వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాకు పొలిటికల్ కష్టాలు తీరడం లేదు. ఒకటి వదిలే ఒకటి ఆమెను పట్టిపీడిస్తున్నాయని అంటున్నారు ఆమె సానుభూతి పరులు. నిన్న మొన్నటి వరకు నియోజకవర్గంలో సొంత పార్టీలో నే ఎగస్పార్టీతో ఎదురీత ఈదారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఓ రేంజ్లో దూకుడుగా ముందుకు సాగిన రోజా.. అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్కు కూడా గురయ్యారు. జగన్ కు మద్దతుగా అసెంబ్లీలో భారీ ఎత్తున గళం వినిపించారు. ఇంత చేస్తే.. గత ఎన్నికల అనంతరం .. పార్టీ అధికారంలోకి వచ్చినా.. వస్తుందని అనుకున్న మంత్రి పదవి జారిపోయింది.
ఇది తొలి దెబ్బ అని అప్పట్లో రోజాపై ప్రచారం సాగింది. తన సామాజిక వర్గానికి చెందిన జిల్లా నాయకుడు తనకు అడ్డంకిగా మారారని .. ఓసందర్భంలో మనసులో మాటను దాచుకోలేక వెల్లడించేశారు. ఆ తర్వాత చాన్నాళ్లకు ఏపీఐఐసీ చైర్మన్ గిరీ తెచ్చుకున్నా.. ఈ సంతోషం కూడా మూడు పూటలు నిలవలేదు. తన నియోజకవర్గంలో తనను ఎదిరించే వారు లేరనుకున్న తరుణంలో తనకు ఎగస్పార్టీ మొదలైంది. కేజే కుమార్ దంపతులు రోజాపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వీరి వెనుక కూడా సదరు నాయకుడే ఉన్నాడనేది రోజా ఆరోపణ. అయినప్పటికీ.. బయటకు చెప్పలేని పరిస్థితి.
ఎలాగోలా తట్టుకుని వస్తున్నారు. అయితే, ఇప్పుడు మరో ఎదురు దెబ్బ బాగా గట్టిగానే తగిలిందని అంటున్నారు రోజా అనుచరులు. ఇప్పటి వరకు తన నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయాలన్నా.. తనే స్వయంగా చేయించుకునేవారు. లేదా ప్రభుత్వానికి నేరుగా విన్నవించేవారు. కానీ, ఇప్పుడు నగరి నియోజకవర్గాన్ని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ(తుడా)లోకి విలీనం చేశారు. దీంతో నగరి నియోజకవర్గంపై తుడా ఆధిపత్యం పెరుగుతుంది. పోనీ.. తుడాలో ఎవరున్నారు? అని ఆరాతీస్తే.. ఇప్పటి వరకు తనకు ఎదురు దెబ్బలు తగలడానికి కారణమైన సదరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడే ఉండడంతో రోజాకు దిమ్మతిరిగి పోయిందని అంటున్నారు.
ఇక, ఇప్పుడు తన నియోజకవర్గంలో ఏం చేయాలన్నా.. తుడా నిర్ణయమే కీలకం. అంటే.. పరోక్షంగా తాను డమ్మీ అయినట్టేనని ఆమె నిర్ణయానికి వచ్చేశారు. ఏ చిన్న పనికావాలన్నా.. తుడాను కోరాల్సిందే. పోనీ వద్దులే.. తుడా లేదు.. అందామా? జనాగ్రహం తప్పదు. నగరిని తుడా చేర్చడంపై ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోజాకు పొలిటికల్ కష్టాలు మరింతగా పెరిగాయనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం. మరి ఎలా దూసుకుపోతారో చూడాలి.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…