Political News

జగన్ కు పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటో తెలుసా ?

జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ప్లాస్ పాయింట్ ఏమిటో తెలుసా ? ఈ ప్రశ్నకు ఒక్కొక్కళ్ళు ఒక్కోరకంగా సమాధానం చెబుతారేమో. మామూలుగా అయితే అసెంబ్లీలో 151 సీట్లుండటం, 22 ఎంపి సీట్లు గెలుకోవటం అని చెబుతారు. ఇదే సమయంలో కేంద్రంతో మంచి సంబంధాలు ఉండటమే అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. పార్టీపై తిరుగులేని ఆధిపత్యం ఉండటమే అసలైన బలమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కరెక్టే కానీ అసలైన బలం ఏమిటంటే మీడియాకు చా…లా దూరంగా ఉండటమే.

అవును మీరు చదివింది కరెక్టే. మీడియా అన్నది భస్మాసుర హస్తం లాంటిది. ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంత నష్టం చేస్తుంది. మీడియాతో రాసుకుపూసుకుని తిరిగిన వాళ్ళలో చాలామంది చివరకు నష్టపోయిన వాళ్ళే ఉన్నారు. ఇదే సమయంలో మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత లాభపడిన వాళ్ళు కూడా ఉన్నారు. 24 గంటలూ మీడియాతో అంటకాగిన వాళ్ళల్లో నష్టపోయిన వాళ్ళకు తాజా ఉదాహరణ వైసీపీ తిరుగుబాటు ఎంపినే. కారణాలు ఏవైనా పార్టీకి దూరంగా జరిగిన దగ్గర నుండి ఎంపి అదేపనిగా జగన్ పై నోరుపారేసుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే. సరే ఇదే పద్దతిలో చంద్రబాబునాయుడు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజూ జగన్ ను టార్గెట్ చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబు స్ధాయి వ్యక్తి ఆరోపణలు చేస్తే జనాలంతా ఆసక్తిగా దాన్ని చదవాలి. కానీ చాలామంది జనాలు పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే జగన్ పై చంద్రబాబు ఆరోపణలు, విమర్శలు చేయని రోజంటు ఉండదు. ప్రతిరోజు ఆరోపణలు చేస్తుంటే చదవాలనే ఆసక్తి జనాలకు ఎందుకుంటుంది ? తెలిసో తెలీకో లోకేష్ కూడా తండ్రినే ఫాలో అవుతున్నారు. ప్రతిరోజు అయినదానికి కానిదానికి జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయటానికి ట్విట్టర్ వేదికగా ఉపయోగించుకుంటున్నారు. నాన్నా పులి కథలాగా… ప్రతిరోజు చెబితే… ఇంపార్టెంట్ విషయాలు జనాలకు చేరకుండా పోయే ప్రమాదం ఉంది.

ఇక జగన్ విషయానికి వస్తే స్వతహాగానే మీడియా ఫ్రెండ్లీకాదు. కాబట్టి మీడియా సమావేశాల్లో పాల్గొనాలని జగన్ కు కోరికలేదు. దాదాపు ఏడాదిన్నర క్రితం సిఎంగా బాధ్యతలు తీసుకున్న జగన్ ఇప్పటికి పెట్టిన మీడియా సమావేశాలు మూడంటే మూడు మాత్రమే. ఇదే సమయంలో చంద్రబాబు వారానికి దాదాపు నాలుగు రోజులు మీడియా సమావేశాలు పెట్టి జగన్ పై విరుచుకుపడుతున్నారు. మీడియాలో కనబడాలన్న యావ లేకపోవటమే జగన్ కున్న అతిపెద్ద బలమని వైసీపీ నేతలే చెబుతున్నారు. మీడియా ద్వారా కాకుండా తన పరిపాలన ద్వారా మాత్రమే దగ్గరవ్వాలన్న జగన్ లక్ష్యంలో సక్సెస్ అయ్యారా లేదా అన్నది ఏదన్నా సందర్భం వస్తేనే తెలుస్తుంది.

This post was last modified on October 21, 2020 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ జోగి రమేశ్ వంతు వచ్చేసింది!

వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…

3 hours ago

బావగారు వివాదం….సుడిగాలి సుధీర్ మెడకు

యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…

3 hours ago

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…

5 hours ago

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…

5 hours ago

కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికింది

ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…

6 hours ago

తారక్ & రజని రెండుసార్లు తలపడతారా

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…

6 hours ago