నందమూరి బాలకృష్ణ పేరు నిన్న సోషల్ మీడియాలో కొన్ని గంటల పాటు మార్మోగిపోయింది. బాలయ్యను దాన కర్ణుడిగా అభివర్ణిస్తూ అభిమానులు రెచ్చిపోయి ట్వీట్లు వేసేశారు. బాలయ్య సేవా భావాన్ని తెగ పొగిడేశారు. హైదరాబాద్ వరద బాధితులకు బాలయ్య కోటిన్నర రూపాయల సాయం అందజేశాడని, వెయ్యి మందికి ఆహారం అందిస్తున్నాడన్న వార్త కొన్ని గంటల్లోనే నెట్టింట తెగ చక్కర్లు కొట్టేసింది. కానీ చివరికి చూస్తే అది ఫేక్ న్యూస్ అని తేలింది.
బాలయ్యకు ఇలాంటి ఉద్దేశం ఉందో ఏమో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే ఆయన విరాళం లాంటిదేమీ ప్రకటించలేదు. కానీ బాలయ్యను గొప్పవాడిగా ప్రొజెక్ట్ చేద్దామని ఆయన అభిమానులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇలాంటి ప్రచారాల వల్ల బాలయ్యకు జరిగిన మేలు కంటే నష్టమే ఎక్కువ అన్నది అభిమానులు గుర్తించలేకపోతున్నారు.
గతంలో కూడా ఒకట్రెండు సందర్భాల్లో బాలయ్య గురించి ఇలాంటి ఫేక్ న్యూస్లు ప్రచారంలోకి వచ్చాయి. వేరే హీరోల విషయంలోనూ ఇలా జరిగింది. విరాళం ఇచ్చారన్న ప్రచారంతో కొన్ని గంటల పాటు హీరోల పేర్లు బాగానే ప్రచారంలో ఉంటాయి. ఆ న్యూస్ అబద్ధం అని తేలాక వాళ్లు అన్పాపులర్ అవుతారు. వాళ్ల గురించి నెగెటివ్ అభిప్రాయం పడుతుంది జనాల్లో. బాలయ్య విషయంలోనూ ఇప్పుడు తలెత్తిన ఇబ్బంది ఇదే.
ఇప్పుడు జరిగిన ప్రచారం వల్ల బాలయ్య విరాళం ప్రకటించాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఆయన ఆ పని చేస్తే మిగతా టాలీవుడ్ హీరోలు కూడా ఆ బాటన పట్టాల్సి ఉంటుంది. ఐతే ఆల్రెడీ కరోనా కోసం పెద్ద ఎత్తునే విరాళాలు అందజేశారు మన ఫిలిం సెలబ్రెటీలు. పైగా గత ఆరేడు నెలల్లో సినిమాలు చేయక వాళ్లు ఆదాయం కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ విరాళాలు అంటే అందరూ ముందుకు రాకపోవచ్చు. అందుకే బాలయ్య విరాళం లాంటిదేమీ ప్రకటించే అవకాశాలు లేనట్లే. అభిమానులు ఇలాంటి ఫేక్ ప్రచారంతో తమ హీరోలకు చేసే మేలు కంటే చెడే ఎక్కువన్నది గుర్తిస్తే మంచిది.
This post was last modified on October 20, 2020 8:24 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…