Political News

బీజేపీ నేతపై వీర్రాజు సీరియస్ .. సస్పెన్షన్

బీజేపీ నేత లంకా దినకర్ ను పార్టీలో నుండి సస్పెండ్ చేసింది. బీజేపీలో ఉంటు తెలుగుదేశంపార్టీ అనుకూల వైఖరిని అవలంభిస్తున్న కారణంగానే దినకర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓపోయిన తర్వాత దినకర్ ఆ పార్టీకి రాజీనామా చేసి కమలంపార్టీలో చేరారు. టీడీపీలో దినకర్ అధికారపార్టీ ప్రతినిధిగా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే.

టీడీపీలో నుండి బీజేపీలోకి ముగ్గురు రాజ్యసభ ఎంపిలు సుజనా చౌదరి, సీఎం రమేఫ్, గరికపాటి మోహన్ రావు ఫిరాయించిన విషయం తెలిసిందే. వీరితో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా అప్పుడే కమలంపార్టీలో చేరారు. వీళ్ళు టీడీపీలో నుండి బీజేపీలో చేరినా చంద్రబాబునాయుడు అనుకూల వైఖరే అవలంభిస్తున్నరనే ఆరోపణలు బలంగా వినిపించేవి. ఇదే విషయమై పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అయితే అప్పట్లో రాష్ట్ర అధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న కారణంగా ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

అయితే కన్నా స్ధానంలో అధ్యక్షునిగా సోమువీర్రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలో సీన్ మారిపోయింది. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడే నేతలను కట్టడి చేయటంపైనే ప్రధాన దృష్టి పెట్టారు. దాంతో బీజేపీలో ఉంటూ టీడీపీ అనుకూల వైఖరితో మాట్లాడేవారిని కట్టడి చేసినట్లయ్యింది. సుజనా లాంటి వాళ్ళు ఈ కారణంగానే ఎక్కడా నోరిప్పటం లేదు. ఇందులో భాగంగానే లంకా దినకర్ కు కూడా పార్టీ తరపున నోటీసులు జారీ అయ్యాయి. బీజేపీలో ఉంటు టీడీపీ అనుకూల వైఖరితో ఎలా మాట్లాడుతున్నారంటూ సోము మండిపడ్డారు.

అయినా దినకర్ వైఖరిలో మార్పు రాలేదన్న కారణంతో షోకాజ్ నోటీసు కూడా ఇచ్చారు. దానికి దినకర్ సరైన సమాధానం ఇవ్వని కారణంగా తాజాగా పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. కమలంపార్టీలో ఉన్నపుడు తమ పార్టీ వైఖరికి మద్దతుగా మాత్రమే మాట్లాడాలని సోము స్పష్టంగా చెప్పారు. తమ పార్టీలో ఉంటు మరోపార్టీ వైఖరిని అవలంభించటం ఎంతమాత్రం సహించేది లేదని సస్పెన్షన్ ద్వారా వీర్రాజు గట్టి వార్నింగ్ పంపటం గమనార్హం.

This post was last modified on October 20, 2020 4:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

51 minutes ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

3 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

4 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

5 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

6 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

7 hours ago