Political News

ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్స్‌… టీడీపీ గెలుపు ఈజీయేనా?

ఏపీలో మూడు శాస‌న మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇవి ఉపాధ్యాయ‌, ప‌ట్ట‌భ‌ద్ర స్థానాలు కావ‌డంతో రాజ‌కీయ పార్టీల‌కు నేరుగా ప్ర‌మేయం లేదు. అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయ నేత‌లే ఈ ఎన్నిక‌ల్లో త‌ల ప‌డుతున్నారు. ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మిన‌హా..మిగిలిన రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా.. ప‌ట్ట‌భ‌ద్రుల‌కు సంబంధించిన‌వి. ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్ర స్థానం, ఉమ్మ‌డి గుంటూరు, కృష్ణాజిల్లాల‌కు చెందింది మ‌రోస్థానం.

ఈ రెండు కూడా.. టీడీపీ నాయ‌కులే పోటీ చేస్తున్నారు. ఉమ్మ‌డి గుంటూరు-కృష్ణాలో మాజీ మంత్రి ఆల‌పా టి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌రం బ‌రిలో నిలిచారు. ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల త‌ర‌ఫున‌.. వీరే క‌నిపిస్తున్నారు. మిగిలిన వారిలో చాలా మంది స్వ‌తంత్రులు. ఒక‌రిద్దురు మాత్రం చిన్నా చిత‌కా పార్టీల మ‌ద్ద‌తుతో బ‌రిలో ఉన్నారు. ఇక‌, ప్ర‌తిప‌క్షం వైసీపీ మాత్రం ఈ ఎన్నిక‌ల‌కు క‌డు దూరంలో నిలిచింది. అంటే.. ఒక ర‌కంగా ప్ర‌స్తుతం ఉన్న వారి మ‌ధ్య పోటీ ఉండే అవ‌కాశం లేదు.

దీంతో టీడీపీ అభ్య‌ర్థులు.. ఆల‌పాటి, పేరాబ‌త్తుల విజ‌యంపై త‌మ్ముళ్లు ముందుగానే ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, నామినేష‌న్ల ప్ర‌క్రియ గురువారంతో ముగిసింది. దీంతో ప్ర‌చారంపై నాయ‌కులు దృష్టి పెట్టారు. ఇత‌ర ఎన్నిక‌ల మాదిరిగా కాకుండా.. కేవ‌లం ప‌ట్టభ‌ద్రులు మాత్ర‌మే ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. వీరిని ఆక‌ర్షించేందుకు.. ఆక‌ట్టుకునేందుకు నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డిగా కూట‌మి నాయ‌కులు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

మ‌రోవైపు.. సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై త‌న‌దైన అంచ‌నాల‌ను వేసుకున్నారు. నాయ‌కులు అంద‌రూ.. క‌ద‌లి రావాల‌ని, క‌ల‌సి రావాలని కూడా సూచిస్తున్నా.. పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకో వ‌డం లేదు. దీంతో టీడీపీ అభ్య‌ర్థుల గెలుపుపై అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పైగా ప్ర‌జ‌ల్లో ప‌థ‌కాల అమ‌లుపై ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. దీంతో ఈ ప్ర‌భావం త‌గ్గించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుని.. మ‌రోవైపు ఎన్నిక‌ల్లోనూ దూకుడు పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on February 15, 2025 6:31 am

Share

Recent Posts

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

37 minutes ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

2 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

2 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

3 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

7 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

14 hours ago