Political News

బాలయ్యకు వీళ్లు చేస్తోంది మంచా చెడా?

నందమూరి బాలకృష్ణ పేరు నిన్న సోషల్ మీడియాలో కొన్ని గంటల పాటు మార్మోగిపోయింది. బాలయ్యను దాన కర్ణుడిగా అభివర్ణిస్తూ అభిమానులు రెచ్చిపోయి ట్వీట్లు వేసేశారు. బాలయ్య సేవా భావాన్ని తెగ పొగిడేశారు. హైదరాబాద్ వరద బాధితులకు బాలయ్య కోటిన్నర రూపాయల సాయం అందజేశాడని, వెయ్యి మందికి ఆహారం అందిస్తున్నాడన్న వార్త కొన్ని గంటల్లోనే నెట్టింట తెగ చక్కర్లు కొట్టేసింది. కానీ చివరికి చూస్తే అది ఫేక్ న్యూస్ అని తేలింది.

బాలయ్యకు ఇలాంటి ఉద్దేశం ఉందో ఏమో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే ఆయన విరాళం లాంటిదేమీ ప్రకటించలేదు. కానీ బాలయ్యను గొప్పవాడిగా ప్రొజెక్ట్ చేద్దామని ఆయన అభిమానులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇలాంటి ప్రచారాల వల్ల బాలయ్యకు జరిగిన మేలు కంటే నష్టమే ఎక్కువ అన్నది అభిమానులు గుర్తించలేకపోతున్నారు.

గతంలో కూడా ఒకట్రెండు సందర్భాల్లో బాలయ్య గురించి ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ప్రచారంలోకి వచ్చాయి. వేరే హీరోల విషయంలోనూ ఇలా జరిగింది. విరాళం ఇచ్చారన్న ప్రచారంతో కొన్ని గంటల పాటు హీరోల పేర్లు బాగానే ప్రచారంలో ఉంటాయి. ఆ న్యూస్ అబద్ధం అని తేలాక వాళ్లు అన్‌పాపులర్ అవుతారు. వాళ్ల గురించి నెగెటివ్ అభిప్రాయం పడుతుంది జనాల్లో. బాలయ్య విషయంలోనూ ఇప్పుడు తలెత్తిన ఇబ్బంది ఇదే.

ఇప్పుడు జరిగిన ప్రచారం వల్ల బాలయ్య విరాళం ప్రకటించాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఆయన ఆ పని చేస్తే మిగతా టాలీవుడ్ హీరోలు కూడా ఆ బాటన పట్టాల్సి ఉంటుంది. ఐతే ఆల్రెడీ కరోనా కోసం పెద్ద ఎత్తునే విరాళాలు అందజేశారు మన ఫిలిం సెలబ్రెటీలు. పైగా గత ఆరేడు నెలల్లో సినిమాలు చేయక వాళ్లు ఆదాయం కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ విరాళాలు అంటే అందరూ ముందుకు రాకపోవచ్చు. అందుకే బాలయ్య విరాళం లాంటిదేమీ ప్రకటించే అవకాశాలు లేనట్లే. అభిమానులు ఇలాంటి ఫేక్ ప్రచారంతో తమ హీరోలకు చేసే మేలు కంటే చెడే ఎక్కువన్నది గుర్తిస్తే మంచిది.

This post was last modified on October 20, 2020 8:24 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

5 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

6 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

7 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

8 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

8 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

9 hours ago