జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ప్లాస్ పాయింట్ ఏమిటో తెలుసా ? ఈ ప్రశ్నకు ఒక్కొక్కళ్ళు ఒక్కోరకంగా సమాధానం చెబుతారేమో. మామూలుగా అయితే అసెంబ్లీలో 151 సీట్లుండటం, 22 ఎంపి సీట్లు గెలుకోవటం అని చెబుతారు. ఇదే సమయంలో కేంద్రంతో మంచి సంబంధాలు ఉండటమే అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. పార్టీపై తిరుగులేని ఆధిపత్యం ఉండటమే అసలైన బలమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కరెక్టే కానీ అసలైన బలం ఏమిటంటే మీడియాకు చా…లా దూరంగా ఉండటమే.
అవును మీరు చదివింది కరెక్టే. మీడియా అన్నది భస్మాసుర హస్తం లాంటిది. ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంత నష్టం చేస్తుంది. మీడియాతో రాసుకుపూసుకుని తిరిగిన వాళ్ళలో చాలామంది చివరకు నష్టపోయిన వాళ్ళే ఉన్నారు. ఇదే సమయంలో మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత లాభపడిన వాళ్ళు కూడా ఉన్నారు. 24 గంటలూ మీడియాతో అంటకాగిన వాళ్ళల్లో నష్టపోయిన వాళ్ళకు తాజా ఉదాహరణ వైసీపీ తిరుగుబాటు ఎంపినే. కారణాలు ఏవైనా పార్టీకి దూరంగా జరిగిన దగ్గర నుండి ఎంపి అదేపనిగా జగన్ పై నోరుపారేసుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే. సరే ఇదే పద్దతిలో చంద్రబాబునాయుడు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజూ జగన్ ను టార్గెట్ చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు.
చంద్రబాబు స్ధాయి వ్యక్తి ఆరోపణలు చేస్తే జనాలంతా ఆసక్తిగా దాన్ని చదవాలి. కానీ చాలామంది జనాలు పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే జగన్ పై చంద్రబాబు ఆరోపణలు, విమర్శలు చేయని రోజంటు ఉండదు. ప్రతిరోజు ఆరోపణలు చేస్తుంటే చదవాలనే ఆసక్తి జనాలకు ఎందుకుంటుంది ? తెలిసో తెలీకో లోకేష్ కూడా తండ్రినే ఫాలో అవుతున్నారు. ప్రతిరోజు అయినదానికి కానిదానికి జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయటానికి ట్విట్టర్ వేదికగా ఉపయోగించుకుంటున్నారు. నాన్నా పులి కథలాగా… ప్రతిరోజు చెబితే… ఇంపార్టెంట్ విషయాలు జనాలకు చేరకుండా పోయే ప్రమాదం ఉంది.
ఇక జగన్ విషయానికి వస్తే స్వతహాగానే మీడియా ఫ్రెండ్లీకాదు. కాబట్టి మీడియా సమావేశాల్లో పాల్గొనాలని జగన్ కు కోరికలేదు. దాదాపు ఏడాదిన్నర క్రితం సిఎంగా బాధ్యతలు తీసుకున్న జగన్ ఇప్పటికి పెట్టిన మీడియా సమావేశాలు మూడంటే మూడు మాత్రమే. ఇదే సమయంలో చంద్రబాబు వారానికి దాదాపు నాలుగు రోజులు మీడియా సమావేశాలు పెట్టి జగన్ పై విరుచుకుపడుతున్నారు. మీడియాలో కనబడాలన్న యావ లేకపోవటమే జగన్ కున్న అతిపెద్ద బలమని వైసీపీ నేతలే చెబుతున్నారు. మీడియా ద్వారా కాకుండా తన పరిపాలన ద్వారా మాత్రమే దగ్గరవ్వాలన్న జగన్ లక్ష్యంలో సక్సెస్ అయ్యారా లేదా అన్నది ఏదన్నా సందర్భం వస్తేనే తెలుస్తుంది.
This post was last modified on October 21, 2020 11:11 am
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…