ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ గా నియమితులు అయిన మాజీ మంత్రి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మె ల్యే కురసాల కన్నబాబుకు.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంత ఈజీకాదన్న వాదన పార్టీలో నే వినిపిస్తుండడం గమనార్హం.
ఉత్తరాంధ్రలో ఉన్నవి మూడు జిల్లాలే అయినా.. ముప్పై రకాల రాజకీయాలు ఇక్కడ సాగుతుంటాయి. నాకు నేనే రాజు-నేనే మంత్రి అన్నట్టుగా వైసీపీనాయకులు ఇక్కడ వ్యవహరిస్తుంటారనేది గతంలో ఇక్కడ ఇంచార్జ్గా పనిచేసిన సాయిరెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు.
“రాష్ట్రం మొత్తం రాజకీయాలు వేరు. ఉత్తరాంధ్ర రాజకీయాలు వేరు. ఇక్కడి మనుషులు, నాయకులను నెగ్గుకు రావడం అంటే మాటలు కాదు. అయినా.. నా శాయ శక్తులా పనిచేశాను.“ అని విశాఖ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో విజయం దక్కించుకున్న సందర్భంగా సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి.
నిజంగానే ఉత్తరాంధ్ర రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయన్నది వాస్తవం. కోస్తా, సీమల మాదిరిగా.. కాకుండా.. ఉత్తరాంధ్రలో నాయకులు భిన్నమైన శైలిని అనుసరిస్తారు.
పార్టీలు మారే వారు తక్కువగా ఉంటారు. ఉన్న పార్టీల్లోనే తమ పేరు వినిపించాలని కోరుకునే వారు ఎక్కు వగా ఉంటారు. ఇక, వ్యాపారాలు, వ్యవహారాల్లో కామన్గానే వారి పాత్ర కీలకం. దీంతో సఖ్యత కన్నా.. సొంత ప్రయోజనాలకే ఎక్కువగా మొగ్గు చూపుతారు.
అంతేకాదు.. కుటుంబ రాజకీయాలు కూడా.. ఉత్తరాంధ్రలో ఎక్కువగానే కనిపిస్తాయి. ఇక, సీనియర్ ఏదో చెప్పారని.. తమ పంథామార్చుకునే జూనియర్ నాయకులు కూడా తక్కువే. మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇక్కడివారు పట్టించుకుంటారా? అనేది సందేహం.
వైవీ సుబ్బారెడ్డి వంటివారికే .. ఇక్కడి నాయకుల నుంచి తీవ్ర ఎదురుగాలి వీచింది. పైగా.. లబ్ధ ప్రతిష్ఠులైన రాజకీయ నాయకులు ఉన్న ఉత్తరాంధ్రలో కురసాల కన్నబాబు వంటి వ్యక్తి నెట్టుకురావడం.. వారిని తనవైపు తిప్పుకోవడం అంటే.. అంత ఈజీకాదు. అయినప్పటికీ.. జగన్ అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయనను కాదనలేరు.
అయితే.. ఇక్కడ ఓ విషయంలో వైసీపీ సేఫ్ అవుతుంది. కన్నబాబు దూకుడు స్వభావం ఉన్న నాయకుడు కాకపోవడంతో అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంటుంది. ఇంతకుమించి ఆయన పార్టీలో మెరుపులు మెరిపిస్తారన్నది ప్రశ్నే!
This post was last modified on February 16, 2025 11:35 pm
తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన గులాబీ గూటిలో ఇప్పుడు ఆసక్తికరమైన ఆధిపత్య పోరు మొదలైంది. కేసీఆర్ రాజకీయ…
పరిధి.. పరిమితులు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోవటం కొంతమంది వైసీపీ నేతలకు అలవాటే. దూకుడే తమ ఆయుధం అన్నట్లుగా వ్యవహరించే తీరు…
వైసీపీ అధినేత జగన్ చేయలేనిది ఇప్పుడు అనేక విషయాల్లో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసి గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దాదాపు 21…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా.. ఇచ్చిన మాట.. ఆరు మాసాలు కూడా తిరక్కుండానే వాస్తవంకానుంది.…
తన రాజకీయ ప్రత్యర్థి వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పార్లమెంట్లో…