Political News

అన్నీ ఓకే.. మరి సమన్వయం మాటేమిటి?

అసలే అక్కడ విపక్ష పార్టీకి చెందిన బడా నేతలు సందు దొరికితే చాలు.. దూరేద్దామని చూస్తున్నారు. అలాంటి చోట అధికార పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోతే ఎలా? పార్టీ క్రమంగా బలహీనపడుతుంది కదా. ఆ మాత్రం తెలియకుండా ఎవరికీ వారే అన్న రీతిన నేతలు వ్యవహరిస్తే ఎలా? ఇకపై అలాంటి పరిస్థితిని ఉపేక్షిందేది లేదు అంటూ టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీకి చెందిన కీలక నేతలను ఎమ్మెల్యే కలుపుకుని వెళ్లక తప్పదు. అదే సమయంలో పార్టీ నేతలు కూడా ఎమ్మెల్యేతో కలిసి నడవక తప్పదు.

ఇదే మాటను కాస్తంత గట్టిగా చెప్పేందుకు ఎమ్మెల్యేతో పాటు పార్టీకి చెందిన కీలక నేతకు అధిష్ఠానము నుంచి పిలుపు వచ్చింది. వారిద్దరూ బుధవారం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళుతున్నారు. అక్కడ వారిద్దరితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ కానున్నారు. ఈ భేటీలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషతో పాటుగా పార్టీ యువజన విభాగం తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఒకే తాటిపై నడుస్తామంటూ ఒప్పుకుని తీరక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మదనపల్లెలో అధివృద్దితో పాటుగా సంక్షేమ పథకాల అమలు కూడా పక్కాగానే సాగుతున్నాయి. అయితే అక్కడ పార్టీ నేతల మధ్య సమన్వయమే కొరవడింది. ఇదే ఇప్పుడు సమస్యగా పరిణమించింది.

అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గానికి చెందిన ఈ సమస్యపై అధిష్టానం ఒకింత సీరియస్ గానే ద్రుష్టి సారించింది. చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న షాజహాన్ బాషా ఎన్నికల్లో విజయం సాధించాక పార్టీ నేతలతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో తెలుగు యువత అధ్యక్షుడు చినబాబు కూడా ఆయనతో డీ అంటే డీ అంటున్నారు. ఫలితంగా.. మదనపల్లెలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. రెండు రోజుల క్రితం చినబాబుపై దాడికి ఎమ్మెల్యే వర్గం యత్నించిందన్న వార్తలతో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిద్దరిని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిచింది. ఈ భేటీలో వారిద్దరూ కలిసి పని చేస్తామని ఒప్పుకుని తీరాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

This post was last modified on February 12, 2025 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభివృద్ధికి ఆటంకాలు ఎందుకు జగన్?

ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…

1 minute ago

పాకిస్థాన్‌లో నో రిలీజ్… అయినా అక్క‌డ‌ బ్లాక్‌బ‌స్ట‌ర్

కొన్నేళ్ల నుంచి భార‌త్‌, పాకిస్థాన్ సంబంధాలు అంతంత‌మాత్రంగా ఉండ‌గా.. ఈ ఏడాది ఆరంభంలో ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత అవి పూర్తిగా…

4 hours ago

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

6 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

7 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

8 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

8 hours ago