంటే రామ్ విలాస్ కు బీహార్ దళితుల్లో తిరుగులేని ఇమేజి ఉన్న మాట వాస్తవమే. కానీ అదే పేరు, పట్టు చిరాగ్ కు లేదు. పైగా చిరాగ్ వయస్సులో కూడా (37) మరీ చిన్నవాడే కావటంతో ఓటర్లు, దళితుల్లో సీనియర్ నేతలు కూడా పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. పైగా ఇఫుడు ఎన్డీఏ కూటమిలో సభ్యుడు కూడా కాదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రీ పోల్ సర్వేల్లో ఎల్జేపీ అసలు విషయం బయటపడింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల తీరుపై లోక్ నీతి-సీఎస్డిఎస్ జరిగిన ఓ సర్వేలో ఎల్జేపీ గురించి జనాలు పెద్దగా పట్టించుకోవటం లేదని తేలింది. పోటీ ప్రధానంగా ఎన్డీఏ, యూపీఏ కూటముల మధ్యే ఉంటుందని చాలామంది ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

చిరాగ్ అమలు చేస్తున్న ప్లాన్ కూడా బెడిసికొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అర్ధమైపోతోంది. అదేమంటే జేడీయూ అభ్యర్ధులు పోటి చేస్తున్న 122 సీట్లలో బలమైన అభ్యర్ధులను రంగంలోకి దింపాలని చిరాగ్ ప్లాన్ చేశారు. ఇదే సమయంలో బీజేపీ పోటి చేస్తున్న 121 సీట్లలో ఎక్కువ చోట్ల వీక్ క్యాండిడేట్లను రంగంలోకి దింపాలన్నది చిరాగ్ ప్లాన్. ఎంత గోప్యంగా ప్లాన్ చేసినా అభ్యర్ధులను చూసిన తర్వాత చిరాగ్ మనసులోని ప్లాన్ ఏమిటో ప్రత్యర్ధులకు, జనాలకు అర్ధంకాకుండా ఉంటుందా ?

ఇటువంటి అనేక రకాలైన వ్యూహాలతో చివరకు చిరాగే అబాసుపాలయ్యేట్లున్నాడు. తాజాగా జరిపిన సర్వేలో ఓటర్ల అభిప్రాయం ప్రకారం ఎల్జేపీకి 2-6 సీట్ల మధ్య వస్తే ఎక్కువన్నట్లుగా తేలింది. ఇదే నిజమైతే చిరాగ్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావటంతో పాటు తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్న విషయం స్పష్టమైపోతుంది. పర్వాలేదు ఎన్నికల తర్వాతయినా క్షేత్రస్ధాయిలోని వాస్తవాలను జాగ్రత్తగా గమనించి నిజాయితీగా విశ్లేషించుకుంటే భవిష్యత్తులో మంచి నేతగా ఎదిగే అవకాశాలు చిరాగ్ కు బాగానే ఉన్నాయి.

This post was last modified on October 23, 2020 11:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago