Political News

వారు మాత్రమే మహిళలా?.. ట్రోల్స్ పై వంశీ సతీమణి ఫైర్!

సోషల్ మీడియా వేదికగా తనపైనా, తన కుటుంబంపైనా ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోందని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడిని అపహరించి బెదిరించారంటూ వంశీని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… జైలులో వంశీతో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు సమీపంలోనే ఆయన మీడియాతో మాట్లాడగా… ఆయన పక్కనే పంకజ శ్రీ కనిపించారు. జగన్ వెళ్లిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడిన పంకజ శ్రీ… సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఓ రేంజిలో ఫైరయ్యారు.

తానెప్పుడూ బయటకు రాలేదన్న పంకజ శ్రీ.. తన భర్త వంశీ అరెస్టు కావడంతో తాను బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. తన భర్త కోసం తాను బయటకు వచ్చినంతనే తనపై అసభ్యంగా ట్రోలింగ్ మొదలుపెట్టారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ప్రత్యేకించి మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్ పై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది కదా అని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వమే అంత కఠినంగా ఉంటే… తనపైనా, తన కుటుంబంపైనా అసభ్యంగా ఎలా పోస్టులు పెడతారని ఆమె నిలదీశారు. ఆ వెంటనే ఆమె ఓ సంచలన వ్యాఖ్య చేశారు. ఆ పార్టీకి చెందిన వారు మాత్రమే మహిళలా? అంటూ టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇతర మహిళలు మహిళలు కారా? అని కూడా ఆమె ప్రశ్నించారు.

సోషల్ మీడియా ట్రోలింగ్ తక్షణమే ఆగాలని పంకజ శ్రీ హెచ్చరికలు జారీ చేశారు. లేదంటే లీగల్ గా తాను చర్యలు చేపట్టాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ఈ దిశగా తాను అందరు ట్రోలర్ల పైనా ప్రైవేట్ కేసులు వేస్తానని కూడా ఆమె అన్నారు. ట్రోలర్లకు తమపైన ఏదైనా ఉంటే చట్టబద్ధంగా వెళ్లాలని ఆమె సూచించారు. ఏం చేసినా లీగల్ గా చేసింతవరకు అయితే ఒకే అన్న పంకజ శ్రీ… ఆ పరిధి దాటితే తాను కూడా కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపారు. మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టవద్దని ఆమె కోరారు. ఈ సందర్భంగా పంకజ శ్రీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే… వైసీపీ జమానాలో అసెంబ్లీలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వంశీ చేసిన దారుణమైన వ్యాఖ్యలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తాను ఓ మహిళనని బాధ పడుతున్న పంకజశ్రీ… నాడు భువనేశ్వరిపై తన భర్త చేసిన వ్యాఖ్యలను కూడా నాడు ఖండించి ఉంటే బాగుండేది కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పంకజ శ్రీ చేసిన వ్యాఖ్యలు ఆమెపైకే బ్యాక్ ఫైర్ అయ్యాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on February 18, 2025 6:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

క్రియేటివిటీ ప్రోమోల‌కే ప‌రిమిత‌మా?

గ‌త శుక్ర‌వారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది క‌మెడియ‌న్ స‌త్య హీరోగా ప‌రిచయం అయిన సినిమా. అయినా స‌రే..…

59 minutes ago

తెలుగోళ్లు లేపుతుంటే… తమిళోళ్లు ముంచేస్తున్నారు

ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…

4 hours ago

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

5 hours ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

8 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

9 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

13 hours ago