క్షేత్రస్ధాయిలో పరిస్దితులను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈనెల 28వ తేదీ నుండి వచ్చేనెల 10వ తేదీలోగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అనేక కూటములు, పార్టీలు పోటి పడుతున్నాయి. 243 అసెంబ్లీ సీట్లలో విజయం కోసం ఎన్ని కూటములు, పార్టీలు పోటి పడుతున్నా ప్రధానంగా అధికారంలో ఉన్న ఎన్డీఏ, ప్రధాన ప్రతిపక్షమైన యూపీఏ కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అందరు అంచనాలు వేస్తున్నారు.
ఈ నేపధ్యంలో లోక్ నీతి-సిఎస్ డిఎస్ మీడియా, సర్వే సంస్ధలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేఫలితాలు కాస్త ఆసక్తిగా మారింది. పై సంస్ధలు నిర్వహించిన సర్వేని ఈనెల 10-17 తేదీల మధ్య జరిగింది. బీహార్లో ఎవరైనా అధికారంలోకి రావాలంటే కనీసం 122 సీట్లు రావాలన్న విషయం అందరికీ తెలిసిందే. పై సంస్దలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో ఎన్డీఏ కూటమి వైపే ఓటర్ల మొగ్గున్నట్లు అర్ధమవుతోంది. ఎన్డీఏ కూటమికి 133-143 సీట్ల మధ్య వస్తుందని అంచనా. అలాగే యూపీఏ కూటమికి 88-98 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎల్జేపీకి 2-6 సీట్లు, ఇతరులు 6-10 సీట్లు గెలుచుకుంటారని సర్వేలో అర్ధమవుతోంది.
సర్వేలో ద్వారా బయటపడిన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పరిపాలనపై 62 శాతం మంది సంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం పట్ల 61 శాతంమంది సానుకూలంగా ఉన్నట్లు స్పష్టమైంది. అంటే ఇది ప్రీ పోల్ సర్వేనే అయినా కచ్చితత్వాన్ని మాత్రం చెప్పేందుకు లేదు. ఎందుకంటే గతంలో చాలాసార్లు సర్వే అంచనాలు తప్పయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
కాకపోతే బీహార్లో సానుకూలమైన అంశం ఏమిటంటే నితీష్ కుమార్ పై అవినీతి ఆరోపణలు ఎక్కడా లేకపోవటమే. ఆర్జేడీ పరిపాలన అంటేనే అటవిక పాలన అన్న విషయం జనాల్లో ముద్రపడిపోయింది. ఆ ముద్ర నుండి నితీష్ రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పరుగులు పెట్టిస్తున్నారు. ఈ కారణంగానే పదేళ్ళుగా అధికారంలో ఉన్న నితీష్ కు అవినీతి మరకలు అంటలేదు. ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే హ్యాట్సాఫ్ టు నితీష్ అనే చెప్పాలి. మరి ఓటర్ తీర్పు ఎలాగుంటుందో చూడాల్సిందే.
This post was last modified on October 21, 2020 10:44 am
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…