Political News

చేతులు కాలాక‌.. జ‌గ‌న్ చ‌ర్య‌లు.. చోద్యం కాదా!

చేతులు కాలాక‌.. ఆకులు ప‌ట్టుకున్న చందంగా వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. పార్టీలో ఎవ‌రైనా హ‌ద్దు దాటితే.. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి. లేక‌పోతే.. హెచ్చ‌రించి లైన్లో పెట్టుకోవాలి. కానీ, అంతా అయిపోయిన త‌ర్వాత‌.. చ‌ర్య‌లు తీసుకుంటే ఏంటి ప్ర‌యోజ‌నం అని ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా వైసీపీ నాయ‌కుడు, న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై చ‌ర్య‌ల‌కు జ‌గ‌న్ పూనుకొన్నార‌నేవార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించేందుకురంగం సిద్ధం చేస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు లీకులు ఇచ్చాయి.

ర‌ఘురామ‌రాజును బ‌హిష్క‌రించ‌డంపై పార్టీలో వ్య‌తిరేక‌త లేదు. రెండో మాట కూడాలేదు. అయితే, ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణ‌యం ఇప్పుడు తీసుకుంటున్నార‌నే విష‌యంలోనే పార్టీలో భిన్నాభిప్రా యాలు వ‌స్తున్నాయి. “ఆయ‌న‌పై ఎప్పుడో చ‌ర్య‌లు తీసుకోమ‌ని మేం చెప్పాం. అప్ప‌ట్లోనే వేటు వేసి ఉంటే.. ఆయ‌న పూర్తిగా మైన‌స్ అయ్యేవాడు. మాన‌సికంగా ఆయ‌న డిఫెన్స్‌లో ప‌డేవారు. కానీ, మా వాళ్లు విన‌లేదు.దీంతో ఎంపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. రాజ‌కీయాల్లో ఇలాంటి నాయ‌కుడు అవ‌స‌రం అని అని అనిపించేలా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. పైగా రాజ‌ధాని విష‌యంలో ఆయ‌న తీసుకున్న లైన్ కూడా అంద‌రికీ న‌చ్చింది. ఇప్పుడు ఆయ‌న‌పై వేటు వేస్తే.. ప‌నిగ‌ట్టుకుని సింప‌తీని ఆయ‌న‌కు ఇచ్చిన‌ట్టే” అని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు.

ఇక‌, ఇదే అభిప్రాయాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు చెందిన వైసీపీ నాయ‌కులు వ్య‌క్త ప‌రుస్తున్నారు. “ర‌ఘురామ రాజుతో మ‌న‌కు ప్ర‌యోజ‌నం లేద‌ని తెలిసిన‌ప్పుడు వెంట‌నే వేటు వేసి ఉంటే.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ, ఆయ‌నపై అప్ప‌ట్లో నేరుగా వేటు వేయ‌లేదు. దీంతో ఆయ‌న వైసీపీ నాయ‌కుడిగానే ప్ర‌జ‌లు భావించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కూడా అంతే రేంజ్‌లో పాపుల‌ర్ అయ్యాయి. ఇప్పుడు వేటు వేసినా.. ఆయ‌న‌కేం నష్టం లేదు.

ప్ర‌భుత్వ లొసుగులు బ‌య‌ట పెడుతున్నందుకు.. న‌న్ను బ‌హిష్క‌రించారంటూ.. ఆయ‌న మ‌రో వాద‌న తీసుకువ‌చ్చి.. మ‌రింత రెచ్చిపోతారు. బ‌హిష్క‌రించ‌డం కాకుండా ఇంకేదైనా మార్గం ఉందేమో.. ఆలోచించుకోవాలి” అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి జ‌గ‌న్ తీసుకుంటార‌ని భావిస్తున్న నిర్న‌యంపై చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 18, 2020 11:16 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

46 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago