Political News

జ‌న‌సేన‌లోకి ఆమంచి.. చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మేనా..!

ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌. చీరాల మాజీ ఎమ్మెల్యే.. ప్ర‌స్తుతం ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ, ఆయన ప‌రిస్థితి డోలాయ‌మానంలో ఉంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ టికెట్‌పై చీరాల నుంచి బ‌రిలో నిలిచారు. వ్య‌క్తిగ‌త హ‌వాతో నెగ్గుకు రావాల‌ని భావించారు. నిజానికి 2014లో ఇలానే జరిగింది. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను ఆయ‌న ఎన్నిక‌ల్లో ఓట్లు రాబ‌ట్టుకునేందుకు వినియోగించుకున్నారు. విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత‌.. టీడీపీ అధికారంలోకి రావ‌డంతో ఆ గూటికి చేరారు.

ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇస్తారో లేదో అన్న అప‌న‌మ్మ‌కంతో అనూహ్యంగా వైసీపీ చెంత‌కు చేరిపోయారు. అయితే.. ఆయ‌న టికెట్ ద‌క్కించుకున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ హ‌వా కొన‌సాగినా విజ‌యం ద‌క్కించుకోలేకపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. నియోజ‌క‌వ‌ర్గాల మార్పులు.. వైసీపీలో అవ‌మానాలు.. త‌న మాట నెగ్గ‌క పోవ‌డం ఇవ‌న్నీ గుండుగుత్త‌గా ఆమంచిపై ప్ర‌భావం చూపించాయి. దీంతో వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాయి. త‌న‌కు న‌చ్చిన, త‌న‌ను మెచ్చిన‌ చీరాల‌నే ఎంచుకున్నారు.

చివ‌రాఖ‌రుకు.. ఏదో ఒక పార్టీ అండ అవ‌స‌రమ‌ని భావించారో.. లేక ష‌ర్మిల ఇమేజ్‌తో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంద‌ని లెక్క‌లు వేసుకున్నారో.. తెలియ‌దు కానీ.. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆమంచి దూరంగా ఉంటున్నారు. రాజ‌కీయాల‌కు సైతం దూరంగా ఉంటూ వ‌చ్చారు. కానీ, ఇప్పుడు వ్య‌క్తిగ‌తంగా చూసుకుంటే.. ఆయ‌న ప‌రిస్థితి ఇబ్బందిగా మారింది. ఈ క్ర‌మంలో జ‌న‌సేన వైపు ఆయ‌న చూపులు సాగుతున్నాయ‌ని కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది.

తాజాగా అందిన విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. జ‌న‌సేన‌లోకి ఆమంచి ఎంట్రీ దాదాపు ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే.. వ‌చ్చే నెల‌లో ఆయ‌న ఎంట్రీ ఉంటుంద‌ని అనుచరులు చెబుతున్నారు. ఆ వెంట‌నే నామినేటెడ్ ప‌ద‌విని కూడా ఆయ‌న‌కు ఆఫ‌ర్ చేయొచ్చ‌ని తెలుస్తోంది. ఇక్క‌డే మ‌రో విష‌యం ఏంటంటే.. ఆమంచి సోద‌రుడు స్వాములు.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌లో చేరారు. అయితే.. ఆయ‌న కోరుకున్న టికెట్ కాకుండా.. గిద్ద‌లూరు టికెట్ ద‌క్క‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చారు.

అప్ప‌టి నుంచి ఆమంచి ఫ్యామిలీతో జ‌న‌సేన కూడా దూరంగా ఉంది. కానీ, బ‌ల‌మైన నాయ‌కులు, సామాజికవ‌ర్గం కావ‌డంతో ఇప్పుడు కృష్ణ‌మోహ‌న్‌ను చేర్చుకునేందుకు ప్రాధ‌మికంగా ప‌చ్చ జెండా ఊపిన‌ట్టు తెలుస్తోంది. కృష్ణ‌మోహ‌న్ త‌ర్వాత స్వాములు సైతం ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ఈ కుటుంబానికి స‌న్నిహితంగా ఉండే నాయ‌కులు చెబుతున్నారు.

This post was last modified on January 24, 2025 7:03 pm

Share

Recent Posts

ఓటుకు నోటు తీసుకోవడం మానేయలేమా

ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…

1 hour ago

సోనియా వందేమాతరాన్ని ఆపమన్నారా

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…

2 hours ago

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే…

4 hours ago

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…

5 hours ago

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

11 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

12 hours ago