Political News

బీజేపీ నేతపై వీర్రాజు సీరియస్ .. సస్పెన్షన్

బీజేపీ నేత లంకా దినకర్ ను పార్టీలో నుండి సస్పెండ్ చేసింది. బీజేపీలో ఉంటు తెలుగుదేశంపార్టీ అనుకూల వైఖరిని అవలంభిస్తున్న కారణంగానే దినకర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓపోయిన తర్వాత దినకర్ ఆ పార్టీకి రాజీనామా చేసి కమలంపార్టీలో చేరారు. టీడీపీలో దినకర్ అధికారపార్టీ ప్రతినిధిగా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే.

టీడీపీలో నుండి బీజేపీలోకి ముగ్గురు రాజ్యసభ ఎంపిలు సుజనా చౌదరి, సీఎం రమేఫ్, గరికపాటి మోహన్ రావు ఫిరాయించిన విషయం తెలిసిందే. వీరితో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా అప్పుడే కమలంపార్టీలో చేరారు. వీళ్ళు టీడీపీలో నుండి బీజేపీలో చేరినా చంద్రబాబునాయుడు అనుకూల వైఖరే అవలంభిస్తున్నరనే ఆరోపణలు బలంగా వినిపించేవి. ఇదే విషయమై పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అయితే అప్పట్లో రాష్ట్ర అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న కారణంగా ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

అయితే కన్నా స్ధానంలో అధ్యక్షునిగా సోమువీర్రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలో సీన్ మారిపోయింది. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడే నేతలను కట్టడి చేయటంపైనే ప్రధాన దృష్టి పెట్టారు. దాంతో బీజేపీలో ఉంటూ టీడీపీ అనుకూల వైఖరితో మాట్లాడేవారిని కట్టడి చేసినట్లయ్యింది. సుజనా లాంటి వాళ్ళు ఈ కారణంగానే ఎక్కడా నోరిప్పటం లేదు. ఇందులో భాగంగానే లంకా దినకర్ కు కూడా పార్టీ తరపున నోటీసులు జారీ అయ్యాయి. బీజేపీలో ఉంటు టీడీపీ అనుకూల వైఖరితో ఎలా మాట్లాడుతున్నారంటూ సోము మండిపడ్డారు.

అయినా దినకర్ వైఖరిలో మార్పు రాలేదన్న కారణంతో షోకాజ్ నోటీసు కూడా ఇచ్చారు. దానికి దినకర్ సరైన సమాధానం ఇవ్వని కారణంగా తాజాగా పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. కమలంపార్టీలో ఉన్నపుడు తమ పార్టీ వైఖరికి మద్దతుగా మాత్రమే మాట్లాడాలని సోము స్పష్టంగా చెప్పారు. తమ పార్టీలో ఉంటు మరోపార్టీ వైఖరిని అవలంభించటం ఎంతమాత్రం సహించేది లేదని సస్పెన్షన్ ద్వారా వీర్రాజు గట్టి వార్నింగ్ పంపటం గమనార్హం.

This post was last modified on October 20, 2020 4:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

24 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago