ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ గా నియమితులు అయిన మాజీ మంత్రి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మె ల్యే కురసాల కన్నబాబుకు.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంత ఈజీకాదన్న వాదన పార్టీలో నే వినిపిస్తుండడం గమనార్హం.
ఉత్తరాంధ్రలో ఉన్నవి మూడు జిల్లాలే అయినా.. ముప్పై రకాల రాజకీయాలు ఇక్కడ సాగుతుంటాయి. నాకు నేనే రాజు-నేనే మంత్రి అన్నట్టుగా వైసీపీనాయకులు ఇక్కడ వ్యవహరిస్తుంటారనేది గతంలో ఇక్కడ ఇంచార్జ్గా పనిచేసిన సాయిరెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు.
“రాష్ట్రం మొత్తం రాజకీయాలు వేరు. ఉత్తరాంధ్ర రాజకీయాలు వేరు. ఇక్కడి మనుషులు, నాయకులను నెగ్గుకు రావడం అంటే మాటలు కాదు. అయినా.. నా శాయ శక్తులా పనిచేశాను.“ అని విశాఖ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో విజయం దక్కించుకున్న సందర్భంగా సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి.
నిజంగానే ఉత్తరాంధ్ర రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయన్నది వాస్తవం. కోస్తా, సీమల మాదిరిగా.. కాకుండా.. ఉత్తరాంధ్రలో నాయకులు భిన్నమైన శైలిని అనుసరిస్తారు.
పార్టీలు మారే వారు తక్కువగా ఉంటారు. ఉన్న పార్టీల్లోనే తమ పేరు వినిపించాలని కోరుకునే వారు ఎక్కు వగా ఉంటారు. ఇక, వ్యాపారాలు, వ్యవహారాల్లో కామన్గానే వారి పాత్ర కీలకం. దీంతో సఖ్యత కన్నా.. సొంత ప్రయోజనాలకే ఎక్కువగా మొగ్గు చూపుతారు.
అంతేకాదు.. కుటుంబ రాజకీయాలు కూడా.. ఉత్తరాంధ్రలో ఎక్కువగానే కనిపిస్తాయి. ఇక, సీనియర్ ఏదో చెప్పారని.. తమ పంథామార్చుకునే జూనియర్ నాయకులు కూడా తక్కువే. మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇక్కడివారు పట్టించుకుంటారా? అనేది సందేహం.
వైవీ సుబ్బారెడ్డి వంటివారికే .. ఇక్కడి నాయకుల నుంచి తీవ్ర ఎదురుగాలి వీచింది. పైగా.. లబ్ధ ప్రతిష్ఠులైన రాజకీయ నాయకులు ఉన్న ఉత్తరాంధ్రలో కురసాల కన్నబాబు వంటి వ్యక్తి నెట్టుకురావడం.. వారిని తనవైపు తిప్పుకోవడం అంటే.. అంత ఈజీకాదు. అయినప్పటికీ.. జగన్ అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయనను కాదనలేరు.
అయితే.. ఇక్కడ ఓ విషయంలో వైసీపీ సేఫ్ అవుతుంది. కన్నబాబు దూకుడు స్వభావం ఉన్న నాయకుడు కాకపోవడంతో అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంటుంది. ఇంతకుమించి ఆయన పార్టీలో మెరుపులు మెరిపిస్తారన్నది ప్రశ్నే!
This post was last modified on February 16, 2025 11:35 pm
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…