ఏపీలో మూడు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవి ఉపాధ్యాయ, పట్టభద్ర స్థానాలు కావడంతో రాజకీయ పార్టీలకు నేరుగా ప్రమేయం లేదు. అయినప్పటికీ.. రాజకీయ నేతలే ఈ ఎన్నికల్లో తల పడుతున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మినహా..మిగిలిన రెండు నియోజకవర్గాలు కూడా.. పట్టభద్రులకు సంబంధించినవి. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్ర స్థానం, ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాలకు చెందింది మరోస్థానం.
ఈ రెండు కూడా.. టీడీపీ నాయకులే పోటీ చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు-కృష్ణాలో మాజీ మంత్రి ఆలపా టి రాజేంద్రప్రసాద్, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పేరాబత్తుల రాజశేఖరం బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున.. వీరే కనిపిస్తున్నారు. మిగిలిన వారిలో చాలా మంది స్వతంత్రులు. ఒకరిద్దురు మాత్రం చిన్నా చితకా పార్టీల మద్దతుతో బరిలో ఉన్నారు. ఇక, ప్రతిపక్షం వైసీపీ మాత్రం ఈ ఎన్నికలకు కడు దూరంలో నిలిచింది. అంటే.. ఒక రకంగా ప్రస్తుతం ఉన్న వారి మధ్య పోటీ ఉండే అవకాశం లేదు.
దీంతో టీడీపీ అభ్యర్థులు.. ఆలపాటి, పేరాబత్తుల విజయంపై తమ్ముళ్లు ముందుగానే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. దీంతో ప్రచారంపై నాయకులు దృష్టి పెట్టారు. ఇతర ఎన్నికల మాదిరిగా కాకుండా.. కేవలం పట్టభద్రులు మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. వీరిని ఆకర్షించేందుకు.. ఆకట్టుకునేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో ఉమ్మడిగా కూటమి నాయకులు ఎక్కడా కనిపించడం లేదు.
మరోవైపు.. సీఎం చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలపై తనదైన అంచనాలను వేసుకున్నారు. నాయకులు అందరూ.. కదలి రావాలని, కలసి రావాలని కూడా సూచిస్తున్నా.. పెద్దగా ఎవరూ పట్టించుకో వడం లేదు. దీంతో టీడీపీ అభ్యర్థుల గెలుపుపై అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ.. టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పైగా ప్రజల్లో పథకాల అమలుపై ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఈ ప్రభావం తగ్గించే దిశగా చర్యలు తీసుకుని.. మరోవైపు ఎన్నికల్లోనూ దూకుడు పెంచాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on February 15, 2025 6:31 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…