Political News

వారు మాత్రమే మహిళలా?.. ట్రోల్స్ పై వంశీ సతీమణి ఫైర్!

సోషల్ మీడియా వేదికగా తనపైనా, తన కుటుంబంపైనా ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోందని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిని అపహరించి బెదిరించారంటూ వంశీని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… జైలులో వంశీతో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు సమీపంలోనే ఆయన మీడియాతో మాట్లాడగా… ఆయన పక్కనే పంకజ శ్రీ కనిపించారు. జగన్ వెళ్లిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడిన పంకజ శ్రీ… సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఓ రేంజిలో ఫైరయ్యారు.

తానెప్పుడూ బయటకు రాలేదన్న పంకజ శ్రీ.. తన భర్త వంశీ అరెస్టు కావడంతో తాను బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. తన భర్త కోసం తాను బయటకు వచ్చినంతనే తనపై అసభ్యంగా ట్రోలింగ్ మొదలుపెట్టారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ప్రత్యేకించి మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్ పై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది కదా అని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వమే అంత కఠినంగా ఉంటే… తనపైనా, తన కుటుంబంపైనా అసభ్యంగా ఎలా పోస్టులు పెడతారని ఆమె నిలదీశారు. ఆ వెంటనే ఆమె ఓ సంచలన వ్యాఖ్య చేశారు. ఆ పార్టీకి చెందిన వారు మాత్రమే మహిళలా? అంటూ టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇతర మహిళలు మహిళలు కారా? అని కూడా ఆమె ప్రశ్నించారు.

సోషల్ మీడియా ట్రోలింగ్ తక్షణమే ఆగాలని పంకజ శ్రీ హెచ్చరికలు జారీ చేశారు. లేదంటే లీగల్ గా తాను చర్యలు చేపట్టాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ఈ దిశగా తాను అందరు ట్రోలర్ల పైనా ప్రైవేట్ కేసులు వేస్తానని కూడా ఆమె అన్నారు. ట్రోలర్లకు తమపైన ఏదైనా ఉంటే చట్టబద్ధంగా వెళ్లాలని ఆమె సూచించారు. ఏం చేసినా లీగల్ గా చేసింతవరకు అయితే ఒకే అన్న పంకజ శ్రీ… ఆ పరిధి దాటితే తాను కూడా కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపారు. మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టవద్దని ఆమె కోరారు. ఈ సందర్భంగా పంకజ శ్రీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే… వైసీపీ జమానాలో అసెంబ్లీలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వంశీ చేసిన దారుణమైన వ్యాఖ్యలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తాను ఓ మహిళనని బాధ పడుతున్న పంకజశ్రీ… నాడు భువనేశ్వరిపై తన భర్త చేసిన వ్యాఖ్యలను కూడా నాడు ఖండించి ఉంటే బాగుండేది కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పంకజ శ్రీ చేసిన వ్యాఖ్యలు ఆమెపైకే బ్యాక్ ఫైర్ అయ్యాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on February 18, 2025 6:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

36 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago